మందసము ఫిలిస్తీయులను బాధపెట్టుట

5 1. ఫిలిస్తీయులు ప్రభుమందసమును కైవసము చేసికొని ఎబెనెసెరు నుండి అష్డోదునకు కొనితెచ్చిరి.

2. అచ్చట దాగోను దేవాలయమునకు కొనిపోయి దాగోను సమీపమున నుంచిరి.

3. అష్డోదు ప్రజలు మరునాడు వేకువనే నిద్ర మేల్కొని చూడగా, దాగోను ప్రభుమందసము నెదుట నేలపై బోరగిలబడిఉండెను. వారు దాగోనును లేవనెత్తి అతని స్థానమున నిలిపిరి.

4. మరుసి రోజు ప్రజలు తెల్లవారకమునుపే నిద్ర లేచిచూడగా, మరల దాగోను యావే మందసము నెదుట బోరగిలబడియుండెను. దాగోను తల, రెండు చేతులు నరికివేయబడి గడపచెంత యుండెను. మొండెము మాత్రమే దాగోను స్థానమున పడియుండెను.

5. ఈ కారణము చేతనే దాగోను యాజకులుగాని, అతని మందిరమున ప్రవేశించు భక్తులుగాని నేికిని అష్డోదులోని దాగోను గుడి గడపత్రొక్కరు.

6. యావే అష్డోదును దాని పరిసరములయందలి ప్రజలను బొబ్బలతో పీడించి బాధపెట్టెను.

7. అష్డోదు పౌరులు ఆ ఉపద్రవమునకు తట్టు కోలేక ”యిస్రాయేలు దేవునిమందసము మనతో నుండరాదు. అతడు మనలను, మనము కొలుచు దాగోనును పీడించి పిప్పిచేయుచున్నాడు” అని అను కొనిరి.

8. కనుక వారు ఫిలిస్తీయుల అధికారులను సమావేశపరచి యిస్రాయేలు దేవునిమందసమును ఏమి చేయుదమా అని ఆలోచన చేసిరి. చివరకు దానిని గాతునకు కొనిపోవలయునని కలియబలుకుకొని ఆ నగరమునకు చేర్చిరి.

9. కాని మందసము గాతును చేరగనే ప్రభువు ఆ పట్టణప్రజలను ఘోరముగా పీడించుటచే చాల మంది చచ్చిరి. పెద్దలనక, పిల్లలనక పురములోని జనులందరు రహస్యస్థానములలో బొబ్బలులేచి బాధ పడజొచ్చిరి.

10. అందుచే గాతు ప్రజలు మందసమును ఎక్రోనునకు పంపివేసిరి. కాని మందసము ఎక్రోను చేరగానే పురప్రజలందరు పెద్దపెట్టున కేకలువేసి ”మనలను, మన ప్రజలను చంపుటకు ఈ యిస్రా యేలు దేవునిమందసమును ఇచ్చికికొని తెచ్చిరి” అనిరి.

11. వారు ఫిలిస్తీయుల అధికారులను పిలి పించి ”యిస్రాయేలు దేవునిమందసమును పంపి వేయుడు. దాని తావునకు దానిని చేర్చుడు. మమ్మును మా ప్రజలను చావునుండి తప్పింపుడు” అని వేడు కొనిరి. ప్రభువు ఎక్రోను ప్రజలను మిక్కిలిగా పీడించు టచే నగరమంతట జనులు కుప్పతెప్పలుగా పడిచచ్చిరి.

12. చావక బ్రతికినవారు పెడబొబ్బలుప్టిె కెవ్వున ఏడ్చిరి. వారి అంగలార్పులు మిన్నుముట్టెను.

Previous                                                                                                                                                                                                 Next