విజ్ఞానమను స్త్రీమూర్తి ఆతిథేయము

9 1.         విజ్ఞానమను స్త్రీమూర్తి

                              తన భవనమును నిర్మించి,

                              ఏడుస్తంభములు నెలకొల్పెను.   

2.           ఆమె వేట మాంసమువండి,

               సుగంధ ద్రవ్యములు కలిపిన

               ద్రాక్షారసము సిద్ధముచేసి,

               భోజనపదార్థములు తయారుచేసెను.

3.           ఆమె తన పరివారమును నగరములోనికి

               పంపగా వారు ఉన్నతప్రదేశమున నిలుచుండి,

4.           ”జ్ఞానములేనివారు ఇచటకు రండు”

               అని జనులను ఆహ్వానించిరి.

               వివేకహీనునకు ఆమె ఇట్లు కబురు పంపించెను:

5.           ”రమ్ము, నేను తయారుచేసిన

               భోజనమును ఆరగింపుము.

               నేను  సిద్ధముచేసిన ద్రాక్షారసమును సేవింపుము.

6.           మూర్ఖత్వమును విడనాడెదవేని నీవు జీవింతువు.

               నీవు విజ్ఞాన పథమున నడువుము.”

మూర్ఖులు

7.            మూర్ఖుని మందలించువాడు నవ్వులపాలగును.

               దుష్టుని హెచ్చరించువాడు

               అవమానము కొనితెచ్చుకొనును.

8.           నీవు మూర్ఖుని మందలించినచో

               అతడు నిన్ను ద్వేషించి తీరును.

               కాని జ్ఞానిని మందలించినచో

               అతడు నిన్ను అభిమానముతో చూచును.     

9.           విజ్ఞానికి బోధించినచో అతని జ్ఞానము పెరుగును.

               ధర్మాత్మునికి ఉపదేశించినచో

               అతని తెలివి ఎక్కువగును.

10.         దేవునిపట్ల భయభక్తులు చూపుట

               విజ్ఞానమునకు మొదిమెట్టు.

               పవిత్రుడైన ప్రభుని తెలిసికొనుటయే వివేకము.

11.           నా వలన నీ ఆయుష్కాలము పెరుగును.

12.          విజ్ఞానివైనచో నీకు లాభము కలుగును.

               మూర్ఖుడవైనచో నష్టపోవునది నీవే.

మూర్ఖత్వమను స్త్రీ మూర్తి ఆతిథేయము

13. మూర్ఖత్వమను స్త్రీమూర్తికి నిలకడలేదు.

               ఆమె మూర్ఖురాలు, ఏమియు తెలియనిది.

14.          ఆమె తన ఇంి గుమ్మముచెంత,

               నగరమున ఎత్తయిన తావున కూర్చుండి

15-16. సొంత పనులమీద దారి వెంట

               అటునిటు తిరుగువారిని జూచి

               ”జ్ఞానము లేనివారు ఇచికి రండు”

               అని పిలుచును.

               వివేక హీనునితో ఆమె ఇట్లనును:

17. ”దొంగలించిన నీరు మిక్కిలి తీయగానుండును.

               దొంగలించిన భోజనము

               మిక్కిలి  రుచిగానుండును”.

18.          కాని ఆమె ఇల్లు మృత్యువునకు నిలయమనియు,

               ఆమె అతిథులు పాతాళలోకమునకు

               చేరుదురనియు,

               ఆ వివేకహీనునకు తెలియదు.