యిస్రాయేలున హోషేయ పరిపాలన (క్రీ.పూ. 732-724)

17 1. యూదాసీమలో ఆహాసు పరిపాలనా కాలము పండ్రెండవయేట ఏలా కుమారుడు హోషేయ యిస్రాయేలుకు రాజై సమరియా నుండి తొమ్మిదేండ్లు పరిపాలించెను.

2. అతడును యావే ఒల్లని దుష్కార్య ములు చేసెను. అయినను అతడు పూర్వపు యిస్రా యేలు రాజులంతి దుర్మార్గుడు కాదు.

3.అస్సిరియా రాజు షల్మనేసెరు అతనిమీదికి దండెత్తివచ్చెను. హోషేయ అతనికి లొంగి ఏటేట కప్పము కట్టుటకు అంగీకరించెను.

4. కాని ఒక యేడు హోషేయ ఐగుప్తు రాజు సో వద్దకు దూతలనంపి షల్మనేసెరునకు కట్ట వలసిన కప్పమును ఎగగొట్టెను. ఈ గోడమీదిపిల్లి వాలకమును చూచి అస్సిరియారాజు హోషేయను అతని కుతంత్రమునకు గాను బంధించి చెరలో వేయించెను.

సమరియా పతనము (క్రీ.పూ. 721)

5. అంతట షల్మనేసెరు యిస్రాయేలు మీదికి దండెత్తివచ్చి సమరియాను ముట్టడించి మూడేండ్ల పాటు దానిని ఆక్రమించుకోజూచెను.

6. మూడవ యేట, అనగా హోషేయ యేలుబడి తొమ్మిదవయేట, అస్సిరియా రాజు సమరియాను పట్టుకొనెను. అతడు యిస్రాయేలీయులను అస్సిరియాకు బందీలుగా కొని పోయి కొందరికి హాల నగరమునను, కొందరికి గోజాను సీమలోని హాబోరు నదీప్రాంతమునను, కొందరికి మేదియా సీమలోను నివాసములు కల్పించెను.

యిస్రాయేలు పతనమునకు కారణములు

7. ప్రభువు ఐగుప్తునుండి, ఫరోదాస్యము నుండి యిస్రాయేలీయులను విడిపించెనుగదా! అయినను వారు ప్రభువును లక్ష్యముచేయలేదు. కనుక సమరియా కూలిపోయెను.

8. వారు అన్యదేవతలను కొలిచిరి. ఆ ప్రభువు యిస్రాయేలీయుల సమక్షమునుండి తరిమి వేసిన స్థానికజాతుల దుష్టాచారములను పాించిరి.

9. యిస్రాయేలు ప్రజలు నియమించుకొనిన రాజులు, యావే సహింపని పాపకార్యములు చేసిరి. వారు చిన్న పల్లెలు మొదలుకొని పెద్ద పట్టణముల వరకు అన్ని తావులందు అన్యదైవములకు బలిపీఠములు నిర్మించిరి.

10. ప్రతి కొండమీద ప్రతి పచ్చనిచెట్టు క్రింద అషేరా దేవతస్తంభములు, ప్రతిమలు స్థాపించిరి.

11. ప్రభువు ఆ నేల మీదినుండి వెడలగ్టొిన స్థానికజాతుల ఆచా రము ననుసరించి అన్యదైవములకు ధూపమువేసిరి. పలు దుష్కార్యములుచేసి ప్రభువు కోపము రెచ్చగ్టొిరి.

12. ప్రభువు ఆజ్ఞ మీరి విగ్రహముల నారాధించిరి.

13. ప్రభువు తన దూతలద్వారా, ప్రవక్తలద్వారా యిస్రాయేలీయులను, యూదీయులను హెచ్చరించెను. ”మీ దుష్కార్యములనుండి వైదొలగి నేను ప్రవక్తల ద్వారా మీ పితరులకిచ్చిన ధర్మాజ్ఞలను పాింపుడు” అని మందలించెను.

14. అయినను వారు ప్రభువు మాట పాింపరైరి. తమ పితరులవలె తామును తలబిరుసుతనముతో యావేను నమ్మరైరి.

15. ప్రభువు ఉపదేశమును పెడచెవినప్టిెరి. ప్రభువు పితరులతో చేసికొనిన నిబంధనను మీరిరి. అతని హెచ్చరిక లను లక్ష్యము చేయరైరి. వ్యర్థమైన విగ్రహములను అను సరించుచు తామును వ్యర్ధులైరి. ప్రభువు వలదన్నను వినక ఇరుగుపొరుగు జాతుల ఆచారములను అను సరించిరి.

16. ప్రభువు ఆజ్ఞలన్నిని కాదని లోహ ముతో రెండు కోడెదూడలను చేయించి పూజించిరి. పైగా అషేరాదేవత విగ్రహమును చేయించిరి. ఆకాశము లోని నక్షత్రములను కొలిచిరి. బాలును పూజించిరి.

17. తమ కుమారులను, కుమార్తెలను అన్యదైవము లకు దహనబలిగా అర్పించిరి. శకునములు చెప్పించు కొనిరి. జ్యోతిష్కులను సంప్రతించిరి. చేయరాని దుష్కార్యములెల్ల చేసి ప్రభువు కోపమును రెచ్చగ్టొిరి.

18. కనుక ప్రభువు యిస్రాయేలీయులమీద మండి పడి, వారిని తన సమక్షమునుండి గిెంవేసెను. యూదా తెగగాక మరియ ఏ తెగయు శేషించియుండలేదు.

19. యూదీయులు కూడ ప్రభువు ఆజ్ఞలను లెక్కచేయలేదు. వారు కూడ యిస్రాయేలీయులవలె చెడుత్రోవన పోయిరి.

20. కనుక ప్రభువు యిస్రా యేలీయులనందరిని చేయివిడిచెను. వారిని కఠిన ముగా శిక్షించి దోపిడిగాండ్ర వశముచేసెను. వారిని తన యెదుినుండి త్రోసివేసెను.

21. ప్రభువు యిస్రాయేలును యూదా రాజ్యమునుండి వేరుచేసెను. యిస్రాయేలీయులు నెబాతు కుమారుడు యరోబామును రాజును చేసిరి. అతడు యిస్రాయేలీయులను ప్రభువు నుండి వైదొలగించి వారిచేత ఘోరపాపము చేయించెను.

22. వారు యరోబామును అనుకరించి అతడు చేసిన పాడు పనులెల్ల చేసిరి.

23. కట్టకడకు ప్రభువు వారిని తన సన్నిధినుండి బహిష్కరించెను. ప్రభువు ఈ శిక్షను ప్రవక్తలద్వారా ముందుగనే యెరిగించెను. కనుక యిస్రాయేలీయులు అస్సిరియాకు బందీలుగా పోయి నేివరకు అక్కడనే నివసించుచున్నారు.

సమరీయుల పుట్టు పూర్వోత్తరాలు

24. అస్సిరియా రాజు బబులోనియా, కూతా, అవ్వా, హమాతు, సెఫర్వాయీము నగరముల నుండి రప్పించిన ప్రజలు యిస్రాయేలీయులకు మారుగా సమరియాసీమలో స్థిరపడిరి. ఆ దేశనగరములలో కాపురముండిరి.

25. అయితే వారు కాపురముండ ఆరంభించినపుడు యావే యెడల భయభక్తులు లేని వారు కనుక ప్రభువు వారిమీదికి సింహములను పంపగా అవి వారిలో కొందరిని చంపెను.

26. తాను సమరియా మండలమునకు పంపిన ప్రజలు ఆ దేశపు దేవుని పూజింపలేదని, కనుక ఆ దేవుడు సింహములను పంపి ఆ క్రొత్త ప్రజను నాశనము చేయించెనని అస్సిరియారాజు వినెను.

