మనష్షే తెగ

17 1. యోసేపు జ్యేష్ఠపుత్రుడు మనష్షే. అతనికి లభించిన భూమి యిది: మనష్షే జ్యేష్ఠపుత్రుడు మాకీరు పోరాటవీరుడు కనుక అతనికి గిలాదు, బాషాను మండలములు లభించెను.

2. మనష్షే ఇతర కుమారు లకు వారివారి కుటుంబములను అనుసరించి భూము లిచ్చిరి. వారు అబియెజెరు, హేలేకు, ఆస్రియేలు, షెకెము, హేఫేరు, షెమిదా. వీరందరు యోసేపు కుమారుడు మనష్షేకు ప్టుిన కుమారులు.

3. మనష్షే కుమారుడు మాకీరు. అతని కుమారుడు గిలాదు. గిలాదు కుమారుడైన హేఫేరు కుమారుడగు సేలోఫెహాదునకు కుమార్తెలు మాత్రమే కలరు. వారి పేర్లు మహ్లా, నోవా, హోగ్లా, మిల్కా, తీర్సా.

4. వీరందరు నూను కుమారుడు యెహోషు వను, యాజకుడగు ఎలియెజెరును, ప్రజల పెద్దలను సమీపించి ”మా బంధువులతో పాటు మాకును భాగము ఈయవలెనని యావే మోషేకు ఆజ్ఞ యిచ్చెను గదా!” అనిరి. కనుక యావే ఆజ్ఞను అనుసరించి ఆ ఆడుపడుచులకు వారి పినతండ్రులతో పాటు భూము లను పంచియిచ్చిరి.

5. ఈ రీతిగా యోర్దానునకు ఆవలనున్న గిలాదు, బాషాను మండలములు కాక మనష్షేకు పదివంతులు అదనముగా వచ్చెను.

6. ఏలయనగా, మనష్షే కుమార్తెలు అతని కొడుకులతో పాటు భాగములు పంచుకొనిరి. గిలాదు మనష్షే కుమారులకు సంక్రమించెను.

7. మనష్షేకు వచ్చిన భాగమునకు సరిహద్దు ఆషేరు వైపున షెకెమునకు ఎదురుగా నున్న మిక్మేతాతు వరకుపోయి అచినుండి దక్షిణమున తాపువా చెలమ చెంతగల యాషీబు వరకు వ్యాపించెను.

8. తాపువా మండలము మనష్షేది. కాని తాపువా పట్టణము మాత్రము మనష్షే మండలము సరిహద్దున ఉన్నందున ఎఫ్రాయీమీయులకు చెంది యుండెను.

9. ఆ సరిహద్దు దిగువవైపున కానా ఏివరకు పోయి సముద్రము చేరెను. ఈ ఏికి దక్షిణమున ఎఫ్రాయీము పట్టణములు కలవు. ఇవిగాక మనష్షే పట్టణములందు ఎఫ్రాయీము ప్రజలకు కొన్ని నగరములు కలవు. మనష్షే తెగవారి భూమి ఈ ఏికి ఉత్తరమున సముద్రము వరకు వ్యాపించి ఉన్నది.

10. ఈ రీతిగా దక్షిణమున ఎఫ్రాయీము, ఉత్తరమున మనష్షే ఉండిరి. వారిమధ్య సరిహద్దు సముద్రము వరకు ఉండెను. వారికి ఉత్తరమున ఆషేరు, తూర్పున యిస్సాఖారు కలరు.

11. యిస్సాఖారు, ఆషేరు మండలములలో మనష్షేనకు పట్టణములు కలవు. బేెత్‌షెయాను దాని పల్లెలు, ఈబ్లెయాము దాని పల్లెలు, దోరు, ఎన్‌-దోరు వాని పల్లెలు, తానాకు, మెగిద్దో వాని పల్లెలు, నెఫేత్తు మూడవవంతు మనష్షేవి.

12. కాని మనష్షే ఈ పట్టణములను ఆక్రమించు కోలేదు. కనానీయులే వానినేలిరి.

13. కాని యిస్రా యేలీయులు బలవంతులైన కొలది కనానీయులను పూర్తిగా వెళ్ళగొట్టలేక పోయినను వారిచేత వ్టెిచాకిరి చేయించుకొనిరి.

యోసేపు సంతతి

అరణ్యప్రాంతమును ఆక్రమించుకొనుట

14. యోసేపు సంతతివారు యెహోషువతో ”నీవు మాకు ఒక్కభాగమే ఇచ్చితివిగదా! యావే దీవెనవలన మేము చాలమందిమైతిమి” అనిరి.

15. యెహోషువ వారితో ”మీరు చాల మందియైనచో ఎఫ్రాయీము పీఠభూములు మీకు చాలనిచో, అరణ్య ప్రాంతము నకు పొండు. పెరిస్సీయులు, రేఫీయులు వసించు దేశములోని అడవులను నరికివేసి ఆ నేలను ఆక్రమించు కొనుడు” అని చెప్పెను.

16. యోసేపు సంతతివారు ”ఈ పీఠభూమి మాకు చాలదు. ఈ మైదానమున వసించు కనానీయులందరకు ఇనుపరథములు కలవు. అట్లే బేత్‌షెయానుకు, దాని ఏలుబడిలోనున్న పట్టణ ములకు, యెస్రెయేలు మైదానములోనున్న వారికి ఇనుప రథములున్నవి” అనిరి.

17-18. కనుక యెహోషువ యోసేపు సంతతివారగు ఎఫ్రాయీము, మనష్షేలతో ”మీరు చాలమంది అయితిరి. చాల బల వంతులు కూడ. మీకు ఒక్క భాగముచాలదు. కనుక ఈ పర్వతసీమను ఆక్రమించుకొనుడు. దానిని ఆవరించి యున్న అడవులను నరికివేయుడు. ఈ సీమయెల్లలే మీ యెల్లలు. ఇచి కనానీయులు బలవంతులైనను, ఇనుపరథములు ఉపయోగించుచున్నను మీరు వారిని వెడలగొట్టగలరు.” అని చెప్పెను.

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము