నాసీరు వ్రతము

6 1-3. దేవుడైన యావే మోషేతో ”యిస్రాయేలు ప్రజలతో ఇట్లు చెప్పుము: నాసీరు వ్రతము1 ప్టి తన జీవితమును ప్రభువునకు సమర్పించుకొనగోరిన వారు స్త్రీయైనను, పురుషుడైనను ద్రాక్షసారాయమును, ఘాటైనమద్యమును, ద్రాక్షపండ్లరసమును సేవింప రాదు. ద్రాక్షపండ్లు పచ్చివైనను, ఎండినవైనను భుజింప రాదు.

4. ఆ వ్రతమును పాించినన్నాళ్ళు ద్రాక్ష సంబంధమైనది ఏదియును, కడకు ఆ పండ్ల విత్తనము లను, ఆ పండ్లమీది చర్మమునుకూడ ముట్టుకోరాదు.

5. వ్రతమును పాించినన్నాళ్ళు కక్షురకత్తి అతని తలవెంట్రుకలను తాకరాదు. అతడు ప్రభువునకు సమర్పితుడైనన్నినాళ్ళు నాసీరువ్రతమునకు బద్ధుడై యుండును గాన తన తలవెంట్రుకలను స్వేచ్ఛగా పెరుగనీయవలెను.

6. వ్రతమును పాించినన్నాళ్ళు శవము దగ్గరకు వెళ్ళకూడదు.

7. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు చనిపోయినను ఆ శవమును తాకరాదు. అతడు ప్రభువునకు తనను తాను సమర్పించుకొనెననుటకు అతని తలవెంట్రుకలే నిదర్శనము.

8. నాసీరు వ్రతమును పాించినన్నాళ్ళు అతడు ప్రభువునకు చెందినవాడు.

9. నాసీరువ్రతముప్టిన వాని సమక్షమున ఎవరైన హఠాత్తుగా చనిపోయినచో అతని తలవెంట్రు కలు అపవిత్రమగును. కనుక అతడు ఏడవనాడు తలవెంట్రుకలు తీయించుకోవలెను.

10. ఎనిమిదవ నాడు రెండు తెల్లగువ్వలను గాని లేక రెండు పావురపు పిల్లలను గాని నిబంధనగుడారమున యాజకునకు అర్పింపవలెను.

11. యాజకుడు ఆ పకక్షులలో ఒకదానిని పాపపరిహారబలిగాను, మరియొకదానిని దహనబలిగాను సమర్పించును. ఆ రీతిగా వ్రతము ప్టినవాడు శవమును తాకుటవలన కలిగిన అపవిత్రతను పోగ్టొి యాజకుడు అతనిని శుద్ధుని చేయును. ఆ దినమే అతడు తన తలవెంట్రుకలను మరల ప్రభువునకు సమర్పించుకోవలెను.

12. అతడు నాసీరువ్రతమును పాింపదలచుకొన్న దినము లన్నియు తన్నుతాను మరల ప్రభువునకు సమర్పించు కోవలెను. దోషపరిహారబలిగా ఒక ఏడాది మగ గొఱ్ఱె పిల్లను దేవునికి సమర్పింపవలెను. శాపమువలన అతని తలవెంట్రుకలు అపవిత్రమైనవి కావున ఈ ప్రాయశ్చిత్తమును జరిపించుటకు ముందు తాను నాసీరువ్రతమున గడిపిన దినములు లెక్కకురావు.

13.నాసీరువ్రతము ప్టినవాడు వ్రతాంతమున ఈ క్రింది ఆచారమును పాింపవలెను. అతడు సాన్నిధ్యపుగుడారమునొద్దకు వచ్చి ప్రభువునకు  కానుక  సమర్పించుకోవలెను.

14. దహనబలికి ఏడాది మగ గొఱ్ఱెను, పాపపరిహారబలికి ఏడాది ఆడుగొఱ్ఱెను, సమాధానబలికి ఒక పొట్టేలును సమర్పింపవలెను. ఈ జంతువులు నిర్దోషముగా ఉండవలెను.

15-16. మరియు గంపెడు పొంగని రొట్టెలను సమర్పింప వలెను. వానిని నూనెతో కలిపిన పిండితో చేయ వలెను. వీనితోపాటు నూనెపూసిన పొంగని చిన్న రొట్టెలను కూడ అర్పింపవలెను. వీనితో పాటు ధాన్యమును, ద్రాక్షసారాయమును కూడ కొనిరావలెను.

17. నాసీరువ్రతము సలుపువాడు పొట్టేలును వధించి సమాధానబలిని సమర్పింపవలెను. గంపలోని పొంగని రొట్టెలు అర్పింపవలెను. వాితోపాటు యాజకుడు ధాన్యమును, ద్రాక్షసారాయమును అర్పించును.

18. అంతట వ్రతముప్టినవాడు ప్రత్యక్ష గుడార ద్వారమునొద్ద, తన తలవెంట్రుకలు తీయించి వానిని సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయ వలయును.

19. యాజకుడు పొట్టేలుయొక్క ఉడక బ్టెిన ముంది తొడను తీసికొని, బుట్టనుండి పొంగని పెద్దరొట్టెను, చిన్నరొట్టెను తీసికొని వ్రతాచరుని చేతులలో పెట్టును.

20. అటు తరువాత యాజకుడు వానిని ప్రభువునకు అల్లాడింపు అర్పణగా అర్పించును. అవి పవిత్ర వస్తువులు కనుక యాజకునికే చెందును. పైగా పొట్టేలురొమ్మును, అల్లాడింపబడిన వెనుకి తొడయు యాజకునికే చెందును. ఇది అంతయు ముగిసిన తరువాత నాసీరు వ్రతాచరుడు మరల ద్రాక్షసారాయమును సేవింపవచ్చును.

21. నాసీరువ్రతాచరుడు పాింపవలసిన ఆచారమిది. అతడు తలవెంట్రుకలనేకాక మరి దేనినైన ప్రభువునకు సమర్పించెదనని స్వయముగా మ్రొక్కు కొనినచో, ఆ మ్రొక్కును గూడ తీర్చుకోవలెను” అని చెప్పెను.

యాజకుల దీవెన

22-23. దేవుడైనయావే మోషేతో ”అహరోను, అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించునపుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలెనని చెప్పుము:

24. ‘యావే మిమ్ము దీవించి కాపాడునుగాక!

25. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక!

26. యావే మిమ్ము కృపతోజూచి మీకు సమాధానమును ఒసగునుగాక!’

27. మీరు యిస్రాయేలు ప్రజలను ఆశీర్వదించు నపుడు ఈ రీతిగా నా పేరు ఉచ్ఛరించిన నేను వారిని దీవించెదను” అని చెప్పెను.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము