దేవాలయ గాయకులు

25 1. దావీదు రాజు, లేవీయ నాయకులు కలిసి దేవాలయమున ఆరాధనలో పాటలు పాడుటకు ఆసాపు, హేమాను, ఎదూతూను అనువారి సంతతిలో కొందరిని ఎన్నుకొనిరి. వారు సితారా, స్వరమండలము, చితాళములు మొదలైన వాద్యముల సంగీతముతో ప్రభువు సందేశము ప్రవచింపవలయును. ఆరాధన యందు పాటలు పాడువారి జాబితా, వారు చేయ వలసిన పనులతో చేర్చిన జాబితా యిది:

2. ఆసాపు నలుగురు కుమారులు సక్కూరు, యోసేపు, నెతన్యా, అషరేలాలు. వారు ఆసాపు చేతిక్రింద పనిచేసిరి. ఇతడు రాజుచెంత ప్రవచించెడివాడు.

3. ఎదూతూను యొక్క ఆరుగురు కుమారులు గెదల్యా, జెరీ, యెషయా, షిమెయి, హషబ్యా, మత్తిత్యా అనువారలు స్వరమండలము సంగీతముతో ప్రభువును స్తుతించుచు ఆయన సందేశమును ప్రవచించుచు తమ తండ్రి చేతిక్రింద పనిచేసిరి.

4. హేమాను పదునలుగురు తనయులు బుక్కీయా, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూవేలు, యెరీమోతు, హనన్యా, హననీ, ఎలీయాతా, గిద్దల్తీ, రోమామ్తీయెసరు, యోష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహసీయోతు.

5. వీరందరును ప్రభువు వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియైన హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని పదునలు గురు కుమారులను మరియు ముగ్గురు కుమార్తెలుగా ప్రభువు వృద్ధిచేసెను.

6. వారందరును తమ తండ్రి చేతిక్రింద పనిచేయుచు దేవాలయ ఆరాధనమున సితార, స్వరమండలము, చితాళములు వాయించుచు సంగీతము పాడెడివారు. ఆసాపు, ఎదూతూను, హేమాను రాజాజ్ఞకు లోబడియుండిరి.

7. ప్రభువు మందిరమున సంగీతము పాడెడి వారినందరిని తోడి లేవీయులతోపాటు నమోదుచేసిరి. వారందరు కలిసి 288 మంది.

8. వారందరు వృద్ధులైననేమి, యువకులైననేమి, ప్రావీణ్యము కల వారైననేమి, ప్రారంభకులైననేమి, తమతమ పనులను నిర్ణయించుకొనుటకు చీట్లు వేసికొనిరి.

9-31. పై 288 మందిని కుటుంబముల వారిగా 24 బృందములుగా చేసిరి. ఒక్కొక్క బృంద మున పండ్రెండుమంది కలరు. ఒక్కొక్కనికి ఒక నాయకుడుండెను. వారు ఈ క్రింది క్రమములో పని చేప్టిరి. మొదిచీి ఆసాపు వంశమునకు చెందిన యోసేపు, రెండవది గెదల్యా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. మూడవది సక్కూరు, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. నాలుగవది యిస్రీ, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఐదవది నెతన్యా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఆరవది బుక్కియా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఏడవది యెషరేలా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఎనిమిదవది యెషయా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండు గురు. తొమ్మిదవది మత్తన్యా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పదవది షిమీ, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పదకొండవది అసరెల్‌, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పన్నెండవది హషబ్యా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండు గురు. పదమూడవది షుబాయెలు, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పదు నాలుగవది మత్తిత్యా, అతడును అతని సహోదరు లును, కుమారులును పండ్రెండుగురు. పదిహేనువది యెరేమోతు, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పదునారవది హనన్యా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పదిహేడవది యోష్బెకాషా, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండు గురు. పద్దెనిమిదవది హననీ, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. పందొమ్మిదవది మల్లోతి, అతడును అతని సహోదరు లును, కుమారులును పండ్రెండుగురు. ఇరువయ్యవది ఎల్యాతా, అతడును అతని సహోదరులును, కుమారు లును పండ్రెండుగురు. ఇరువదియొకటవది హోతీరు, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు. ఇరువదిరెండవది గిద్దల్తీ, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండు గురు. ఇరువది మూడవది మహసీయోతు, అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండు గురు. ఇరువదినాలుగవది రొమమ్తీయేసేరు. అతడును అతని సహోదరులును, కుమారులును పండ్రెండుగురు.