అష్దోదు వినాశనమును గూర్చి దైవవాక్కు

20 1. అస్సిరియారాజైన సర్గోను

                              తన సైన్యాధిపతియైన తర్తానును

                              అష్దోదుమీదికి పంపెను.

                              అతడు వచ్చి ఆ నగరమును ముట్టడించి స్వాధీనము చేసికొనెను.

2.           ఆ కాలమున ప్రభువు

               ఆమోసు కుమారుడైన యెషయాతో

               ”నీ నడుము మీది గోనెపట్టను తీసివేసి,

               పాదరక్షలను విడువుము” అని చెప్పెను.

               అతడు ప్రభువు ఆజ్ఞాపించినట్లే

               పాదరక్షలు విడిచి దిగంబరుడుగా నడిచెను.

3.           అష్దోదు లొంగిపోయినపుడు ప్రభువిట్లు పలికెను:

               ”నా సేవకుడైన యెషయా

               మూడేండ్లనుండి పాదరక్షలు విడిచి

               దిగంబరుడుగా తిరుగుచున్నాడు.

               అతడు ఐగుప్తు కూషు దేశములకుపట్టు దుర్గతికి

               గుర్తుగాను, సూచనముగాను ఉన్నాడు.

4.           అస్సిరియారాజు ఆ రెండు దేశములనుండియు

               బందీలను కొనిపోవును.

               అతడు ఆ దేశములనుండి

               పిన్నలను పెద్దలను గొనిపోవును.

               వారు బట్టలను చెప్పులను విడచివెళ్ళవలెను.

               వారి పిరుదుల మీద బట్టలేమియువుండవు.

               అది ఐగుప్తునకు అవమానకరమగును.

5.           యిస్రాయేలీయులు తాము నమ్మిన

               కూషును గూర్చియు,

               తాము గొప్పగా ఊహించుకొనిన

               ఐగుప్తీయులను గూర్చియు

               నిరాశచెంది సిగ్గుపడుదురు.

6.           ఆ కాలము వచ్చినపుడు

               సముద్రతీరమున వసించువారు,

               ”మనము నమ్మినవారికి

               ఎి్టగతి ప్టినదో చూడుడు!

               అస్సిరియారాజునకు భయపడి

               మనము వారి మరుగుజొచ్చితిమి.

               కాని ఇపుడు వారికి

               ఎి్టదుర్గతి ప్టినదో చూడుడు.

               ఇక  మనమెట్లు తప్పించుకోగలము?”         అని చెప్పుకొందురు.