యూదా రాజ్యమున అమస్యా పాలనము (క్రీ.పూ. 796-781)

14 1. యిస్రాయేలున యెహోవాహాసు కుమారుడు యెహోవాషు పరిపాలనాకాలము రెండవయేట యూదాసీమలో యోవాషు కుమారుడు అమస్యా రాజయ్యెను.

2. రాజగునప్పికి అమస్యా ప్రాయము ఇరువది ఐదేండ్లు. అతడు యెరూషలేము నుండి ఇరువది తొమ్మిది యేండ్లు యేలెను. అతని తల్లి యెరూషలేమునకు చెందిన యెహోవద్దీను.

3. అతడు ప్రభువునకు ప్రీతికలిగించు కార్యములు చేసెను. అయినను అమస్యా దావీదు వింవాడు కాదు. అన్ని విషయములలో తనతండ్రి యెవాషు చేసిన ప్రకారము జరిగించెను.

4. అతడు ఉన్నతస్థలములను తొలగింప లేదు. ప్రజలు ఆ మందిరములలో బలులర్పించి సాంబ్రాణిపొగ వేయుచునే ఉండిరి.

5. అమస్యా తన పరిపాలనను సుస్థిరము చేసికొనగనే పూర్వము తన తండ్రిని చంపిన వారిని మట్టుపెట్టెను.

6. కాని వారి పిల్లలను వధింపలేదు. ”బిడ్డలదోషములకు తండ్రులనుగాని, తండ్రుల దోష ములకు బిడ్డలనుగాని వధింపరాదు. ఎవరి పాపము నకు వారినే శిక్షింపవలయును” అను మోషే ధర్మశాస్త్ర విధిని పాించెను.

7. అతడు మృతసముద్రమునకు దక్షిణమున నున్న ఉప్పులోయలో వేయిమంది ఎదోమీయులను జయించి వారి మండలమునందలి సేలా నగరమును పట్టుకొని దానికి యోక్తేలు అని పేరు పెట్టెను. నేికిని ఆ నగరమునకు అదియే పేరు.

8. అమస్యా యిస్రాయేలు రాజు యెహోవాషు వద్దకు దూతలనంపి అతనిని యుద్ధమునకు సవాలు చేసెను.

9. కాని యెహోవాషు ప్రతి సందేశము పంపి ”ఒకమారు లెబానోను కొండమీది ముండ్లపొద ‘నీ కుమార్తెను నా కుమారునకిచ్చి పెండ్లిచేయుము’ అని దేవదారు వృక్షమునకు కబురంపెను. అంతలో ఒక అడవిమృగము వచ్చి ఆ పొదను కాళ్ళతో త్రొక్కి వేసెను.

10. ఓయి అమస్యా! నీవు ఎదోమీయులను జయించితినని పొంగిపోవుచున్నావు. నీ ఇంిపట్టున పడియుండి విజయగర్వముతో విఱ్ఱవీగుము. మాతో చెలగాటమాడితివా నీకును, నీప్రజలకును ముప్పు తప్పదు” అని చెప్పించెను.

11. ఐనను అమస్యా ఊరుకోడయ్యెను. కనుక యెహోవాషు తన బలముతోవచ్చి యూదానందలి బెత్షెమెషు పట్టణముదగ్గర అమస్యా నెదిరించెను. 

12. ఆ పోరాటమున అమస్యా ఓడిపోగా అతని భటు లందరు పారిపోయిరి.

13. యెహోవాషు అమస్యాను బంధించి, యెరూషలేముమీదికి దాడిచేసి నగర ప్రాకారమును, ఎఫ్రాయీము ద్వారమునుండి మూల ద్వారము వరకు రెండువందల గజముల పొడవున పడగ్టొించెను.

14. ఆ రాజు తనకు దొరికిన వెండి బంగారములను, దేవాలయమున వాడు పరికరము లను, ప్రాసాద భాండాగారమునందలి నిధులను ప్రోగు జేసికొని బందీలను వెంటనిడుకొని సమరియాకు వెడలిపోయెను.

15. యెహోవాషు చేసిన ఇతరకార్య ములు, యూదారాజయిన అమస్యాతో యుద్ధమున అతడు చూపిన పరాక్రమము, యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియేయున్నవి.

16. అంతట యెహోవాషు తన పితరులతో నిద్రించి సమరియా యందు రాజసమాధులలో పాతిపెట్టబడెను. అటు తరువాత అతని కుమారుడు యరోబాము రాజయ్యెను.

17.యూదా రాజు అమస్యా యిస్రాయేలురాజు యెహోవాషు గతించినపిమ్మట పదునైదు ఏండ్లు జీవించెను.

18. అతడు చేసిన కార్యములు యూదా రాజులచరితమున వ్రాయబడియే ఉన్నవి.

19. శత్రువులు అమస్యాను యెరూషలేమున హత్యచేయబోగా అతడు లాకీషునకు పారిపోయెను. కాని శత్రువులు లాకీషునకు కొందరిని అతనితో పంపగా, వారుపోయి అచట అమస్యాను వధించిరి.

20. అతని శవమును గుఱ్ఱముమీద కొనివచ్చి దావీదు నగరమున అతని పితరుల సమాధులలో పాతిప్టిెరి.

21. యూదీయులందరు అమస్యా కుమారుడు అజర్యాను రాజునుచేసిరి. అతనికి అప్పుడు పదునారేండ్లు.

22. అతడు తండ్రి మరణానంతరము ఏలతు నగరమును జయించి పునర్నిర్మించెను.

యిస్రాయేలున యరోబాము(రెండవ) పరిపాలన (783-743)

23. యూదారాజ్యమున, యోవాషు కుమారుడు అమస్యా పరిపాలనాకాలము పదునైదవయేట, యెహోవాషు కుమారుడు యరోబాము యిస్రాయేలు నకు రాజై సమరియానుండి నలువది ఒకయేండ్లు పరిపాలించెను.

24. పూర్వము యిస్రాయేలును పాప మునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబాము వలె ఇతడును యావేకు గిట్టని దుష్కార్యములు చేసెను.

25. ఈ యరోబాము ఉత్తరమున హమాతు దిక్కు నుండి దక్షిణమున మృతసముద్రమువరకు గల యిస్రాయేలు దేశభాగములను శత్రువులనుండి మరల స్వాధీనము చేసికొనెను. యిస్రాయేలు దేవుడైన ప్రభువు, గాతుహేఫేరునకు చెందిన అమిత్తయి కుమారుడగు యోనా ప్రవక్తద్వారా, ఈ విజయము గురించి ముందుగనే ఎరిగించెను.

26. యిస్రాయేలీ యులు పడు అగచాట్లను వారిని ఎవ్వరును ఆదు కొనుటకు రాకపోవుటను ప్రభువు గుర్తించెను.

27. ప్రభువు యిస్రాయేలీయులను నేలమీదినుండి తుడిచి వేయదలచుకోలేదు. కనుక యరోబాము ద్వారా వారిని రక్షించెను.

28. యరోబాము చేసిన ఇతర కార్యములు, పరాక్రమవంతమైన అతని యుద్ధములు, అతడు దమస్కు, హమాతులను యిస్రాయేలునకు సంపాదించి ప్టిెనతీరు యిస్రాయేలురాజుల చరితమున లిఖింప బడియే ఉన్నవి.

29. యరోబాము తన పితరులతో నిద్రించిన తరువాత అతని కుమారుడు జెకర్యా రాజయ్యెను.