ఏడుగురు సోదరుల ప్రాణత్యాగము

7 1. మరియొకమారు శత్రువులు ఏడుగురు సోదరు లను, వారి తల్లిని బంధించిరి. రాజు వారిని కొరడాలతో క్టొించెను. ధర్మశాస్త్రము నిషేధించిన పందిమాంస మును తినవలెనని వారిని నిర్బంధము చేసెను.

2. అపుడు ఆ ఏడుగురిలో ఒకడు తన సోదరుల తరపున మాటలాడుచు ”రాజా! నీవు మమ్ము ప్రశ్నించి ఏమి తెలిసికోగోరెదవు? మేము ప్రాణములను విడనాడు టకైన అంగీకరింతుముగాని, మా పూర్వుల చట్టములను మీరము” అనెను.

3. ఆ మాటలకు రాజు ఆగ్రహము తెచ్చుకొని గంగాళమును పెనములను నిప్పులమీద కాల్చి వేడిచేయుడని సేవకులను ఆజ్ఞాపించెను. వార ట్లేచేయగా ఆ పరికరములు ఎఱ్ఱగా కాలి గనగన మండెను.

4. తల్లి, సోదరులు చూచుచుండగనే ఆ మాటలాడిన యువకుని నాలుక కోసి అతని తలమీది చర్మము ఒలిచి, కాలుసేతులు నరికివేయుడని రాజు సైనికులను ఆజ్ఞాపించెను.

5. వారు రాజు చెప్పినట్లే ఆ యువకుని అవయవములను నరికి అతనిని మొండె ముగా చేసిరి. అతడింకను ఊపిరి మాత్రము పీల్చు కొనుచుండెను. రాజు అతడిని కొనిపోయి గనగన మండుచున్న పెనముమీద పడవేయుడని ఆజ్ఞ యిచ్చెను. ఆ యువకుడు పెనముమీద మాడిపోగా పొగలు పైకి లేచెను. అప్పుడు ఆ ఆరుగురు సోదరులు వారి తల్లియు ఒకరినొకరు హెచ్చరించుకొనుచు మనము ధైర్యముగా చనిపోవుదమని ఒకరితోనొకరు చెప్పుకొనిరి.

6. ఇంకను వారు ”ప్రభువు మనలను గమనించుచునే ఉన్నాడు. అతడు మనలను ఆదరముతో చూచును. పూర్వము మోషే ప్రభువును విడనాడినవారిని గూర్చి పాట క్టినపుడు ఈ సంగతియే చెప్పెను. ప్రభువు తనను సేవించువారిని తప్పక కరుణించునని అతడు పేర్కొనెను” అని అనుకొనుచు ఒకరినొకరు ప్రోత్స హించుకొనిరి.

7. ఈ రీతిగా మొది సోదరుడు చనిపోయిన పిమ్మట సైనికులు రెండవవాని ప్రాణములతో చెల గాటమాడ నారంభించిరి. వారు అతని తలమీది వెండ్రుకలను చర్మమును పెరికివేసిరి. ”నీవు పంది మాంసము భుజింతువా లేక మమ్ము నీ శరీరమును ఖండలుగ నరికి వేయమందువా” అని అడిగిరి.

8. అతడు తన మాతృభాషలో ”నేను ఆ మాంసమును ముట్టుకోను” అని చెప్పెను. కనుక సైనికులు మొది వానినివలె అతనినికూడ హింసించిరి.

9. అతడు చివ రిసారిగా ఊపిరి పీల్చుకొని రాజుతో ”రాక్షసుడా! నీవు మమ్ము చంపిన చంపవచ్చుగాక, కాని విశ్వాధిపతి యైన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యమును దయ చేసి మేము శాశ్వతముగా జీవించునట్లు చేయును. ఆయన ఆజ్ఞలకు బద్ధులమై మేము ప్రాణములు కోల్పోవు చున్నాము” అని అనెను.

10. అటు తరువాత సైనికులు మూడవ సోదరుని బాధింపసాగిరి. అతడు సైనికులు ఆజ్ఞాపింప గనే నాలుకను తెరచి, చేతులు చాచెను.

11. మరియు అతడు ధైర్యముతో ”దేవుడే నాకు ఈ అవయవములను దయచేసెను. కాని వీనికంటె ప్రభువు ఆజ్ఞలు విలువైనవి. ప్రభువు వీనిని నాకు మరల దయచేయును” అనెను.

12. అతని సాహసమును, అతడు హింసలను లెక్క చేయకపోవుట చూచి రాజు, అతని పరివారము విస్తు పోయెను.

13. మూడవవాడు గతించిన పిమ్మట సైనికులు నాలుగవవానినిగూడ క్రూరహింసలకు గురిచేసిరి.

14. అతడు ప్రాణములు విడచుచు ”మీ చేతులలో చచ్చుట మాకు మేలే. ప్రభువు మమ్ము మరల జీవముతో లేపును. కాని మీకు పునరుత్థానము గాని నూత్నజీవము గాని లభింపవు” అనెను.

15. అటుపిమ్మట సైనికులు ఐదవవానిని హింసింప దొడగిరి.

16. అతడు రాజును తేరిపార చూచి ”ఓయి! నీవు మావిం నరుడవే. కాని మమ్ము నీ ఇష్టము వచ్చినట్లు చేయుటకును, మా ప్రాణములు తీయుట కును నీకధికారము కలదు. అయినను నీవు ప్రభువు మా ప్రజను చేయి విడచెననుకోవలదు.

17. కొంచెము వేచియుండుము. ఆయన తన మహాశక్తితో నిన్ను నీ అనుయాయులను ఎట్లు శిక్షించునో నీవే చూతువు” అనెను.

18. అటు తరువాత సైనికులు ఆరవ వానిమీద చేతులు వేసిరి. అతడు చనిపోవుచు శత్రువులను చూచి ”మీరు భ్రాంతిపడవలదు. మేము దేవునికి విరోధముగా పాపముచేసి ఇి్టతిప్పలు తెచ్చుకొింమి. ఈ ఘోర యాతనలన్నికి కారణము మా తప్పిదములే.

19. కాని మీరు దేవునితో పోరాడుచున్నారు. కనుక మీకు శిక్ష ఎంతమాత్రము తప్పదు” అని పలికెను.

20. కాని ఆ యువకులందరికంటె వారి తల్లి ఎక్కువగా ప్రశంసింపదగినది. ఎల్లరును జ్ఞప్తిలో ఉంచుకొని గౌరవింపదగినది. ఒక్కరోజునే ఆమె తన ఏడుగురి కుమారుల మరణము కన్నులార చూచెను. అయినను ఆమె ఆ ప్రభువును నమ్మినది కనుక ఆ వేదననంతిని ధైర్యముతో భరింపగల్గెను.

21. ఆమె స్త్రీ ప్రేమను, పురుష ధైర్యమును గూడ వ్యక్తము చేయుచు తన కుమారులలో ఒక్కొక్కనిని మాతృ భాషలో ఇట్లు ప్రోత్సహించెను.

22. ”నాయనలారా! మీరు నా కడుపునెట్లు ఊపిరిపోసికొింరో నేనెరుగను. మీకు జీవమును, ఊపిరిని ఇచ్చినది నేనుకాదు. మీ అవయవములను ఒక్కిగా అమర్చినది నేను కాదు.

23. ప్రపంచమును సృజించినవాడును, నరులను ప్టుించినవాడును, అన్ని ప్రాణులను చేసినవాడునైన దేవుడే మిమ్ము కలిగించెను. మీరు మీ ప్రాణముల కంటెగూడ ఆ ప్రభువు ఆజ్ఞలను అధికముగా గౌర వించుచున్నారు కనుక ఆ కరుణామయుడైన దేవుడు మీకు మరల జీవమును, ఊపిరిని దయచేయును.”

24. ఆ తల్లి మాటలు విని అంియోకసు ఆమె తనను ఎగతాళి చేయుచున్నదనుకొనెను. కనుక అతడు ఆమె కడగొట్టు కుమారునికి తన పూర్వుల సంప్రదాయ ములను విడునాడుమని శక్తికొలది చెప్పిచూచెను. ఆ బాలుడు తన మాటవినినచో తాను అతనిని ధనవంతుని, సుప్రసిద్ధుని చేయుదునని బాసచేసెను. ఇంకను అతనిని గొప్ప అధికారిని చేసి రాజమిత్రుల జాబితాలో చేర్తునని కూడ చెప్పెను.

25. కాని ఆ బాలుడు రాజు మాటలను లక్ష్యము చేయలేదు. కనుక రాజు ఆ బాలుని ఒప్పించి అతడి ప్రాణములను కాపాడుమని తల్లిని హెచ్చ రించెను.

26. అతడు చాలసేపు నచ్చచెప్పిన తరువాత ఆ తల్లి కుమారుని హెచ్చరించుటకు అంగీకరించెను.

27. ఆమె పుత్రుని మీదికి వంగి క్రూరుడైన ఆ రాజునకు తలవంపులు కలుగునట్లుగా మాతృభాషలో ఇట్లు చెప్పెను: ”నాయనా! నా పైని జాలిచూపుము. నిన్ను తొమ్మిదినెలలు నా కడుపున మోసితిని. మూడేండ్లు పాలిచ్చిపెంచితిని. నిన్ను అన్నపానీయములతో పోషించి ఈ ఈడువానినిగా చేసితిని.

28. బిడ్డా! నీవు భూమ్యా కాశములను, వానిలో కనిపించు సమస్తవస్తువులను పరిశీలించి చూడుము. దేవుడే శూన్యమునుండి వాని నన్నిని కలిగించెనని తెలిసికొనుము. ఆయన నరులనుకూడ అట్లే కలిగించెను.

29. నీవు ఈ నర హంతను చూచి భయపడవలదు. ఇపుడు నీ ప్రాణము లర్పించి నీవును నీ సోదరులకు తగినవాడివి అని పించుకొనుము. ఇట్లు చేయుదువేని నేను ప్రభువు అనుగ్రహము వలన, నీ సోదరులతోపాటు నిన్నును మరల స్వీకరింపగలుగుదును.”

30. ఆమె ఈ మాటలను ముగింపక మునుపే బాలుడు ”రాజా! నీవింకను దేనికొరకు వేచియున్నావు? నేను నీ ఆజ్ఞను పాింపను. మోషే మా పితరుల కిచ్చిన ధర్మశాస్త్ర విధులను మాత్రమే అనుసరింతును.

31. నీ మట్టుకు నీవు మా ప్రజలను సకల విధములైన క్రూరహింసలకు గురిచేయ చూచితివి. నీవు ప్రభువు శక్తిని తప్పించుకోజాలవు.

32-33. సజీవుడైన ప్రభువు మా మీద ఆగ్రహముచెందిన మాట నిజమే. ఆయన మా పాపములకుగాను మమ్ము దండించుచున్నాడు. మమ్ము శిక్షించి మాకు బుద్ధిచెప్పవలెనని ఆయన తలంపు. కాని మేమతని  దాసులము కనుక అనతి కాలములోనే ఆయన మమ్ము క్షమించును.

34. నీవు మాత్రము నరులందరిలోను మహాక్రూరుడవు. మహా పాపివి. నీవేమో గొప్పవాడవనుకొని భ్రాంతిపడి కన్ను మిన్నుగానక దేవుని ప్రజలను హింసించుచున్నావు.

35. నీవు సర్వశక్తిమంతుడును, సర్వమును పరిశీ లించువాడైన దేవుని తప్పించుకోజాలవు.

36. నా సోదరులు ప్రభువు నిబంధనలకు బద్ధులై క్షణకాలము శ్రమలనుభవించిరి. కాని ఇప్పుడు వారు నిత్యజీవ మును చూరగొనిరి. నీవు మాత్రము దేవుని తీర్పునకు గురియై, నీ మిడిసిపాటునకు తగిన దండనము  అనుభవించి  తీరెదవు.

37. నా సోదరులవలె నేనును మా పూర్వుల చట్టముల కొరకు నా శరీరమును, ప్రాణములను బలిగా అర్పించుచున్నాను. కాని దేవుడు మా జాతిమీద  శీఘ్రమే దయచూపవలెననియు ప్రభువే దేవుడని అంగీకరించువరకు ఆయన నిన్ను హింసింప వలెననియు నేను ప్రార్థించుచున్నాను.

38. ప్రభువు కోపము మా జాతియంతి మీదను రగుల్కొనెను. కాని ఆయన ఆగ్రహమునకు గురియైన వారిలో నా సోదరులును నేను కడపి వారలమగుదుముగాక!” అని పల్కెను.

39. అవమానకరములైన ఆ మాటలు విని రాజు మితిమీరిన ఆగ్రహము తెచ్చుకొని ఆ బాలకుని సోదరు లందరికంటె గూడ క్రూరముగా హింసించెను.

40. ఆ రీతిగా కడగొట్టువాడుకూడ గతించెను. అతడు ప్రభువునెంత మాత్రమును శంకింపక పూర్ణ విశ్వాసము  కనబరచెను.

41. శత్రువులు కుమారులందరి తరువాత తల్లినిగూడ సంహరించిరి. 

42. శత్రువులు యూదులను బలినైవేద్యములు భుజింపవలెనని నిర్బంధపెట్టుట గూర్చియు, వారిని క్రూరముగా హింసించుటను గూర్చియు ఈ సంగతులు చాలును.