4 1.         ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని ”మేము మా అన్నమునే తిందుము, మా వస్త్రములనే తాల్తుము, మమ్ము నీ పేరున చలామణి కానిమ్ము. అప్పుడు మా అవమా నము తొలగిపోవును” అని అందురు.

యెరూషలేమున శేషజనము

2.           ఆ రోజున ప్రభువు చిగురు

               సొబగుగను, గొప్పదిగను ఉండును.

               నేలనుండి మొలచిన పైరు

               యిస్రాయేలు శేషజనమునకు,

               గర్వకారణముగను  అలంకారముగను ఉండును.

3.           సియోనున శేషించియున్నవారు,

               యెరూషలేమున మిగిలియున్నవారు,

               అనగా జీవమునొంద యెరూషలేములో దాఖలైన

               ప్రతివాడును పరిశుద్ధుడని పిలువబడును.

భవిష్యత్తులో అభ్యుదయము

4.           ప్రభువు తీర్పుతీర్చు ఆత్మచే, దహించు ఆత్మచే

               ప్రజలకు తీర్పుతీర్చి, వారిని శుద్ధిచేయును. ఆయన సియోను కుమార్తెల

               మాలిన్యమును కడిగివేయును.

               సియోనునందు చిందిన నెత్తుికి

               ప్రాయశ్చిత్తము చేయును.

5.           ఆయన సియోను కొండమీదను,

               దానిపైని ప్రోగయిన జనముమీదను

               పగలు మబ్బును, పొగను క్రమ్మించును.

               రేయి కాంతిమంతమైన జ్యోతిని వెలుగించును.

               ప్రభువుతేజస్సు నగరమంతిని

               చాందినివలె కప్పును.

6.           ఆయన తేజస్సు గుడారమై

               పగలు ప్రజలను ఎండ పొడనుండి కాపాడును.

               జనులు తలదాచుకొను తావుగా ఉండును.

               వాన, గాలివాన వచ్చినపుడు            ఆశ్రయముగా ఉండును.