27. కనుక అతడు ”మనము ఇచికి బందీలుగా కొనివచ్చిన యాజకులలో ఒకనిని సమరియాకు పంపుడు. అతడు ఆ మండలమునకు పోయి అచి ప్రజలతో వసించి ఆ దేవుని విధివిధానముల తీరును వారికి తెలియ జేయును” అని చెప్పెను.

28. కావున సమరియా నుండి బందీగా కొనిపోబడిన యిస్రాయేలు యాజకు డొకడు బేతేలు క్షేత్రమునకువచ్చి యావే యెడల భయ భక్తులు చూపవలసిన తీరును ప్రజలకు తెలియజేసెను.

29. కాని సమరియా మండలమున స్థిరపడిన క్రొత్త జాతులు తమకు నచ్చిన విగ్రహములను తయారు చేసికొని వానిని ఇంతకు పూర్వము యిస్రాయేలీ యులు నిర్మించిన దేవళములలో ప్రతిష్ఠించిరి. ప్రతి జాతి తాను వసించుచున్న నగరములలో క్రొత్త దేవతా విగ్రహములను చేయించెను.

30. బబులోనియా నగరమునుండి వచ్చినవారు సూక్కోత్బెనోత్తును, కూతా నగరవాసులు నెర్గలును, హమాతువాసులు అషీమాను చేయించిరి.

31. అవ్వా నివాసులు నిబ్హాసును, తర్తాకును వారివారి దేవతలను చేసుకొనిరి. సెఫర్వాయీము పురవాసులు తమ బిడ్డలను అద్రెమ్మెలెకు , అనమ్మెలెకు దేవతలకు దహనబలిగా అర్పించిరి.

32. వీరు యావే ప్రభువునుగూడ ఆరాధించిరి. పైగా వారు తమ జాతివారినే ఉన్నతస్థలములమీది మందిరములలో యాజకులనుగా నియమించిరి. ఆ యాజకులు వీరి తరపున బలులు అర్పించిరి.

33. ఆ రీతిగా వారు ఒక వైపు యావే యెడల భయము కలవారైయుండియు మరియొకవైపు తాము పూర్వముండిన స్థలములలోని ఆయా దేవతలను గూడ కొలిచిరి.

34. ఈనాికిని వారు తమ సంప్రదాయములను పాించుచునేయున్నారు. వారు ప్రభువుయెడల భయ భక్తులు చూపలేదు. యిస్రాయేలు అనబడిన యాకోబు సంతతివారికి ప్రభువు అనుగ్రహించిన కట్టడలు పాింపరు.

35.  ”మీరు అన్యదైవములను కొలువ వలదు. వారిని ఆరాధించి బలులర్పింపవలదు.

36. మీరు నన్ను సేవింపుడు. మహాబలసామర్థ్యములతో నాడు ఐగుప్తునుండి మిమ్ము విడిపించుకొని వచ్చినది నేనే. కనుక మీరు నన్ను ఆరాధించి  నాకు బలులర్పింప వలయును.

37. నేను మీకు వ్రాసియిచ్చిన ఆజ్ఞలను మీరు సదా పాింపవలయును. అంతేగాని మీరు అన్యదైవములను కొలువరాదు.

38. నేను మీతో చేసి కొనిన నిబంధనను విస్మరింపరాదు. అన్యదేవతలను ఆరాధింపరాదు.

39. మీ ప్రభువును, దేవుడనైన నన్నే మీరు సేవింపవలయును. శత్రువులనుండి మిమ్ము కాపాడువాడను నేనే” అని  యిస్రాయేలీయులతో ఆయన నిబంధనము చేసికొనెను.

40. అయినను ఆ ప్రజలు ప్రభువు మాట లక్ష్యపెట్టక తమ పూర్వ సంప్ర దాయమునే పాించిరి.

41. ఆ రీతిగా వారు యావే యెడల భయభక్తులు చూపినను, తమకు ఇష్టమొచ్చిన దైవములనుగూడ పూజించిరి. వారి వంశీయులును ఈనాికిని అదేపని చేయుచున్నారు.