సీమోను పుత్రులు సెండెబేయసును ఓడించుట

16 1. సీమోను కుమారుడగు యోహాను గేసేరునుండి తండ్రియొద్దకు వచ్చి సెండెబేయసు ఆగడములను గూర్చి ముచ్చించెను.

2. సీమోను తన పెద్ద కొడుకులగు యోహాను, యూదాలను పిలచి, ఇట్లు చెప్పెను: ”నా తండ్రి కుటుంబమువారు, నా సోదరులు, నేను మా బాల్యమునుండియు మన శత్రు వులతో పోరాడుచు వచ్చితిమి. మేము చాల పర్యా యములు యిస్రాయేలీయులను ఆపదలనుండి రక్షించి తిమి.

3. కాని నేనిపుడు వృద్ధుడనైతిని. అయినను దేవుని అనుగ్రహమువలన మీరు మాత్రము మంచి వయసులో ఉన్నారు. కనుక మీరు నాకును  నా సోద రులకు బదులుగా మన జాతికొరకు పోరాడుడు. దేవుడు మీకు బాసటగా నుండుగాక!”        

4. అంతట యోహాను ఇరువదివేల మంది పదాతులను, ఆశ్వికులను, ప్రోగుజేసికొని సెండెబేయసు మీదికి వెళ్ళెను. వారు రాత్రి మోదేయీనున గడపి, 5. మరుసి వేకువన మైదానమునకు వచ్చిరి. అచట కాలిబంటులతోను, రౌతులతోను గూడిన బ్రహ్మాండ మైన శత్రుసైన్యము వానినెదిరింపగా, ఉభయ సైన్య ముల మధ్య ఒక నది అడ్డముండెను.

6. యోహాను అతని సైన్యము శత్రువులకు ఎదురుగా బారులు తీరెను. కాని అతని సైనికులు  నదిని దాటవెరచిరి. అపుడు యోహాను అందరికంటె ముందుగా తాను నదిని దాి ఆవలి ప్రక్కకు వెళ్ళెను. అతనిని చూచి అతని సైనికులు నదిని  దాిరి.

7.శత్రు సైన్యమున రౌతులు మిక్కుటముగా నుండిరి. కనుక యోహాను తన సైన్యమును రెండుభాగములుగా విభజించి రౌతు లను మధ్యలో నుంచెను.

8. సైనికులు పోరును ప్రారంభించుటకు బాకాలనూదిరి. సెండెబేయసు అతని సైనికులు ఓడిపోయిరి. వారిలో చాలమంది చచ్చిరి. మిగిలిన వారు తమ దుర్గమైన కేద్రోనునకు పారిపోయిరి.

9. యూదా యుద్ధమున గాయపడెను. కాని యోహాను సెండెబేయసు పునర్నిర్మించిన కేద్రోను దుర్గమువరకును శత్రువులను తరిమెను.

10. వారు పారిపోయి అసోటసు పొలములలోని కోట బురుజు లలో దాగుకొనిరి. కాని యోహాను ఆ బురుజులను తగులబట్టెను. ఆ దినము శత్రుసైనికులు రెండువేల మంది మడిసిరి. యోహాను సురక్షితముగా యూదయాకు తిరిగివచ్చెను.

సీమోను దుర్మరణము చెందుట, యోహాను నాయకుడగుట

11. సీమోను అబూబుసు కుమారుడగు ప్టోలమీని యెరికో మండలమునకు సైన్యాధిపతిగా నియ మించెను.

12. అతడు ప్రధానార్చకుడు సీమోనునకు అల్లుడు కనుకఅతనికి చాలవెండి, బంగారము కలదు.

13. అతనికి దురాశపెరిగి దేశమునంతిని కబళింప గోరెను. కనుక ప్టోలమీ సీమోనును, అతని కుమా రులను వధించుటకు కుట్రపన్నెను.

14. అప్పుడు సీమోను తన కుమారులైన మత్తతీయ, యూదాలతో ఆ ప్రాంత ములోని నగరములను సందర్శించి వాని అక్కరలు తీర్చుచుండెను. వారు గ్రీ.శ. నూటడెబ్బదిఏడవ యేడు (అనగా క్రీ.పూ. 134లో) షేబత అను పదునొకండవ నెలలో యెరికో నగరమునకు వచ్చిరి.

15. ప్టోలమీ వంచనతో వారిని తాను నిర్మించిన డోకు అను చిన్న దుర్గములోనికి కొనిపోయి అచట పెద్ద విందు ఏర్పాటు చేయించెను. కాని అతడు తన అనుచరులను అచట మాటుగానుంచెను.

16. సీమోను అతని కుమారులు ద్రాక్షసారాయమును సేవించిన వెంటనే ప్టోలమీ అతడి అనుచరులు తాము దాగియున్న తావునుండి వెలు పలికి వచ్చి కత్తులతో భోజనశాలలోనికి ఉరికిరి. సీమోనును, అతని యిద్దరు కుమారులను వారి సేవకు లలో కొందరిని వధించిరి.

17. ప్టోలమీ యిట్టి మహా  ద్రోహమునకు తలపడి ఉపకారమునకు బదులు అపకారము చేసెను. 

18.  అతడు రాజునకు లేఖ పంపి తాను చేసిన పనినంతిని వివరించి చెప్పెను. రాజు సైన్యములను పంపి తనకు సహాయము చేయవలె ననియు, దేశమును, నగరములను తన పరము చేయ వలెననియు  ఆ లేఖలో మనవిచేసెను.

19. ప్టోలమీ సైన్యాధిపతులకు గూడ జాబులు వ్రాసి వారు తనతో చేతులు కలుపవలెననియు, తాను వారికి వెండి బంగా రములు పంచి యిత్తుననియు మాటయిచ్చెను. అటు పిమ్మట అతడు యోహానును వధించుటకు గేసేరునకు బంటులను పంపెను.

20. యెరూషలేమును దేవాల యపు కొండను ఆక్రమించుకొనుటకు గూడ సైనికులను పంపెను.

21. కాని ఒక బంటు శత్రువులకంటె ముందుగా గేసేరు చేరుకొనెను. యోహానుతో ప్టోలమీ అతడి తండ్రిని, సోదరులను వధించెననియు, అతడిని గూడ చంపుటకు బంటులను పంపుచున్నాడని చెప్పెను.

22. ఆ వార్త విని యోహాను నిశ్చేష్టుడయ్యెను. కాని తనకు ముందుగనే వార్త అందినది కనుక అతడు తనను చంపవచ్చిన బంటులను బంధించి మట్టు ప్టిెంచెను.   

23-24. యోహాను తన తండ్రికి బదులుగా ప్రధానయాజకుడైన నాినుండి దేశమును పరిపా లించిన వైనమును వివరించు దినచర్యల గ్రంథములో అతడు చేసిన యుద్ధములు, అతని వీరకృత్యములు, అతడు నగరప్రాకారములను పునర్నిర్మించిన తీరు, అతడు చేసిన ఇతర కార్యములు మొదలగునవన్నియు లిఖింపబడియే ఉన్నవి.