22 1. ”సోదరులారా! తండ్రులారా! నా పక్షమున నేను చెప్పుకొనబోవు మాటలను ఆలకింపుడు”.

2. అతడు హీబ్రూ భాషలో మాట్లాడుట విని వారు ముందర కంటె ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు పౌలు ఇట్లు మాట్లాడసాగెను.

3. ”నేను సిలీషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను. కాని ఇక్కడ యెరూషలేమునందే పెరిగి, గమాలియేలు వద్ద విద్యాభ్యాసము గావించితిని. మన పూర్వుల చట్టమును గూర్చి, గట్టి ఉపదేశము పొందితిని. ఈనాడు ఇటనున్న మీరు అందరును దేవునకు మిమ్ము మీరు అంకితము కావించుకొనినట్లే నేనును నన్ను నేను అంకితము కావించు కొంటిని.

4. ప్రభు మార్గ మును అనుసరించిన ప్రజలను మరణము పాలగు నట్లు హింసించితిని. స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాలలో పడవేయించితిని.

5. ప్రధానార్చకుడును, విచారణసభలోని సభ్యులు అందరును నేను చేసిన దానికి సాకక్షులు. నేను వారియొద్ద నుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను  తీసికొనివచ్చి,  యెరూషలేములో శిక్షించు నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి, తీసికొని వచ్చుటకై నేను అటకు వెళ్ళితిని.

పౌలు పరివర్తన – పునః ప్రస్తావన 

6. ”అట్లు నేను పయనించి, దమస్కు సమీపించి నప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టును ప్రకాశించినది.

7. అప్పుడు నేను నేలమీద పడిపోగా, ‘సౌలూ! సౌలూ! నీవు ఏల నన్ను హింసించుచున్నావు?’ అని ఒక స్వరము నాకు వినిపించినది.

8. నేను ‘ప్రభువా! నీవు ఎవరవు?’ అని అడిగితిని. ‘నేను, నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును’ అని ఆయన నాతో చెప్పెను.

9. అప్పుడు నా వెంట నున్నవారు వెలుగును చూచిరిగాని, నాతో మ్లాడుచుండినవాని స్వరమును మాత్రము వినలేదు.

10.’ప్రభూ! నేను ఏమి చేయవలెను?’ అని ప్రశ్నింపగా, ఆయన, ‘లేచి దమస్కు పురమునకు పొమ్ము. నీవు ఏమి చేయవలెనని దేవుడు నిశ్చయించెనో అది అంతయు అక్కడ నీకు తెలుపబడును’ అని నాతో పలికెను.

11. కన్నులు మిరుమిట్లు గొలుపు ఆ కాంతిని కాంచుటచే, నేను యేది చూడలేకపోతిని. అందుచే నా సహచరులు నా చేతిని పట్టుకొని దమస్కులోనికి నడిపించుకొని పోయిరి.

12. ”అచ్చట, మన ధర్మశాస్త్రమునకు విధేయు డగు అననియా అను ఒక భక్తుడు ఉండెను. యూదులు అందరును అతడు మంచివాడు అని చెప్పుకొందురు.

13. అతడు నాయొద్దకు వచ్చి, నా ప్రక్కన నిలబడి, ”సౌలు సోదరా! నీ చూపును మరల పొందుము’ అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది, అతని వంక చూచితిని.

14. ‘మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకు, నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, తన సొంతస్వరముతో చెప్పుదానిని వినుటకు, నిన్ను ఎన్నుకొనియున్నాడు.

15. ఏలయన, నీవు చూచిన దానిని, విన్నదానిని జనులకందరకు తెలియజెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు.

16. ఇక ఆలస్యమేల? లేచి జ్ఞానస్నానము పొంది, ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను కడిగివేసికొనుము’ అని ఉపదేశించెను.

17. ”నేను తిరిగి యెరూషలేమునకు వెళ్ళి, దేవాలయములో ప్రార్థించుకొనుచుండగ పరవశుడనైతిని. 

