యిస్రాయేలీయుల, యూదుల జనాభాలెక్కలు

24 1. ప్రభువు మరల యిస్రాయేలీయులపై కోపము తెచ్చుకొనెను. ఆయన దావీదును వారిపై పురికొల్పనెంచి అతనితో ”పొమ్ము! యిస్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించుము అని ఆజ్ఞ ఇచ్చెను.”

2. కనుక రాజు యోవాబుతోను, అతనితో నున్న సైనికోద్యోగులతోను, ”దాను నుండి బేర్షెబా వరకు గల యిస్రాయేలు తెగలన్నింని చ్టుివచ్చి జనాభా లెక్కలు తయారుచేయుడు. మన ప్రజలెందరో నేను తెలిసికోవలయును” అని వక్కాణించెను.

3. యోవాబు రాజుతో ”ప్రజల సంఖ్య ఎంతయున్నను నీవు బ్రతికియుండగానే యావే మన జనమును నూరంతలుగా వృద్ధిచేయగ చూచి, కన్నులపండువుగ సంతసింతువుగాక! కాని నా రాజువగు మీకు ఈ కోరిక ఏల పుట్టెను?” అని అనెను.

4. అయినను రాజు యోవాబునకు అతని తోడి సైనికోద్యోగులకు ఆజ్ఞ ఇచ్చెను. కనుక వారు యిస్రాయేలీయులను లెక్కించుటకై వెడలిపోయిరి.

5. వారు యోర్దానునది దాిపోయి అరో యేరున దిగి, లోయ మధ్యనున్న నగరమునుండి లెక్క మొదలిడి, గాదుమీదుగా యాసేరు మండలములకు వెడలిపోయిరి.

6. ఆ తరువాత గిలాదు వెళ్ళి అట నుండి హిత్తీయుల సీమలోని కాదేషుకు వెళ్ళిరి. అట నుండి కదలి దాను, సీదోను ప్రాంతములకు పోయిరి.

7. ఆ పిమ్మట తూరు దుర్గమును ముగించుకొని హివ్వీయులు, కనానీయులు వసించు నగరమును కూడ చ్టుి వచ్చి దక్షిణదిక్కున ఉన్న బేర్షెబవద్ద గల యూదా పల్లెపట్టులతో లెక్క ముగించిరి.

8. ఈ రీతిగా దేశ మంతిని లెక్కప్టిె తొమ్మిదినెలల ఇరువది రోజులు గడచినపిదప తిరిగి యెరూషలేము చేరుకొనిరి.

9. యోవాబు జనాభాలెక్క రాజునకు సమర్పించెను. కత్తి చేప్టి పోరు నెరపగల యోధులు యిస్రాయేలీయు లందు ఎనిమిదిలక్షలమంది, యూదీయులందు ఐదులక్షలమంది ఉండిరి.

అంటురోగము, ప్రభువు శాంతిజెందుట

10. కాని దావీదు ప్రజలను లెక్కప్టిెన తరువాత అంతరాత్మ అతనిని బాధించెను. అతడు ”ప్రభూ! నేను మహాపాపము కట్టుకొింని. నా అపరాధము మన్నింపుము. ఇి్ట తెలివిమాలినపని చేసితిని” అనెను.

11-12. కాని మరునాి వేకువన దావీదు నిద్ర మేల్కొనగనే ప్రభువువాణి దావీదునకు దార్శనీ కుడును, ప్రవక్తయునైన గాదుతో ”నీవు దావీదు నొద్దకు వెళ్ళి ఇట్లనుము. నేను నీకు మూడుకార్యములు నిర్ణయించితిని. వానిలో నీ ఇష్టము వచ్చిన దానిని ఎన్నుకొనుము. దానిని మాత్రమే జరుపుదును” అని చెప్పెను.

13. కనుక గాదు దావీదునొద్దకు వెళ్ళి ”ఈ దేశమున ఏడేండ్ల10పాటు కరువువచ్చుటకు ఒప్పు కొందువా? శత్రువులు మూడునెలల పాటు నిన్ను తరుముచుండగా పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమున మూడుదినములు అంటురోగము అలము కొనుటకు ఒప్పుకొందువా? ఈ మూడింలో ఏది కావలయునో జాగ్రత్తగా ఆలోచించి చెప్పుము. నన్నిటకు పంపిన దేవునికి నేను తిరిగి బదులుచెప్పవలయును” అనెను.

14-15. దావీదు ”నాకేమి తోచని చిక్కుల లోబడితిని. కాని నరుని చేతికి చిక్కుటకంటె యావే చేతికి చిక్కుటమేలు. ప్రభువు మిక్కిలి దయాపరుడు” అని పలికి అంటురోగమునే ఎన్నుకొనెను. అది పంటకాలము.

ప్రభువు నాి ప్రొద్దుినుండి నియమితకాలము ముగియువరకు అంటురోగము పంపెను. దాను నుండి బేర్షెబా వరకు డెబ్బదివేలమంది చచ్చిరి.

16. యావే దూత యెరూషలేము మీదబడి నగరమును నాశనము చేయబోవుచుండెను. కాని యావే పరి తాపము చెంది నాశనముచేయు దూతతో ”ఇక చాలు, నగరముమీదికి పోవలదు” అనెను. అప్పుడు దేవదూత యెబూసీయుడగు ఆరౌనా కళ్ళము చెంతనుండెను.

17. ఆ రీతిగా దేవదూత జనులను పీడించుట చూచి దావీదు యావేతో ”పాపము చేసి అపరాధము కట్టుకొనినది నేను. ఈ ప్రజలు అన్నెము పున్నెము ఎరుగరు. వీరిని విడిచిప్టిె నన్నును, నా కుటుంబ మును శిక్షింపుము” అని మనవి చేసికొనెను.

దావీదు బలిపీఠమును నిర్మించుట

18. ఆ రోజు గాదు దావీదు నొద్దకు వచ్చి ”యెబూసీయుడగు ఆరౌనా కళ్ళమున యావేకొక బలిపీఠము నిర్మింపుము” అని చెప్పెను.

19. గాదు చెప్పిన ప్రకారం దావీదు యావే ఆజ్ఞ పాించుటకు వెడలిపోయెను.

20. అపుడు ఆరౌనా కళ్ళమున గోధుమలు త్రొక్కించుచుండెను. అతడు మీది నుండి చూడగా దావీదు అతని కొలువుకాండ్రు వచ్చుచుండిరి. కనుక ఆరౌనా రాజునకెదురేగి సాష్టాంగనమస్కారము చేసెను.

21. అతడు ”ప్రభువు ఈ దాసుని చెంతకు విచ్చేయనేల?” అనెను. దావీదు ”ఈ కళ్ళపు నేలను కొని యావేకొక బలిపీఠము కట్టవలయును. అపుడు గాని ఈ అంటురోగము ఆగిపోదు” అనెను.

22. అతడు ”ప్రభూ! ఈ పొలము గైకొనుము. నీకు యోగ్యమనిపించిన కానుకలతో యావేకు బలి అర్పింపుము. దహనబలికి ఎడ్లు ఇవిగో! కట్టెలు కావ లయునేని కళ్ళమునూర్చు మ్రాను, ఎద్దులకాడి ఇవిగో!

23. వీనినన్నిని నీకు సమర్పించితిని. ప్రభువు నీవు సమర్పించు బలిని అంగీకరించుగాక!” అనెను.

24. కాని దావీదు ”ఓయి! పొలమును వెల ఇచ్చియే పుచ్చుకొందును. నేను డబ్బు చెల్లింపలేని దహనబలిని యావేకు సమర్పించువాడను కాను సుమా!” అని పలికెను. అతడు ఆరౌనా పొలమునకు, ఎడ్లకు ఏబది వెండికాసులు చెల్లించెను.

25. దావీదు అచట యావే నామమున బలిపీఠము నిర్మించి దహనబలి, సమాధానబలి సమర్పించెను. యావే దేశము కొరకు చేయబడిన విన్నపములను ఆలకింపగ అంటురోగము యిస్రాయేలీయులను విడిచిపోయెను.

Previous