దేవుని నమ్మనివారు

ప్రధానగాయకునికి దావీదు కీర్తన

14 1.       దేవుడు లేడని మూర్ఖులు

                              తమ హృదయములో తలంతురు.

                              వారు దుష్టులై

                              ఘోరకార్యములు చేయుదురు.

                              మంచిని చేయువాడు ఒక్కడును లేడయ్యెను.

2.           జ్ఞానముకలిగి తనను పూజించువారు

               ఎవరైన ఉన్నారాయని తెలిసికొనుటకుగాను

               ప్రభువు ఆకాశమునుండి

               నరులవైపు పారజూచును.

3.           కాని జనులెల్లరును తప్పుత్రోవ ప్టిరి.

               ఎల్లరును దుష్టులైరి.

               మంచిని చేయువాడు ఒక్కడును లేడయ్యెను.

4.           నా ప్రజలను భోజనమువలె మ్రింగివేయుచు,

               భగవంతునికి ప్రార్థన

               ఏమాత్రము చేయని దుష్టులకు

               జ్ఞానము ఇసుమంతయు లేదా?

5.           పాపము చేయువారు ఎక్కువగా భయపడుదురు.

               ఎందుకనగా దేవుడు

               నీతిమంతుల పక్షముననున్నాడు.

6.           వారు పేదలయత్నములను

               భంగము చేయుదురు.

               కాని ఆ పేదలు ప్రభువునే ఆశ్రయింతురు.

7.            సియోనునుండి యిస్రాయేలునకు

               రక్షణ కలుగునుగాక!

               ప్రభువు తన ప్రజలకు

               అభ్యుదయమును దయచేసినపుడు

               యాకోబు సంతతియెల్ల సంతసించును.

               యిస్రాయేలీయులెల్లరు ప్రమోదము చెందుదురు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము