దుష్టునికిపట్టు దుర్గతి

ప్రధానగాయకునికి                               

ఎదోమీయుడైన దోయేగ్‌ సౌలువద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంికి వచ్చియున్నాడని అతనితో చెప్పినపుడు దావీదు రచించిన దైవధ్యానము

52 1.      వీరుడా! నీవు

                              నీ చెడ్డ పనులను గూర్చి విఱ్ఱవీగనేల?

                              ప్రభువు నిత్యము కృపజూపును.

2.           నీవు దినమెల్లయు

               ఇతరులను నాశనము చేయుటకు

               పన్నాగములు పన్నుచున్నావు.

               నీ నాలుక కక్షురకత్తివలె పదునైనది.

               నీవు ఇతరులకు ద్రోహము తలప్టిెతివి.

3.           నీవు మంచికంటె చెడ్డనెక్కువగా అభిలషించితివి.    సత్యముకంటె అసత్యమును

               ఎక్కువగా ఆదరించితివి.

4.           మోసపు నాలుక కలవాడా!

               నీవు నీ పలుకులతో

               ఇతరులను నాశనము చేయుచున్నావు.

5.           కనుక ప్రభువు నిన్ను

               నిత్య నాశనమునకు గురిచేయును.

               అతడు నీ ఇంినుండి

               నిన్ను మెడబ్టి గిెంవేయును.

               జీవవంతుల లోకమునుండి

               నిన్ను పెరికివేయును.

6.           ఈ ఉదంతమును జూచి

               న్యాయవంతులు భయభ్రాంతులగుదురు.

               వారు నిన్ను పరియాచకము చేయుచు

               ఇట్లందురు:

7.            ”ఇడుగో! దేవుని ఆశ్రయింపని నరుడు!

               ఇతడు తన బహుళ సంపదలను నమ్ముకొనెను.

               తన దుష్కార్యములే

               తనకు బలమొసగునని యెంచెను”.

8.           నా మట్టుకు నేను దేవునిమందిరమున

               ఎదుగు ఓలివుచెట్టువలె ఉన్నాను.

               నేను ప్రభువు కృపను సదా నమ్మెదను.

9.           దేవా! నీవు నాకు చేసిన మేలునకుగాను

               నేను నీకు నిత్యము వందనములు అర్పింతును. మంచితనముగల నీ నామమును

               భక్తసమాజమున ప్రకింతును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము