24 1. యెహోయాకీము రాజుగానున్న కాలమున బబులోనియారాజైన నెబుకద్నెసరు యూదామీద దాడి చేసెను. యెహోయాకీము మూడేండ్లపాటు అతనికి లొంగియుండెను. ఆ మీదట తిరుగబడెను.

2. కాని ప్రభువు బాబిలోనియా, సిరియా, మోవాబు, అమ్మోను దేశములనుండి యూదామీదికి యుద్ధ సైన్యములను రప్పించెను. ప్రభువు తన భక్తులైన ప్రవక్తల ద్వారా నుడివినట్లే ఈ ఉపద్రవము కలిగెను.

3. ఇది అంతయు ప్రభువు ఆజ్ఞపై జరిగెను. మనష్షే పాపము లకుగాను ప్రభువు యూదీయులను తన సమక్షము నుండి వెడలగొట్టనెంచెను.

4. పైగా ఆ రాజు యెరూ షలేమున నిర్దోషుల నెత్తురు వరదగా పారించెనుగదా! ఆ దుష్కార్యమును ప్రభువు క్షమింపలేదు.

5. యెహోయాకీము చేసిన ఇతరకార్యములు యూదారాజుల చరితమున లిఖింపబడియేఉన్నవి.

6. అతడు చనిపోగా అతని కుమారుడు యెహోయాకీను రాజయ్యెను.

7. యూఫ్రీసునది నుండి ఐగుప్తు నది వరకు ఐగుప్తురాజు వశమున నున్న భూభాగమంతిని బబులోనురాజు జయించగా, ఐగుప్తురాజు మరెన్నికిని తన దేశమునుండి బయటకు వెడలలేదు.

యెహోయాకీను పరిపాలన (క్రీ.పూ. 598-597)

8. యెహోయాకీను పదునెనిమిదవ యేట రాజై యెరూషలేము నుండి మూడునెలలు మాత్రము పరిపాలించెను. యెరూషలేము నగరవాసి ఎల్నాతాను కుమార్తె నెహుష్టా అతని తల్లి.

9. ఆ రాజు గూడ తన పితరులవలె యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.

బబులోనీయులు మొదిసారి

బందీలను కొనిపోవుట (క్రీ.పూ.598)

10. అతని కాలమున బబులోనియా నుండి నెబుకద్నెసరుయొక్క సైన్యాధిపతులు దండెత్తివచ్చి యెరూషలేమును ముట్టడించిరి.

11. సైన్యములు యెరూషలేమును ముట్టడించుచుండగా నెబుకద్నెసరు స్వయముగా వచ్చి నగరమును పట్టుకొనవచ్చెను.

12. యెహోయాకీను తనతల్లితో, సేవకులతో, ప్రాసాద సంరక్షకులతో, అధిపతులతో బబులోనియారాజునకు లోబడిపోయెను. ఆ రాజు తన పరిపాలనాకాలము ఎనిమిదవయేట యెహోయాకీనును బందీని చేసెను.        

13. నెబుకద్నెసరు దేవాలయకోశాగారము నుండి, ప్రాసాదకోశాగారము నుండి సంపదనంతయు అపహరించుకొని బబులోనియాకు కొనిపోయెను. ప్రభువు నుడివినట్లే పూర్వము సొలోమోనురాజు దేవాలయముకొరకు చేయించిన బంగారుపాత్రలన్నిని పగులగ్టొించెను.

14. నెబుకద్నెసరు యెరూషలేము నగరవాసులను, రాజవంశీయులను, యుద్ధవీరులను మొత్తము పదివేలమందిని చెరగొని బబులోనియాకు కొనిపోయెను. ఇనుపపనిముట్లు తయారుచేయువారు మొదలైన చేతిపని వారినందరిని గూడ బందీలనుగా  కొనిపోయెను. పేదసాదలను మాత్రమే యూదాలో ఉండనిచ్చెను.

15. యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని సేవకులను, ప్రముఖులైన పౌరులను చెరగొని తీసికొనిపోయెను.

16. ఆ రాజు యూదానుండి పరాక్రమవంతులను ఏడువేలమందిని, ఇనుప పనిముట్లుచేయు చేతిపనివారిలో వేయి మందిని బందీలుగా కొనిపోయెను. ఆ బందీలందరు కండబలము కలవారు. యుద్ధముచేయ సమర్థులు. 17. నెబుకద్నెసరు యెహోయాకీను పినతండ్రియైన మత్తాన్యాను యూదాకు రాజును చేసి అతనికి సిద్కియా అని క్రొత్తపేరు పెట్టెను.

సిద్కియా పరిపాలన (క్రీ.పూ. 598-587)

18. సిద్కియా ఇరువదిఒకటవ యేట రాజై యెరూషలేము నుండి పదకొండు యేండ్లు పరిపా లించెను. లిబ్నా నగరవాసి యిర్మీయా కుమార్తె హమూతలు అతని తల్లి. 

19. యెహోయాకీను వలెనే సిద్కియాకూడ యావే సహించని దుష్కార్యములు చేసెను.

20. యూదాప్రజలపై, యెరూషలేము నగరవాసులపై ప్రభువునకు కలిగిన కోపమునుబ్టి ఆయన తన సమక్షము నుండి వారిని గిెంవేయు వరకు బబులోనురాజుపై సిద్కియా తిరుగబడెను.