ఆసా ఆరాధన సంస్కరణములు

శాంతి

14 1. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా, అతనిని దావీదునగరమున పాతిప్టిెరి. తరువాత అతని కుమారుడు ఆసా రాజయ్యెను. అతని కాలమున దేశము పదియేండ్లపాటు పూర్ణశాంతిని అనుభవించెను.

2. ఆ రాజు ధర్మబద్ధముగా ప్రవర్తించి యావేకు ఇష్టుడయ్యెను.

3. అతడు అన్యదేవతల బలి పీఠములను తొలగించెను. ఉన్నతస్థలముల మీది పూజామందిరములను పడగ్టొించెను. దేవతా ప్రతిమలను పెరికించెను.  అషేరా1 కంబములను నరికించెను.

4. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభుని ఆజ్ఞలు అనుసరింపవలయుననియు, ఆయన చిత్తమును పాింపవలయుననియు కట్టడచేసెను.      

5. ఆసా యూదామండలములో ఉన్నత స్థలములోని సూర్యదేవత స్తంభములను యూదా నగరములన్నిం నుండి తొలగించెను. కనుక అతనికాలమున దేశమున శాంతినెలకొనెను.

6. ప్రభువు ఆసా కాలమున యుద్ధములను ఆపివేసి శాంతిని దయచేసెను గనుక అతడు యూదా నగరములకు ప్రాకారములను నిర్మించెను.

7. అతడు యూదీయులతో, ”మన నగరము లకు ప్రాకారములు, బురుజులు నిర్మింతము. ద్వార ములకు గడెలు బిగింతము. మనము దైవచిత్తమును పాించితిమి కనుక ఈ దేశము మీద ఆధిపత్యమును నెరపుచున్నాము. అతడు మనలను రక్షించి శాంతిభద్ర తలు దయచేసెను” అని చెప్పెను. ఆ రీతిగా వారు ప్రాకారములు క్టి అభివృద్ధిని సాధించిరి. 

8. ఆసాకు డాళ్ళు, బల్లెములు తాల్చిన యోధులు యూదా నుండి మూడులక్షలమందియుండిరి. బెన్యామీనుమండలము నుండి డాళ్ళు, ధనుస్సులు ధరించిన వారలు రెండు లక్షల ఎనుబదివేల మందియుండిరి. వీరందరు పరా క్రమవంతులైన యోధులు.

జేరా దాడి

9. కూషీయుడైన జేరా పదిలక్షల మంది యోధు లతో మూడువందల రథములతో దండువెడలి మరేషా వరకు వచ్చెను.

10. ఆసా సైన్యముతోపోయి అతనిని ఎదిరించెను. ఇరుపక్షముల సైన్యములు మరేషావద్ద జెపాతా లోయలో బారులు తీరెను.

11. ఆసా తన ప్రభువునకు ప్రార్థనచేసి ”దేవా! నీవు బలవంతులకును, బలహీనులకును గూడ సాయము చేయువాడవు. ఇప్పుడు మాకు తోడ్పడరమ్ము. నిన్నునమ్మి మేము ఈ మహాసైన్యమును ఎదిరించు చున్నాము. నీవే మా ప్రభుడవు. ఏ నరుడును నిన్ను జయింపజాలడు” అని వేడుకొనెను.

12. యూదీయులు ఆసా నాయకత్వమున పోరు ప్రారంభింపగా, ప్రభువు కూషీయులను ఓడించెను. వారు రణరంగము నుండి పారిపోయిరి.

13. ఆసా వారిని గెరారు వరకు తరిమికొట్టెను. కూషీయులు చాలమంది హతమైరి. కనుక వారి సైన్యము పోరు కొనసాగింపజాలదయ్యెను. ప్రభువు తన సేనలతో వారిని మట్టుప్టిెంచెను. యూదా సైనికులు వారి నుండి కొల్లసొమ్ము విస్తారముగా దోచుకొనిరి.

14. వారు గెరారు చుట్టుపట్ల గల నగరములనుగూడ నాశనము చేసిరి. ఆ ప్రాంతపు ప్రజలెల్ల ప్రభువునకు భయపడి గడగడవణకిరి. యూదీయులు ఆ నగర ములను దోచుకొని కొల్లసొమ్ము మిక్కుటముగా ప్రోగుచేసికొనిరి.

15. మరియు వారు అచి పశువుల శాలల మీదబడి, చాల గొఱ్ఱెలను, ఒంటెలను తోలుకొని వచ్చిరి. అటుపిమ్మట ఎల్లరును యెరూషలేమునకు తిరిగివచ్చిరి.