అన్యజాతుల నుండి వైదొలగుట

13 1. ఆ రోజులలో జనులకు మోషే ధర్మశాస్త్ర మును చదివి వినిపించుచుండగా ”అమ్మోనీయు లనుగాని, మోవాబీయులనుగాని దేవుని ప్రజలతో  కలియనీయరాదు”అను వాక్యము విన్పించెను.

2. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చునపుడు అమ్మోనీయులు, మోవాబీయులు వారికి ఆహారపానీ యములు ఒసగరైరి. పైగా వారు బలాముతో మ్లాడు కొని అతనిచే యిస్రాయేలీయులను శపింపచేసిరి. కాని మన దేవుడు ఆ శాపమును దీవెనగా మార్చెను.

3. పై వాక్యమును చదువగా విని యిస్రాయేలీయులు అన్యజాతి వారినందరిని తమ చెంతనుండి అవతలికి పంపివేసిరి.

నెహెమ్యా సంస్కరణలు

4. యాజకుడగు ఎల్యాషిబు దేవాలయ భాండా గారమునకు అధిపతి. అతడు తోబియాకు బంధువు.

5. కనుక అతడు తోబియాను దేవాలయమున ఒక పెద్దగదిని ఆక్రమించుకొననిచ్చెను. ఆ గదిలో అంతకు ముందు దేవాలయమునకర్పించిన ధాన్యము, సాంబ్రాణి, పాత్రలు, యాజకులకిచ్చిన పదయవవంతు ధాన్యము, లేవీయులు, గాయకులు, ద్వార పాలకులకొరకిచ్చిన పదియవవంతు పంట ధాన్యము, ద్రాక్షసారాయము, ఓలీవునూనెను భద్రపరచియుంచెడివారు.

6. తోబియా ఆ గదిని ఆక్రమించుకొనినపుడు నేను యెరూషలేము నందు లేను. అర్తహషస్త బబులోనియాను ఏలుచున్న ముప్పది రెండవయేట నేను ఆ రాజును చూడబోయి తిని. కొంతకాలము గడచినపిదప నేనతని ఆజ్ఞ గైకొని, 7. యెరూషలేమునకు తిరిగివచ్చితిని. అప్పుడు ఎల్యాషిబు తోబియాకు దేవాలయమున ఒక గది ఏర్పరచి దుష్క ృత్యము చేసెనని బహుగా దుఃఖపడి, 8. తోబియా వస్తువులన్నిని ఆ గదినుండి బయట వేయించితిని.

9. గదిని శుద్ధిచేయించితిని. దేవా లయ వంట పాత్రలను, ధాన్యమును, సాంబ్రాణిని మరల యథాస్థానమునకు చేర్పుడని ఆజ్ఞాపించితిని.

10. లేవీయులకు చెందవలసినవంతు వారికి అందకపోవుటచే సేవచేయు లేవీయులు, గాయకులు యెరూషలేమును విడనాడి పల్లెలలోని వారి పొల ములను సాగుచేసి కొనబోయిరి.

11. నేను దేవాల యమును ఇట్లు గాలికివదలివేయుదురా అని పెద్దలను మందలించితిని. లేవీయులను, గాయకులను మరల తీసుకొనివచ్చి దేవాలయమున చేర్పించితిని.

12. అప్పుడు యిస్రాయేలీయులందరు పంటలో పదియవ వంతు, ద్రాక్ష సారాయము, ఓలివునూనెను కొనివచ్చి దేవాలయమునకర్పించిరి.

13. నమ్మకము గల వ్యక్తులు అని పేరు పొందిన షెలెమ్యా అను యాజ కుని, సాదోకు అను పండితుని, లేవీయులలో పెదాయాను దేవాలయ భాండాగారమునకు కాపరు లుగా నియమించితిని. మత్తన్యా మనుమడును సక్కూరు కుమారుడునగు హానాను వారికి సహాయ కుడు. వారెల్లరు నమ్మదగినవారు. భాండాగారము నుండి తోడిపనివారికి ఆయా వస్తువులను పంచి ఇచ్చుట వారి బాధ్యత.

14. ప్రభూ! ఈ సత్కార్య మునకుగాను నన్ను గుర్తుంచుకొనుము. నీ దేవాల యము, దేవాలయారాధనము కొరకు నేను చేసిన కృషిని విస్మరింపకుము.

15. ఆ రోజులలో యూదీయులు కొందరు విశ్రాంతిదినమున ద్రాక్షసారాయము తయారుచేయుట గమనించితిని. మరికొందరు ధాన్యమును, ద్రాక్ష సారాయమును, ద్రాక్షపండ్లను, అత్తిపండ్లను, వివిధ బరువులను గాడిదల పైకెక్కించి యెరూషలేములోనికి కొనిపోవుట గూడ చూచితిని. విశ్రాంతిదినమున వానిని అమ్మవలదని హెచ్చరించితిని.

16. తూరు దేశస్తులు కొందరు  యెరూషలేమున  మకాము చేయుచు  చేపలు  మరియు  వివిధవస్తువులు యెరూషలేమునకు తీసికొనివచ్చి విశ్రాంతిదినమున యూదులకు అమ్ముచుండిరి.

17. నేను యూద నాయకులను చీవాట్లు ప్టిె ”మీరు ఎంత పాడుపని చేయుచున్నారు! విశ్రాంతి దినమును అమంగళ పరచుచున్నారుగదా!

18. మునుపు మన పితరుల్టి దుష్కార్యము చేయుటవలననే గదా ప్రభువు ఈ నగరమును నాశనము చేసినది? ఇపుడు మీరు మరల పవిత్రదినమును అపవిత్ర పరచినచో ప్రభువు కోపించి మునుపికంటె అధికముగా యిస్రాయేలీ యులను నాశనము చేయడా? అని హెచ్చరించితిని.

19. కనుక విశ్రాంతిదినము ప్రారంభమై చీకట్లు అలుముకొనగనే నగరద్వారములను మూసివేయ వలెనని పవిత్రదినము ముగియువరకు వానిని మరల తెరువరాదని ఆజ్ఞా పించితిని. విశ్రాంతిదినమున బరువులను నగరము లోనికి తీసికొని రాకుండుటకై సేవకులను కొందరిని ద్వారమునొద్ద కాపుంచితిని.

20. వివిధ వస్తువులను అమ్ము వ్యాపారులు ఒకి రెండుసారులు విశ్రాంతిదిన సాయంత్రమున నగర ద్వారమునొద్ద పడిగాపులు కాసిరి.

21. నేను ”మీరు రేయి ద్వారమునొద్ద కని ప్టిెకొనియుండనేల? ఇి్ట కార్యము మరల చేయుదు రేని మిమ్ము శిక్షించి తీరుదును”అని వారిని బెదిరించితిని. నాినుండి వారు మరల పవిత్రదినమున రాలేదు.

22. లేవీ యులు విశ్రాంతిదినమును అమంగళ పరపకుండు టకై తమను తాము శుద్ధిచేసికొని నగరద్వారము వద్ద కాపుండవలెనని ఆజ్ఞాపించితిని. ప్రభూ! ఈ సత్కార్య మునకు గూడ నన్ను గుర్తుంచుకొనుము. నీవు కృపా మయుడవు గనుక నన్ను రక్షింపుము.

23.ఆ కాలమున యూదులు అష్టోదు, అమ్మోను, మోవాబు, పడుచులను పెండ్లియాడుటగూడ గమ నించితిని. 24. వారికి ప్టుిన పిల్లలలో సగముమంది అష్డోదు భాష మ్లాడెడివారు. కాని వారు యూదా భాష మ్లాడలేకపోయిరి. వారు నానా భాషలలో మ్లాడిరి.

25. నేను వారినందరిని చీవాట్లుప్టిె శపించితిని. కొందరిని క్టొి వారి తలవెంట్రుకలను పెరికివేసితిని. ఇకమీదట వారుగాని, వారి బిడ్డలుగాని అన్యజాతివారిని పెండ్లియాడకుండునట్లు ప్రభువుపేర బాస చేయించితిని.

26. ”సొలోమోను అన్యజాతి రాజులందరికంటెను గొప్పవాడు. ప్రభువతనిని ఆదరించి యిస్రాయేలులందరికి రాజుగా చేసెను. అయినను అన్యజాతి భార్యలతనిని పాపమునకు పురి కొల్పిరిగదా?

27. ఇప్పుడు మీరును య్టిిి దుష్కా ర్యము చేయవలయునా? అన్యజాతి స్త్రీలను పెండ్లి యాడి దేవునికి ద్రోహము చేయుదురా? మీ విం వారి మాటలు మేము ఆలకించవచ్చునా?” అని  ప్రశ్నించితిని.

28. ప్రధానయాజకుడును ఎల్యాషిబు కుమారు డునైన యెహోయాదా.  ఇతని  కుమారుడొకడు బేత్‌హోరోనునకు చెందిన సన్బల్లటు కుమార్తెను పెండ్లి యాడెను. కనుక నేనతనిని నా వద్దనుండి వెళ్ళ గ్టొించితిని.

29. ప్రభూ! ఈ ప్రజలు యాజకత్వ మునకు తలవంపులు తెచ్చిరి. యాజకులతో, లేవీ యులతో నీవు చేసిన నిబంధనను అవమానపరచిరి. కనుక వారిని జ్ఞాపకముంచు కొనుము.

30. ఆ రీతిగ నేను అన్యజాతి జనులనుండి మన ప్రజలను వేరుజేసి వారిని పవిత్రపరచితిని. యాజకుల, లేవీయుల బాధ్యతలు తెలియజేసితిని.

31. ఆయా కాలములలో దేవాలయమునకు వంట చెరకు, ప్రథమఫలములు సమర్పణకై కొనిరావలెనని నియమములు చేసితిని. ఈ మంచి పనులన్నికిగాను ప్రభూ! నీవు నన్ను గుర్తుంచుకొనుము

Previous