ఎఱ్ఱని ఆవుపెయ్య బూడిద

19 1-2. ప్రభువు మోషే అహరోనులతో ”యిస్రాయేలీయులకు ఈ క్రింది ఆజ్ఞలనిండు. ఇప్పి వరకు కాడిని మోయనిదియు, ఎి్ట అవలక్షణములు లేనిదియునగు ఎఱ్ఱని ఆవుపెయ్యను ఒక దానిని కొనిరండు.

3. దానిని యాజకుడగు ఎలియెజెరునకు అర్పింపుడు. ఆ పెయ్యను శిబిరమువెలుపల అతని యెదుటనే వధింపవలెను.

4. ఎలియెజెరు దాని నెత్తురును కొనగోళ్ళతో సమావేశపుగుడారపువైపు ఏడుసార్లు చిలుకరింపవలెను.

5. చర్మము, మాంసము, నెత్తురు, ప్రేవులతోపాటు ఆ పెయ్యను యాజకుని ముందటనే పూర్తిగా కాల్చివేయవలెను.

6. అతడు దేవదారు కొయ్యను, నెత్తురు చిలుకరించు హిస్సోపు మండను, ఎఱ్ఱనినూలును తీసికొని ఆ పెయ్యను కాల్చుచున్న నిప్పులో పడవేయవలెను.

7. అటు పిమ్మట అతడు తన బట్టలు ఉతుకుకొని తలస్నానము చేసి శిబిరమునకు వెళ్ళిపోవచ్చును. అయినను అతడు సాయంకాలమువరకు మైలపడియుండును.

8. ఆవు పెయ్యను దహనము చేసినవాడు కూడ తన బట్టలు ఉతుకుకొని తలస్నానము చేయవలెను. అతడు కూడ సాయంకాలము వరకు మైలపడియుండును.

9. శుద్ధుడైన నరుడు ఒకడు దహింపబడిన ఆ ఆవుపెయ్య బూడిదను ప్రోగుజేసి శిబిరమునకు వెలుపల ఒక శుభ్రమైన స్థలమున ఉంచవలెను. యిస్రాయేలీయు లలో మైలపడిన వారిని శుద్ధిచేయుటకై పాపపరిహార జలముగా వారికొరకు దానిని పదిలపరుపవలెను. నరులను పాపమునుండి శుద్ధిచేయుటకై ఇట్లు చేయవలెను.

10. ఆవు పెయ్య బూడిదను ప్రోగుచేసిన వాడు తన బట్టలు ఉదుకుకోవలెను. కాని అతడు సాయంకాలమువరకు మైలపడియుండును.

యిస్రాయేలీయులకు గాని వారితో జీవించు పర దేశీయులకు గాని ఈ నిత్యమైనకట్టడ కలకాలము వర్తించును.

శవమును ముట్టుకొనుట

11. శవమును ముట్టుకొనినవాడు ఏడురోజుల వరకు మైలపడియుండును.

12. అతడు మూడవ దినమునను మరియు ఏడవదినమునను శుద్ధీకరణ జలముతో శుద్ధిచేసుకొనినపిదప శుద్ధినొందును. అటుల చేయనివారు శుద్ధినొందరు.

13. శవమును ముట్టుకొని శుద్ధిచేసికొనని వారు ప్రభుమందిరమును మైలపరుతురు. శుద్ధీకరణజలము వారిమీద చిలుకరింపబడలేదు. కనుకవారిని సమా జమునుండి వెలివేయవలెను, వారిమైల వారిని వదలదు.

14. మీ గుడారమునందు ఎవరైనను చనిపోయి నపుడు అక్కడ ఉన్నవారును, అందు ప్రవేశించువారును ఏడుదినములవరకు మైలపడుదురు.

15. ఆ గుడార మున ఉన్న పాత్రలు మూతవేయబడక తెరిచియున్నచో అవియును మైలపడిపోవును.

16. వెలుపలి పొలమున ఎవరైనను మృతదేహమునుగాని, హతునిదేహమును గాని, మృతులఎముకలనుగాని, సమాధులనుగాని ముట్టుకొనినచో ఏడుదినములవరకు మైలపడుదురు.

శుద్ధీకరణజలము

17. ఇటువింమైలను తొలగింపవలెనన్న పాప పరిహారముగా దహనము చేయబడిన ఆవుపెయ్య బూడిదను తీసికొని ఒక మ్టిపాత్రలో ఉంచి పారు చున్న యేినీరును దానిలో పోయవలెను.

18. అంతట మైలసోకని నరుడొకడు ఆ నీిలో-హిస్సోపు మండలను ముంచి గుడారముమీదను, దానిలోని నరులమీదను, కుండలమీదను చిలుకరింపవలెను. మృతదేహమునుగాని, హతునిదేహమునుగాని, ఎము కలనుగాని, సమాధులనుగాని ముట్టుకొని మైలపడిన వానిమీదగూడ ఆ నీిని చిలుకరింపవలెను.

19. పవిత్రుడొకడు మైలసోకిన వానిమీద మూడవ దినమున, ఏడవదినమున నీళ్ళు చిలుకరింపవలెను. అతడు ఏడవదినమున శుద్ధుడగును. అతడు బట్టలు ఉతుకుకొని స్నానముచేసిన పిదప సాయంకాలమున శుద్ధుడగును.

20. మైలసోకినవారు ఈ రీతిగా శుద్ధిచేయించు కొననియెడల వారిని సమాజమునుండి వెలివేయవలెను. లేదేనివారు ప్రభుని గుడారమును మైలపరతురు. వారిమీద శుద్ధీకరణజలము చిలుకరింపబడలేదు కదా! కనుక వారు అపవిత్రులు.

21. ఇది మీకు శాశ్వతనియమముగా ఉండ వలెను. శుద్ధీకరణజలము చిలుకరించువాడు తన బట్టలు ఉతుకుకొనవలెను. ఈ జలములు ముట్టు కొనినవాడు సాయంకాలమువరకు మైలపడియుండును.

22. మైలపడినవాడు ముట్టుకొనిన వస్తువులును మైలపడిపోవును. ఆ వస్తువులను ముట్టుకొనినవారును మైలపడిపోవుదురు” అనెను.

Previous                                                                                                                                                                                                     Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము