29 1.      ఎన్నిసార్లు మందలించినను

                              హృదయము మార్చుకొననివాడు

                              తలవని తలంపుగ,

                              మరల కోలుకొనని రీతిగ నాశనమగును.

2.           సత్పురుషులు పాలనము చేయునపుడు

               ప్రజలు సంతసింతురు.

               కాని దుష్టులు పాలించునపుడు

               జనులు మూలుగుదురు.

3.           విజ్ఞానప్రియుడైన పుత్రుడు

               తండ్రిని సంతసింపజేయును.

               వేశ్యలవెంట తిరుగువాడు సొమ్ము వ్యర్థముచేయును

4.           రాజు న్యాయము పాించునేని రాజ్యము స్థిరపడును

               అతడు దోచుకొనువాడు అయ్యెనేని

               రాజ్యము గుల్లఅగును.

5.           ప్రక్క వానిని పొగడువాడు,

               అతడి కాళ్ళకు వల పన్నుకొనును.

6.           దుర్మార్గులు తాముతవ్విన గోతిలో తామేకూలుదురు

               నీతిమంతులు సంతోషముతో మనుదురు.

7.            సత్పురుషుడు పేదవాని అక్కరలను గుర్తించును.

               కాని దుర్మార్గునకు ఆ పరిజ్ఞానము ఉండదు.

8.           దుష్టులు పట్టణమంతట కలవరము ప్టుింతురు

               కాని జ్ఞానులు ప్రజల కోపమునణచి

               శాంతిని నెలకొల్పుదురు.

9.           విజ్ఞుడు మూర్ఖుని మీద

               నేరము తెచ్చినచో గెలువజాలడు.

               మూర్ఖుడు అతనిని అపహసించి దూషించును.

10.         నరహంతలు సత్పురుషుని ద్వేషింతురు.

               కాని సజ్జనులు అతనిని అభిమానింతురు.

11.           మూర్ఖుడు తన కోపమును బయికి చూపును.

               కాని విజ్ఞుడు శాంతముతో దానినణచుకొనును.

12.          రాజు నీలివార్తలు వినువాడైనచో

               మంత్రులెల్లరు కొండెములు పలుకుదురు.

13.          పేదవానికి, వానిని పీడించువానికిగూడ

               కనులకు వెలుగునిచ్చువాడు ప్రభువే.

14.          పేదలకు న్యాయము జరిగించు

               భూపతి బహుకాలము పాలనము చేయును.

15.          దండనము, మందలింపు బాలునికి బుద్ధిగరపును.

               విచ్చలవిడిగాతిరుగు కుఱ్ఱడు

               తల్లికి అపకీర్తి తెచ్చును.

16.          దుర్మార్గులు పాలించినపుడు

               పాపము విజృంభించును.

               కాని ధర్మాత్ములు ఆ దుష్టుల పతనమును

               కన్నులార చూతురు. 

17.          నీ కుమారుని చక్కదిద్దినచో నీకతడివలన

               సంతృప్తి కలుగును.

               అతనిని చూచి నీవు సంతసింతువు.

18.          దైవోక్తి లేని తావున

               ప్రజలు హద్దుమీరి ప్రవర్తింతురు.

               దైవాజ్ఞలను పాించు నరులు ధన్యులు

19. బానిస వ్టి మాటలకు లొంగడు.

               వాడు మన మాటను అర్థము చేసికొనినను

               దానిని పాింపడు.

20.        ఆలోచన లేక త్వరపడి మ్లాడువానికంటె

               పరమ మూర్ఖుడు మెరుగు.

21.          బానిసను చిన్నప్పినుండి

               గారాబముగా పెంచినచో

               తుదకు కుమారుడుగానెంచబడును.

22.        కోపిష్ఠి తగవులుతెచ్చి పాపము పెంచును.

23.        గర్వాత్ముడు మన్నుగరుచును.

               వినయాత్ముడు గౌరవమును బడయును.

24.         దొంగతో పోవు తోడిదొంగ తనకుతానే శత్రువు,

               వాడు ఇతరుల శాపవచనములు

               ఆలకించియు నిజము చెప్పజాలడు.

25.        లోకమునకు భయపడువాడు చేటు తెచ్చుకొనును.

               ప్రభువును  నమ్మినవాడు  సురక్షితముగా మనును

26.        అందరు రాజు మన్నన కోరుదురు.

               కాని న్యాయము జరిపించువాడు దేవుడు ఒక్కడే.

27.         సత్పురుషులు దుష్టులను అసహ్యించుకొందురు.

               అట్లే దుష్టులును సత్పురుషులను

               చీదరించు కొందురు.