యెరూషలేము ముట్టడి

25 1. సిద్కియా అతని యేలుబడి తొమ్మిదవ యేడు పదియవనెల పదియవనాడు నెబుకద్నెసరు సర్వసైన్యముతోవచ్చి యెరూషలేమును ముట్టడించెను.

2. బబులోనీయులు పట్టణము వెలుపల శిబిరము పన్నిరి. నగర ప్రాకారము చుట్టు ముట్టడిదిబ్బలు పోయించిరి. సిద్కియా యేలుబడి పదకొండవయేి వరకు ముట్టడికొనసాగెను.

3. ఆ యేడు నాలుగవనెల, తొమ్మిదవనాడు కరువు మిక్కుటముకాగా ప్రజలకు తిండి దొరకదయ్యెను.

4. అంతట కల్దీయ శత్రువులు ప్రాకారములను కూల్చివేసిరి. బబులోనీయులు నగర మును చుట్టుమ్టుియున్నను యూదారాజు, రాణువ వారు రాత్రివేళ పలాయితులైరి. వారు రాజోద్యాన వనము ప్రక్కగా రెండుప్రాకారముల మధ్యనున్న ద్వారముగుండ తప్పించుకొని యోర్దాను లోయలోనికి పారిపోయిరి.

5. కాని కల్దీయులసైన్యము వారి వెంట బడి యెరికో మైదానమున సిద్కియాను పట్టుకొనిరి. అతని సైనికులందరు సిద్కియాను విడిచి పారిపోయిరి.

6. వారు రాజును పట్టుకొని రిబ్లా యందు విడిది చేయుచున్న నెబుకద్నెసరు వద్దకు కొనిపోయిరి. అచట బబులోనియారాజు యూదా రాజునకు శిక్ష విధించెను.

7. నెబుకద్నెసరు ఆజ్ఞపై సిద్కియా కన్నుల ఎదుటనే అతని కుమారులను వధించిరి. అటుపిమ్మట అతని కన్నులను పెకలించిరి. అతనిని ఇత్తడిగొలుసులతో బంధించి బబులోనియాకు కొనిపోయిరి.

రెండవమారు బందీలను కొనిపోవుట

8. నెబుకద్నెసరు పరిపాలనాకాలము పందొ మ్మిదవయేట ఐదవనెల ఏడవనాడు, బబులోనియారాజు నకు అంగరక్షకుడును అధిపతియునైన నెబూసరదాను యెరూషలేమున ప్రవేశించెను.

9. అతడు దేవాలయ మును, రాజప్రాసాదమును, పట్టణములోని ప్రముఖుల ఇండ్లను తగులబ్టెించెను.

10. అతనితోనున్న కల్దీయ సైనికులు పురప్రాకారములను పడగ్టొిరి.

11. నెబూసరదాను పట్టణమున మిగిలియున్న జనమును, చేతిపనివారిని, బబులోనియా పక్షమును అవ లంబించిన వారిని బబులోనియాకు కొనిపోయెను.

12. కొందరు పేదవారిని మాత్రము యూదాలోని ద్రాక్ష తోటలను, పొలమును సాగుచేయుటకు వదలి వేసెను.

13.బబులోనీయులు దేవాలయములోని కంచుస్తంభములను, దిమ్మలను, కంచు సముద్రమును ముక్కలు ముక్కలు చేసిరి. ఆ కంచునంతిని బబులోని యాకు కొనిపోయిరి.

14. మరియు వారు బలిపీఠము మీది బూడిదనెత్తు గరిటెలను, పళ్ళెములను, దీప సామగ్రిని, పశుబలులు అర్పించునపుడు నెత్తురుపట్టు పాత్రలను, సాంబ్రాణిపొగ వేయుటకు వాడు గిన్నెలను, ఇంకను దేవాలయమున వాడు రకరకముల కంచు పరికరములను బబులోనియాకు తీసికొనిపోయిరి.

15. వెండి బంగారములతోచేసిన పరికరములన్నిని కొని పోయిరి. నిప్పుకణికలను కొనిపోవుటకు వాడు చిన్నచిన్న గరిటెలను, పాత్రలనుగూడ తీసికొనివెళ్ళిరి.  

