హిజ్కియా జబ్బుపడి కోలుకొనుట

20 1. ఆ రోజులలో హిజ్కియారాజు జబ్బుపడి ప్రాణాపాయస్థితిలో నుండెను. అపుడు ఆమోసు కుమా రుడును ప్రవక్తయునైన యెషయా రాజును చూడబోయి ”ప్రభువు సందేశమిది. నీవిక బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టు కొనుము” అని చెప్పెను.

2. హిజ్కియా గోడవైపు మొగము త్రిప్పి, 3. ”ప్రభూ! ఇన్నాళ్ళు నిన్ను చిత్తశుద్ధితో సేవించితిని. నీ చిత్తము చొప్పున నడుచు కొింని” అని ప్రార్థనచేయుచు మిక్కిలి దుఃఖించెను.

4. యెషయా రాజును వీడ్కొని రాజప్రాసాద మధ్య భాగమును దాిపోకమునుపే ప్రభువు వాణి యెషయాతో ”నీవు వెనుకకు తిరిగిపోయి నా ప్రజలను ఏలు హిజ్కియాతో ఇట్లు చెప్పుము: 5. ప్రభువు సందేశమిది. నీ పితరుడు దావీదు దేవుడను, ప్రభు డనైన నేను నీ మొరవింని, నీ కన్నీళ్ళను నా కన్నులార జూచితిని. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును. నీవు మూడుదినములలో దేవాలయమునకు పోవు దువు.

6. నేను నీ ఆయువును ఇంకను పదునైదేండ్లు పొడిగింతును. అస్సిరియారాజు నుండి నిన్ను నీ పట్టణమును కాపాడుదును. నా గౌరవార్థము, నా సేవకుడగు దావీదు నిమిత్తము, నేను ఈ నగరమును రక్షింతును” అని చెప్పెను.

7. అంతట యెషయా ”అత్తి పండ్ల గుజ్జును తెండు. రాజు వ్రణముపై ఉంచుడు. అతనికి ఆరోగ్యము చేకూరును” అనెను.

8. హిజ్కియా ”ప్రభువు నావ్యాధిని నయముచేయుననుటకును, మూడు రోజులపిదప నేను దేవాలయమునకు పోవుదు ననుటకును గుర్తు ఏమి?” అని ప్రవక్త నడిగెను.

9. యెషయా ”ప్రభువు తన మాట నిలబెట్టుకొనును. దానికి గుర్తిది. సూర్యుని నీడను పదిమెట్లు ముందుకు జరుపమందువా లేక పదిమెట్లు వెనుకకు జరుప మందువా?” అని అడిగెను.

10.హిజ్కియా ”పదిమెట్లు ముందుకు జరుపుట సులభమేగదా! కనుక పదిమెట్లు వెనుకకు జరిపినచాలును” అనెను.

11. అప్పుడు యెషయా ప్రభువును ప్రార్థింపగా సూర్యునినీడ ఆహాసు మెట్లపై పదిమెట్లు వెనుకకు పోయెను.

బబులోనియా దూతలు హిజ్కియా పరిపాలనాంతము

12. అదే కాలమున బబులోనియారాజును బలదాను కుమారుడునగు మెరోదక్బలదాను హిజ్కియా రాజు జబ్బుపడెనని విని అతనికొక లేఖ వ్రాసి బహుమతి పంపెను.

13. హిజ్కియా ఆనందముతో ఆ రాజదూతలను ఆహ్వానించి వారికి తన కోశాగార మందలి వెండిబంగారములను, సుగంధద్రవ్యము లను, పరిమళతైలములను, రక్షణాయుధములను చూపించెను. తన ప్రాసాదమునగాని, రాజ్యమునగాని హిజ్కియా వారికి చూపింపని వస్తువులేదు.

14. అంతట యెషయా హిజ్కియా రాజునొద్దకు వెళ్ళి ”వీరు ఎచ్చినుండి వచ్చిరి? నీతో ఏమిచెప్పిరి?” అని అడి గెను. హిజ్కియా ”వారు దూరదేశమైన బబులోనియా నుండి వచ్చిరి” అని జవాబు చెప్పెను.

15. ”వారు నీ ప్రాసాదమున ఏమేమి చూచిరి?” అని యెషయా అడిగెను. రాజు ”అంతయు చూచిరి. కోశాగారమున నేను వారికి చూపని వస్తువు ఒక్కియు లేదు” అనెను.

16. యెషయా ”అయినచో ప్రభువువాక్కు వినుము.

17. మీ ఇంటనున్న వస్తువులన్నింని నేి వరకు మీ పూర్వులుకూడ బ్టెిన వస్తుసామగ్రినంతిని బబులోనియాకు కొనిపోయెదరు. ఇక నీకేమియు మిగులదు.

18. నీ వంశజులను గూడ బబులోనియాకు తీసికొనిపోయెదరు. అచట వారు రాజప్రాసాదమున నపుంసకులుగా బ్రతుకుదురు” అని పలికెను.

19. కాని హిజ్కియా తన పరిపాలన కాలమున శాంతిభద్ర తలు నెలకొనియుండిన అదియే చాలును అనుకొనెను. కనుక అతడు ప్రవక్తతో ”ప్రభువు సందేశము మంచిదే” అని అనెను.

20. హిజ్కియా చేసిన ఇతరకార్యములు అతని సాహసకృత్యములు, అతడు చెరువును, సొరంగమును త్రవ్వించి పట్టణమునకు మంచినీిని సరఫరా చేయించుట మొదలగునవి అవన్నియు యూదారాజుల చరితమున లిఖింపబడియేయున్నవి.

21. హిజ్కియా తన పితరులతో నిద్రించగా అతని కుమారుడు మనష్షే రాజయ్యెను.