గిల్బోవా యుద్ధమున సౌలు మరణించుట

31 1. యిస్రాయేలీయులు ఫిలిస్తీయులతో పోరా డిరి. కాని ఫిలిస్తీయులు వారిని ఓడించి గిల్బోవా కొండమీద మట్టుప్టిెరి.

2. ఫిలిస్తీయులు సౌలును, అతని కుమారులను చుట్టుమ్టుిరి. సౌలు తనయులైన యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవా రణమున కూలిరి.

3. సౌలు చుట్టు పోరు ముమ్మరమయ్యెను. కొందరు విలుకాండ్రు సౌలుపై బాణములు గుప్పించిరి. అతడు గాయపడి నేలపైకూలెను.

4. సౌలు తన అంగరక్షకునితో ”నన్ను నీ బాకుతో పొడిచిచంపుము. లేదేని సున్నతిసంస్కారములేని వారు నా మీదబడి వేళాకోళము చేయుదురు” అనెను. కాని అతని అంగ రక్షకుడు మిక్కిలి భయపడి అడుగైన కదల్పడయ్యెను. సౌలు తన కత్తినిదూసి, దాని మీదపడి ప్రాణములు వదలెను.

5. యజమానుడు ఈ విధముగా ప్రాణ ములు విడుచుటచూచి సౌలు అంగరక్షకుడు కూడ తన సొంత కత్తిమీదబడి అసువులు బాసెను.

6. ఆ రీతిని సౌలు, అతని మువ్వురు కుమారులు, అంగ రక్షకుడు అందరు ఆనాడే ప్రాణములు కోల్పోయిరి.

7. కొండకు ఆవలివైపు లోయలోను యోర్దాను సీమ లోను వసించు యిస్రాయేలీయులు తమవారు రణము నుండి పారిపోయిరనియు, సౌలు కుమారులతో పాటు, తన ఆయుధములు మోయువాడును ఒక దినముననే మరణించిరనియు విని స్వీయనగరము లను వీడి పలాయితులయిరి. ఫిలిస్తీయులు వచ్చి ఆ నగరములలో వసించిరి.

8. మరునాడు ఫిలిస్తీయులు చచ్చినవారి వస్త్ర ములు ఊడదీసికొని పోవుటకువచ్చిరి. సౌలు ముగ్గురు కుమారులతో గిల్బోవాకొండపై చచ్చి పడియుండుటను చూచిరి.

9. వారు అతని తల తెగనరికిరి. ఆయుధ ములు ఊడ్చిరి. తమ దేవతలకు, పౌరులకు విజయ వార్తలు చాిచెప్పుటకు దేశము నలుమూలలకు దూతలనంపిరి.

10. సౌలు ఆయుధములను అష్టారోతు దేవళమున పదిలపరిచిరి. అతని శవమును బేత్‌షాను ప్రాకారమునకు వ్రేలాడగ్టిరి.

11. యాబేషుగిలాదు పౌరులు ఫిలిస్తీయులు సౌలును అవమానపరచిరని వినిరి.

12. వారి నగరమునందలి వీరులందరును బయలుదేరి రాత్రియంతయు ప్రయాణముచేసిరి. సౌలు శవమును, అతని కుమారుల శవములను బేత్‌షాను ప్రాకారమునుండి దింపి యాబేషుకు కొనివచ్చి అచ్చట దహనము చేసిరి.

13. వారి అస్థికలను యాబేషులోని పిచులవృక్షము క్రింద పాతి ప్టిె ఏడునాళ్ళు ఉపవాసముండిరి.

Previous