18.  అప్పుడు ప్రభువు కనిపించి, ‘త్వరప డుము.  వెంటనే  లేచి యెరూషలేమును విడిచి వెళ్లుము. ఏలయన, ఇచ్చటనున్న ప్రజలు నన్నుగూర్చి నీవు ఇచ్చు సాక్ష్యమును అంగీకరింపరు!’ అని నాతో చెప్పెను.

19. ‘ప్రభువా! నేను ప్రతి ప్రార్థనామందిర మునకు వెళ్లి, నిన్ను విశ్వసించినవారిని పట్టి హింసించితి నని వారికి బాగుగా తెలియును.

20. నీ సాక్షియైన స్తెఫాను చంపబడి నప్పుడు నేను అచ్చటనే ఉండి ఆ హత్యను ఆమోదించుచు, ఆ హంతకుల వస్త్రములకు కావలియుింని’ అని మారు పలికితిని.

21. అందుకు ఆయన ‘నీవు పొమ్ము. చాల దూరముగా అన్యుల యొద్దకు నిన్ను పంపుచున్నాను’ అని ఆదేశించెను.”

పౌలు – పౌరసత్వపు హక్కు 

22. ఇంత వరకు ప్రజలు వినిరి. కాని, పౌలు, ఈ విషయమును చెప్పగనే వారు, ”ఇటువింవాడు భూమిమీద ఉండ కూడదు. అతను జీవించి ఉండ కూడదు” అని పెద్దగా కేకలువేయ నారంభించిరి.

23. వారు అట్లు కేకలువేయుచు వారి పై వస్త్రము లను గాలిలో ఊపుచు దుమ్మెత్తి పోయుచుండిరి.

24. సైన్యాధిపతి పౌలును కోటలోనికి తీసికొని పోవ బంౌతులకు ఆనతిచ్చి, యూదులు ఎందుకు అట్లు అరచుచున్నారో తెలిసికొనుటకు, పౌలును కొట్టుటకు ఆజ్ఞాపించెను.

25. పౌలును బంధించి కొరడాలతో కొట్టనునప్పుడు, అక్కడ నిలుచుండి చూచుచున్న శతాధిపతితో పౌలు ”విచారణ చేయకయే రోము పౌరుని కొరడాలతో కొట్టించుట న్యాయసమ్మతమా?” అని ప్రశ్నించెను.

26. ఆ శతాధిపతి అది విని సైన్యాధిపతివద్దకు పోయి ”మీరేమి చేయుచున్నారు? ఆ మనుష్యుడు రోము పౌరుడట!” అని తెలియజేసెను.

27. అందుచే ఆ సైన్యాధిపతి పౌలు వద్దకు వచ్చి, ”నీవు రోము పౌరుడవేనా? చెప్పుము” అని ప్రశ్నింపగా, ”ఔను” అని పౌలు జవాబిచ్చెను.

28. ఆ సైన్యాధిపతి, ”నేను చాల డబ్బుఖర్చుపెట్టి రోము పౌరుడనైతిని” అని పలుకగా పౌలు ”కాని నేను పుట్టుకతోనే రోము పౌరుడను” అని బదులు పలికెను.

29. పౌలును ప్రశ్నింపబోవు మనుష్యులు వెంటనే వెనుకకు తగ్గిరి. పౌలు రోము పౌరుడని తెలిసికొని సంకెళ్లతో బంధించినందుకై, ఆ సైన్యాధిపతి కూడ భయపడెను.

న్యాయసభ యెదుట పౌలు

30. యూదులు పౌలుపై మోపిన నేరము ఏమిటో కచ్చితముగా తెలిసికొనవలెనని తలచి, ఆ సైన్యాధిపతి మరుసటిరోజు పౌలు సంకెళ్లు  తీసివేయించి, ప్రధానార్చకులను, విచారణసభను సమావేశము కావలెనని ఆజ్ఞాపించెను. పిమ్మట పౌలును తీసికొనివచ్చి ఆ సభ ఎదుట నిలువబెట్టెను.