21 1. యెహోషాఫాత్తు తన పితరులతో నిద్రింపగా అతనిని దావీదు నగరమున పాతిప్టిెరి. అటు తరువాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యెను.

5.యెహోరాము, పరిపాలన

2. యెహోషాఫాత్తు కుమారుడు యెహోరాము నకు ఆరుగురు సోదరులు కలరు. వారు అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యాహు, మికాయేలు, షెఫ్యా.

3. తండ్రి వారికి పెద్దమొత్తము వెండి బంగారములు, ఆభరణములు కానుకగా ఇచ్చెను. యూదాలోని సురక్షితపట్టణములకు వారిని అధిపతు లను చేసెను. యెహోరాము పెద్దవాడు కనుక రాజ్య మును అతని పరముచేసెను.

4. కాని యెహోరాము తండ్రిరాజ్యమును కైవసము చేసికొని అధికారమును సుస్థిరము చేసికొనగనే సోదరులను, యిస్రాయేలు నాయకులను మరికొందరినిప్టి చంపించెను.

5. యెహోరాము తన ముప్పది రెండవ యేట రాజై ఎనిమిదియేండ్లపాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను.

6. అతడు యిస్రాయేలును ఏలిన అహాబువిం దుష్టరాజుల పోకడలు అనుకరించెను. అహాబు కుమార్తెను పరిణయమాడెను. దుష్కార్యములు చేసి ప్రభువునకు అప్రియము కలిగించెను.

7. అయినను ప్రభువు పూర్వము దావీదుతో నిబంధనము చేసికొని అతని సంతతి కలకాలము ఈ రాజ్యమును పాలింతురని బాసచేసెను. కనుక అతని వంశమును రూపుమాపనొల్లడయ్యెను.

శిక్ష

8. యెహోరాము కాలమున ఎదోము యూదా మీద తిరుగుబాటుచేసి స్వాతంత్య్రము సంపాదించు కొని, సొంతరాజు నేర్పరచుకొనెను.

9. కనుక యెహోరాము తన సైన్యాధిపతులు రథములతో పోయి ఎదోమీయులను హతముచేసెను.

10. కాగా నేి వరకు జరుగుచున్నట్లు ఎదోమీయులు యూదావారిపై తిరుగబడుచూనేయుండిరి. అదే సమయమున యెహోరాము తన పితరుల దేవుడైన ప్రభువును విడ నాడినందులకు శిక్షగా లిబ్నా నగరము కూడ యూదా మీద తిరుగుబాటుచేసి స్వేచ్చను పొందెను.

11. ఆ రాజు యూదాలోని ఉన్నతస్థలములలో బలిపీఠము లను నిర్మించి యూదీయులను, యెరూషలేము పౌరు లను విగ్రహారాధనకు పురికొల్పెను.

12-13. అటు తరువాత ఏలీయా ప్రవక్త లేఖ ఒకి ఆ రాజునకు చేరెను: ”నీ వంశకర్తయైన దావీదు కొలిచిన దేవునివాక్కిది. నీవు నీ తండ్రి యెహోషాఫాత్తు మార్గమున, నీ తాత ఆసారాజు మార్గమున నడువక యిస్రాయేలు రాజులను అనుకరించితివి. అహాబు కుటుంబమువలె నీవును యూదీయులను, యెరూష లేము పౌరులను విగ్రహారాధనకు ప్రేరేపించితివి. పైపెచ్చు నీకంటె ఉత్తములైన నీ సోదరులను చంపించి తివి.

14. దీనికి ప్రతీకారముగా ప్రభువు నీ ప్రజలను, భార్యలను, బిడ్డలను దారుణముగా శిక్షించును. నీ ఆస్తిపాస్తులను నాశనము చేయును.

15. నీ మట్టుకు నీవు ఘోరమైన ఆంత్రవ్యాధికి చిక్కుదువు. ఆ ఉదర రోగము నానాికి ముదిరి నీ ప్రేవులు తెగిపడును.”

16. అప్పుడు కొందరు ఫిలిస్తీయులు, అరబ్బీ యులు కూషీయులతో కలసి జీవించుచుండిరి. ప్రభువు వారినందరిని యెహోరాము మీదికి పురి కొల్పెను.

17. కనుక వారు యూదామీద దాడిచేసిరి. రాజ ప్రాసాదమును కొల్లగ్టొి అతని భార్యలను, కుమారులను బందీలనుగా కొనిపోయిరి. కడగొట్టు కొడుకైన అహస్యా మాత్రము మిగిలెను.

18. ఈ కష్టములన్ని వాిల్లిన పిదప ప్రభువు ఆ రాజును ఘోరమైన ఆంత్ర వ్యాధితో పీడించెను.

19. రెండేండ్లు ఈ రోగముతో బాధపడినపిదప అతని ప్రేగులు తెగి బయికివచ్చెను. అతడు దుర్భరమైన బాధతో కన్ను మూసెను. పౌరులు యెహోరాము పితరులమృతికివలె అతని మృతికి సంతాప సూచకముగా మంటవేయరైరి.

20. రాజు అగునప్పికి యెహోరామునకు ముప్పది రెండేండ్లు. అతడు యెరూషలేమునుండి ఎనిమిదేండ్లు పరిపాలించెను. ఆ రాజు చావునకు ఎవరును కంటతడిపెట్టలేదు. అతనిని దావీదు నగర ముననే పాతిప్టిెరి. కాని రాజసమాధులలో మాత్రము కాదు.