మన్నా – పూరేడు పిట్టలు

1. ఏలీము నుండి యిస్రాయేలు సమాజము ముందుకు సాగిపోయినది. వారు ఐగుప్తుదేశమును వదలిన రెండవ నెలలో పదునైదవనాడు ఏలీమునకు సీనాయికి నడుమనున్న సీను అరణ్యమునకు చేరు కొనిరి.

2. ఆ అడవిలో యిస్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద నేరము మోప మొదలిడెను.

3. యిస్రాయేలీయులు వారితో ”మేము ఐగుప్తు దేశముననే యావేచేతిలో చచ్చినా బాగుగానుండెడిది. అచ్చట మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపార భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజమునెల్ల ఆకలిచే మలమల మాడ్చి చంపుటకు గాబోలు మీరిద్దరు మమ్ము అక్కడినుండి తోడ్కొనివచ్చితిరి” అనిరి.

4. అప్పుడు యావే మోషేతో ”ఇదిగో! నేను ఆకాశమునుండి వారికి ఆహారమును కురియింతును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాి బత్తెమును ఆనాికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాింతురో లేదో తెలిసికొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును.

5. ఆరవనాడు వారు రోజువారి బత్తెముకంటె రెండంతలు అధిక ముగా తెచ్చుకొని భోజనము సిద్ధము చేసికొనవల యును” అనెను.

6. మోషే అహరోనులు యిస్రాయేలీయులతో ”ఐగుప్తు దేశమునుండి మిమ్ము తోడ్కొనివచ్చినది యావే అని సాయంకాలమున మీరు తెలిసికొందురు.

7. ఉదయము యావే మహిమను చూతురు. మీరు యావే నెత్తిపై మోపిన నేరములన్నియు ఆయన విన్నాడు. మీరు మామీద గొణుగుటకు మేమెంతవారము?” అనిరి. 

8. మోషే వారితో ”మీరు కడుపార తినుటకు సాయంకాలము మాంసమును, ఉదయము రొట్టెను యావే మీకిచ్చును. మీరు ఆయనమీద మోపిన నేరములన్నియు ఆయనకు వినిపించినవి. మీరు మామీదకాక ఆయన మీదనే గొణుగుచున్నారు. మేము ఏపాివారము?” అనెను.

9. మోషే అహరోనుతో ”మీరు యావే సన్నిధికి రండు.  మీరు మోపుచున్న నేరములు ఆయన వినెను అని యిస్రాయేలు సమాజమునంతికిని చెప్పుము” అనెను.

10. అహరోను యిస్రాయేలు సమాజముతో మోషే చెప్పుమన్నమాటలు చెప్పుచుండగా వారందరు ఎడారివైపు తిరిగిచూచిరి. వారికి యావే తేజస్సు మేఘమునందు కనబడెను.

11. అప్పుడు యావే మోషేతో మ్లాడుచు ”నేను యిస్రాయేలీయుల సణుగుడు వింని.

12. నీవు వారితో ‘మీరు ప్రొద్దు గ్రుంకనున్నపుడు మాంసమును, వేకువనే రొట్టెను కడుపార తిందురు. అప్పుడుగాని యావేనైన నేనే మీ దేవుడనని మీకు తెలియదు’ అని చెప్పుము” అనెను.

13. సాయంకాలము పూరేడుపిట్టలు వచ్చి వారి విడుదులను కప్పివేసెను. ప్రొద్దుిపూట విడుదుల చుట్టు మంచుకమ్మియుండెను.

14. పొగ మంచంతయు పోయిన తరువాత ఎడారి నేలమీద నూగు మంచువిం సన్ననిపొడి కనబడెను.

15. దానినిచూచి అది ఏమియో తెలియక యిస్రాయేలీ యులు ”ఇదియేమి?” అని ఒకరినొకరు అడుగు కొనిరి.

16. మోషే వారితో ”మీరు తినుటకై దేవుడు ఇచ్చిన ఆహారము ఇదియే! ప్రతివ్యక్తి తన కుటుంబము వారికొరకై తలకొక మానెడు చొప్పున తన అక్కరను బ్టి దానిని సమకూర్చుకొనవలయునని యావే ఆజ్ఞాపించెను” అనెను.

17. యిస్రాయేలీయులు మోషే చెప్పినట్లే చేసిరి. వారిలో కొందరు ఎక్కువగా, మరికొందరు తక్కువగా ప్రోగుచేసికొనిరి.

18. తాము ప్రోగుచేసికొన్న దానిని వారు మానికతో కొలిచినపుడు ఎక్కువగా సమకూర్చు కొనినవానికి ఎక్కువగా మిగిలినది లేదు. తక్కువగా ప్రోగుచేసికొనినవారికి తగ్గినది లేదు. ఎవనికి ఎంత కావలయునో అంతమాత్రమునే ప్రోగుచేసికొన్నట్లు వారికి తెలిసినది.

19. మోషే వారితో ”దీనిలో ఏ కొంచెముగూడ రేపికై ఎవ్వడును మిగుల్చుకొనరాదు” అనెను.

20. కాని వారిలో కొందరు మోషే మాటవినరైరి. వినకుండ మరునాికి కొంత అి్టపెట్టుకొనిరి. అది పురుగుప్టి కంపుకొట్టెను. మోషే వారిమీద కోపపడెను.

21. ప్రతిదినము ప్రొద్దుిపూట వారు తమకు కావలసినంత ప్రోగుచేసికొనిరి. ప్రొద్దు వేడియెక్కుసరికి మిగిలినది కరగిపోయెడిది.

22. ఆరవనాడు తలకు రెండుమానికల చొప్పున ర్టిెంపుతిండి సమకూర్చుకొనిరి. సమాజములోని నాయకులందరు వచ్చి ఆ మాట మోషేతో చెప్పిరి.

23. అతడు వారితో ”ఇది యావే ఆజ్ఞ. రేపు విశ్రాంతి దినము. అది యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనగోరిన దానిని కాల్చుకొనుడు. వండుకొనగోరిన దానిని వండుకొనుడు. మిగిలిన దానిని రేపికి అి్టపెట్టుకొనుడు” అని చెప్పెను.

24. మోషే ఆజ్ఞాపించినట్లుగా వారు మిగిలినదానిని మరునాికి అి్టపెట్టుకొనిరి. అది కంపు కొట్టలేదు, పురుగుపట్టలేదు.

25. మోషే వారితో ”ఈ దినము దానిని తినుడు. ఇది యావేకు సమర్పితమయిన విశ్రాంతిదినము. ఈనాడు బయట మీకు ఏమియు దొరకదు.

26. ఆరురోజులపాటు మీరు ఆహారము ప్రోగుచేసికొనవలయును. విశ్రాంతి దినమైన ఏడవ నాడు మాత్రము మీకు ఏమియు దొరకదు” అని చెప్పెను.

27. ఏడవనాడు కూడ యిస్రాయేలీయులలో కొందరు ఆహారము ప్రోగుచేసికొనుటకు విడుదుల నుండి వెళ్ళిరి. కాని వారికి ఏమియు కనబడదాయెను.

28. అప్పుడు యావే మోషేతో ”మీరింకను ఎంత కాలమువరకు నా ఆజ్ఞలను, ధర్మములను పాింప కుందురు?

29. వినుడు. యావే ఏడవదినమును విశ్రాంతిదినముగా నిర్ణయించెను. ఆనాికిగూడ సరిపోవుటకు ఆరవరోజుననే ఆయన రెండింతలతిండి సమకూర్చును. ఏడవనాడు ఎవ్వడు ఎక్కడ ఉన్నాడో అక్కడనే ఉండవలయును. ఎవ్వడును తన విడిదిదాి పోరాదు” అని చెప్పెను.

30. కావున యిస్రాయేలీ యులు ఏడవనాడు అన్ని పనులు మానుకొని విశ్రాంతి తీసికొనిరి.

31. యిస్రాయేలీయులు దానికి ‘మన్నా’1 అని పేరుప్టిెరి. అది తెల్లగా కొత్తిమీరగింజవలె ఉండెను. దానిరుచి తేనెతోచేసిన గుళికల భక్ష ్యమువలెనుండెను.

32. మోషే యిస్రాయేలీయులతో ”ఇది యావే ఆజ్ఞ. మన్నాతో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడు. నేను మిమ్ము ఐగుప్తుదేశమునుండి తోడ్కొనివచ్చినపుడు ఎడారిలో మీక్టిె తిండిప్టిెతినో మీ వంశీయులు తెలిసికొనుటకై దానిని భద్రపరుపుడు” అని చెప్పెను.

33. మోషే అహరోనుతో ”నీవు ఒక పాత్రను తీసికొని దానిని ఒక ఓమెరు మన్నాతోనింపి యావే సన్నిధిని పెట్టుము. దానిని మీ వంశీయులు చూతురు” అనెను.

34. యావే మోషేను ఆజ్ఞాపించినట్లుగనే అహరోను పాత్రలో ఒక ఓమెరు మన్నానుపోసి దానిని నిబంధన మందసము ఎదుటనుంచెను. అది అచట శాశ్వత ముగా ఉండిపోయెను.

35. యిస్రాయేలీయులు తాము నివసింపబోవు దేశము చేరుకొనువరకును, నలువదియేండ్లపాటు మన్నాను భుజించిరి.  వారు  కనానుదేశము పొలిమేర  చేరువరకు దానినే తినిరి.

36. ‘ఓమేరు’ అనగా ‘ఏపా’లో థమభాగము.

Previous                                                                                                                                                                                                Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము