ఏలీయా కాలమువరకు నడచిన రెండు రాజ్యముల చరిత్ర

యరోబాము పరిపాలనము

(క్రీ.పూ. 931-910)

14 1. యరోబాము కుమారుడైన అబీయాకు జబ్బుచేసెను.

2. యరోబాము తన భార్యతో ”నీవు రాణివని గుర్తుపట్టనివిధముగా మారువేషము వేసికొని షిలో నగరమునకు పొమ్ము. నేను రాజునగుదునని ముందుగనే ఎరిగించిన అహీయా ప్రవక్త అచట నివసించుచున్నాడు.

3. అతనికి పదిరొట్టెలు, అప్ప ములు, దుత్తెడుతేనె కొనిపొమ్ము. మన బిడ్డకేమి సంభ వించునో అతడు నీకు తెలియజెప్పును” అనెను.

4. ఆ విధముగనే యరోబాము భార్య మారువేషము వేసుకొని నగరమునకుపోయి అహీయా ఇల్లు చేరు కొనెను. అహీయాకు పెద్దప్రాయము వచ్చినందున దృష్టి మందగించియుండెను.

5. ”యరోబాము భార్య మారువేషములో మరియొక స్త్రీవలె నించుచు జబ్బుగా ఉన్న బిడ్డకు ఏమిసంభవించునో విచారించుటకై నీ వద్దకు వచ్చుచున్నది” అని ప్రభువు ముందుగనే అహీయాకు తెలియజేసెను. ప్రవక్త ఆమెతో ఏమి చెప్పవలయునోకూడ ముందుగనే తెలిపెను.

6. కనుక రాణి తనింకి రాగానే అహీయా ఆమె అడుగుల చప్పుడువిని ”అమ్మా! లోనికి రమ్ము. నీవు యరోబాము భార్యవని నేనెరుగుదును. నీవు మరొక స్త్రీ వలె నింప నేల? నేను నీకు దుఃఖకరమైనవార్త విన్పింపవలెను.

7. యరోబామునకు నీవు ప్రభువు పలుకులు ఇట్లు విన్పింపవలెను ‘నేను సామాన్య జనులనుండి నిన్నెన్నుకొని నా ప్రజలైన యిస్రాయేలీయులకు రాజును చేసితిని.

8. దావీదువంశీయుల నుండి రాజ్యమును గైకొని నీ వశముచేసితిని. అయినను నీవు నా ఆజ్ఞలను పాించుచు పూర్ణహృదయముతో నన్ను సేవించి, నాకు ప్రీతికరమైన కార్యములు చేసిన దావీదు చేసినట్లు చేయక, 9. నీ పూర్వరాజులకంటెను అధిక ముగా దుష్కార్యములు చేసితివి. నన్ను లెక్కచేయ వైతివి. రాతిబొమ్మలను, పోతబొమ్మలను పూజించి నాకు కోపమును రెచ్చగ్టొితివి.

10. కనుక నేను నీ ఇంివారిని మొదలంట నిర్మూలించెదను. పెద్దలు పిన్నలు అనక నీ కుటుంబమునకుచెందిన మగవారి నందరిని మట్టుపెట్టెదను. వేయేల? నీసంతతి వారి నందరిని కసవూడ్చినట్లు ఊడ్చివైచెదను.

11. నీ కుటుంబీకులెవరైన పట్టణమున చచ్చినచో వారిని కుక్కలు పీకుకొనితినును. పొలమున చచ్చినచో వారిని రాబందులు పొడిచితినును. ఇది ప్రభుడనైన నా పలుకు’.

12. అమ్మా! నీవిక మీ ఇంికి వెడలిపొమ్ము. నీవు పట్టణము చేరగానే బిడ్డడు చనిపోవును.

13. బిడ్డ మృతికిగాను యిస్రాయేలీయులు శోకించి అతనిని పాతిపెట్టుదురు. యరోబాము కుటుంబమున గౌరవ ప్రదముగా భూస్థాపనము జరుగునది ఈ బిడ్డనికి ఒక్కనికే. అతని కుటుంబమంతిలోను యిస్రాయేలు దేవుడైన ప్రభువునకు ప్రీతిపాత్రుడైనవాడు ఇతడొక్కడే.

14. ప్రభువు యిస్రాయేలీయులకు ఇంకొక రాజును నియమించును. అతడు యరోబాము వంశమును తుదమ్టుించును.

15. ప్రభువు యిస్రాయేలీయులను శిక్షించును. వారు ఏిలోనిరెల్లువలె భయముతో కంపించిపోదురు. ప్రభువు పితరులకిచ్చిన ఈ బంగారు నేలమీదినుండి యిస్రాయేలీయులను కూకి వ్రేళ్లతో పెకిలించివేయును. వారిని యూఫ్రీసు నదికి ఆవలివైపున చెల్లాచెదరుచేయును. ఆ ప్రజలు అషేరా దేవతను పూజించి ప్రభు కోపమును రెచ్చగ్టొిరి.

16. యరోబాము తాను పాపముచేసినది చాలక యిస్రా యేలీయుల చేతను పాపముచేయించెను గనుక ప్రభువు వారిని చేయివిడిచెను” అనెను.

17. అంతట యరోబాము భార్య తీర్సా పట్టణమునకు వెడలి పోయెను. ఆమె తన ఇంట అడుగిడుచుండగనే బిడ్డ చని పోయెను.

18. ప్రభువు తన సేవకుడైన అహీయా ప్రవక్త ముఖమున నుడివినట్లే యిస్రాయేలీయులు ఆ బిడ్డమృతికి శోకించి అతనిని పాతిప్టిెరి.

19. యరోబాము జీవితమునందలి ఇతరాంశములు, అతడు చేసినయుద్ధములు, పరిపాలించినతీరు, యిస్రాయేలు రాజులచరిత్రలో లిఖింపబడియే యున్నవి.

20. యరోబాము ఇరువది రెండేండ్లు పరిపాలించెను. అతడు తన పితరులతో నిద్రించగా అతని తరువాత అతని కుమారుడు నాదాబు రాజయ్యెను.

రెహబాము పరిపాలన కాలము

(క్రీ.పూ. 931-913)

21. యూదామండలమున సొలోమోను కుమా రుడు రెహబాము రాజ్యము చేసెను. రాజగునప్పికి అతని వయస్సు నలుబది ఒకటేండ్లు. అతడు యెరూషలేము నుండి పదిహేడేండ్లు పరిపాలించెను. యిస్రాయేలు దేశమంతినుండి ప్రభువు తన నామ మును నివాసస్థానముగా ఎన్నుకొనిన నగరమిది. రెహబాము తల్లి అమ్మోనీయురాలగు  నామా.

22. యూదీయులు తమ పితరులకంటె అధికముగా దుష్కా ర్యములు చేసి ప్రభువు కోపమును రెచ్చగ్టొిరి.

23. వారు ఉన్నతస్థలములపై బలిపీఠములను నిర్మించిరి. కొండలమీదను, వృక్షములక్రిందను రాతి స్థంభము లను, కొయ్యస్తంభములనుపాతి వానికి పూజలు చేసిరి.

24. వేశ్యలవలె ప్రవర్తించు పురుషులు నాడు ఆ దేశముననుండిరి. యిస్రాయేలీయులు ఆ భూమిని ఆక్రమించుకొనినపుడు ప్రభవు అచినుండి తరిమి వేసిన అన్యజాతిజనులు చేయు పాపకార్యములెల్ల యూదీయులును చేసిరి.

25. రెహబాము పరిపాలనాకాలము అయిదవ ఏట ఐగుప్తు రాజగు షీషకు యెరూషలేము మీదికి దండెత్తివచ్చెను.

26. అతడు దేవాలయమునుండియు రాజప్రాసాదమునుండియు ద్రవ్యమెల్ల దోచుకొని పోయెను. సొలోమోను చేయించిన బంగారుడాలులను గూడ కొల్లగొట్టెను.

27. వానికి మారుగా రెహబాము ఇత్తడి డాలులను చేయించి వానిని రాజప్రాసాద ద్వారమునకు కాపుండు బంటుల అధీనమునుంచెను.

28. యావే మందిరమునకు రాజు పోయినపుడెల్ల, వారు ఆ ఇత్తడి డాలులను మోసికొని పోయెడివారు. తరువాత వానిని యథాస్థానమునకు చేర్చెడివారు.

29. రెహబాము జీవితమునందలి ఇతరాంశ ములు, అతడుచేసిన పనులు యూదా రాజుల చరిత్రలో లిఖింపబడియేయున్నవి.

30. రెహబాము, యరోబాము బ్రతికియున్నన్నినాళ్లు ఇరువురును ఒకరితో ఒకరు పోరాడుకొనుచునేయుండిరి. 31. రెహబాము తన పితరులతో కూడ నిద్రించి దావీదుపురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని తల్లి అమ్మోనీయురాలగు నామా. అతని తరువాత అతని కుమారుడు అబీయాము రాజయ్యెను.