16. సొలోమోను చేయించిన కంచువస్తువులు అనగా రెండుస్తంభములు, దిమ్మలు, పెద్దకుంట తూకము వేయుటకు సాధ్యపడనివి.

17. ఆ రెండుస్తంభములు ఒకేరీతిగానుండెడివి. వానియెత్తు పదునెనిమిది మూరలు. వానిమీద మరల మూడుమూరల ఎత్తున దిమ్మలుండెడివి. ఆ దిమ్మలచుట్టు కంచుతో చేయ బడిన అల్లికలుండెడివి. వానిని కంచు దానిమ్మపండ్లతో అలంకరించిరి.

18. నెబూసరదాను ప్రధానయాజకుడైన సెరాయాను, ఉపయాజకుడైన సెఫన్యాను, మరి ముగ్గురు దేవాలయోద్యోగులను చెరగొనెను.

19. పట్టణములోని సైన్యాధిపతిని, నగరమున ఉన్న రాజు సలహాదారులను ఐదుగురిని, ఆయుధ స్థలములమీది అధిపతిని, కార్యదర్శిని మరియు అరువదిమంది ప్రముఖులను చెరబట్టెను.

20. వారినందరిని నెబూసరదాను బబులోనియారాజు నొద్దకు కొని పోయెను. ఆ రాజు అప్పుడు హమాతునందలి రిబ్లా నగరమున విడిదిచేసియుండెను.

21. రాజు అట వారిని హింసించి చంపెను. ఆ రీతిగా యూదీయులు తమ దేశము నుండి ప్రవాసమునకు కొనిపోబడిరి.

గెదల్యా యూదాకు పాలకుడగుట

22. బబులోనియారాజు నెబుకద్నెసరు, షాఫాను మనుమడు, అహీకాము కుమారుడునగు గెదల్యాను యూదా రాజ్యమునకు పాలకునిగా నియమించెను. యూదాసీమలో మిగిలియున్న వారికందరికి అతడు అధిపతి.

23. బబులోనీయులకు లొంగని సైనికులు, సైన్యాధిపతులు గెదల్యా యూదాకు అధికారి అయ్యెనని విని మిస్ఫాయొద్ద అతనిని కలిసికొనిరి. వీరు నెతన్యా కుమారుడగు యిష్మాయేలు, కారె కుమారుడైన యెహోనాను, తనుమెతు కుమారుడు సెరాయా, మాకతీయుడైన యసన్యా అనువారు.

24.  గెదల్యా వారితో ”మీరు బబులోనీయులకు వెరవనక్కరలేదు. ఈ సీమన వసించి బబులోనియా రాజునకు లొంగి యుందురేని మీకు ఏ ఆపదయు వాిల్లదు” అని శపథము చేసెను.

25. కాని ఆ యేడు ఏడవనెలలో రాజ వంశీయు డైన ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడునగు యిష్మాయేలు పదిమందితో కలిసి మిస్ఫాకు వెళ్ళి గెదల్యాను సంహరించెను. అచట వసించుచున్న యూదులను మరియు కల్దీయులనుగూడ చంపెను.

26. అంతట యిస్రాయేలీయులు పేదలనక, ధనికులనక అందరు సేనాధిపతులతోసహా ఐగుప్తునకు పారిపోయిరి. వారు బబులోనీయులకు భయపడిరి.

యెహోయాకీను క్షమాపణ పొందుట

27. యెహోయాకీను ప్రవాసకాలము ముప్పది యేడవ యేట పండ్రెండవనెల ఇరువది యేడవనాడు ఎవీల్మెరోదకు బబులోనియాకు రాజయ్యెను. ఆ రాజు యూదారాజు యెహోయాకీనును క్షమించి అతనిని చెరనుండి విడిపించెను.

28. అతడు యెహోయాకీను మీద కరుణజూపెను. నాడు ఆ దేశమున ప్రవాసములో నున్న రాజులందరికంటె అతనిని పెద్దచేసెను.

29. యెహోయాకీను ఖైదీ దుస్తులను తొలగించెను. నాి నుండి యెహోయాకీను జీవితాంతమువరకు రాజ గృహముననే భుజించెను.

30. యెహోయాకీను బ్రతికి యున్నంతకాలము రాజుచే నిర్ణయించబడిన అతని రోజువారి ఖర్చులకుగాను బబులోనీయులు సొమ్ము చెల్లించిరి.