దానియేలు కథలు:

సూసన్న కథ

ఇద్దరు న్యాయమూర్తులు సూసన్నను కామించుట

13 1. బబులోనియాలో యోవాకీము అను నరుడుండెడివాడు.

2. అతడు హిల్కియా కుమార్తెయైన సూసన్నను వివాహమాడెను. ఆమె మిగులఅందగత్తె. దైవభక్తికలది.

3. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్రనియమముల ప్రకా రము జీవింపవలెనని నేర్పిరి.

4. యోవాకీము చాల సంపన్నుడు. అతనికి తన ఇంిప్రక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమారులు ఆ తోటలో ప్రోగ య్యెడివారు. వారు యోవాకీమును మిగుల గౌరవముతో చూచెడివారు.

5-6. వ్యాజ్యములు కలవారు యోవాకీము ఇంికి వచ్చెడివారు. అచట ఇద్దరు న్యాయమూర్తులు తీర్పుచెప్పెడివారు. ఆ సంవత్సరము యూదులనుండి ఇద్దరు పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారినిగూర్చి ప్రభువు ”బబులోనియాలో దుష్టత్వ మున్నది. న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలకున్నారు” అని ముందే పలికియుండెను.

7. ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజన మునకుపోయిన తరువాత సూసన్న తన భర్తతోటలో పచార్లు చేసెడిది.

8. న్యాయాధిపతులు ఇద్దరును ఆమె ప్రతిదినము తోటలో సంచరించుటను గమనించు చుండిరి. వారికి ఆమెమీద కోరిక పుట్టెను.

9.వారికి ప్రార్ధనమీద ప్రీతిపోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలనువిస్మరించిరి.

10.వారిరువురికినిసూసన్నపై మరులు పుట్టెను. కాని ఒకరికొకరు తమ కోరిక లను తెలియనీయరైరి.

11. సూసన్నను కూడవలెనను కోరి కను వెలిబుచ్చుటకు వారు సిగ్గు పడిరి.

12. వారు ప్రతిదినము ఆమెను చూచుటకు ఆశతో కనిపెట్టుకొని యుండెడివారు.

13. వారు ఒకరోజు మధ్యాహ్నము ‘భోజనము నకు వేళయైనది, ఇక యిిింకి పోవుదుము’ అని ఒకరితో నొకరు చెప్పుకొని, 14. ఎవరిదారిన వారు వెళ్ళిపోయిరి. కాని ఇరువురును సూసన్నను చూచుటకు తిరిగివచ్చి, తలవనితలంపుగా ఒకరినొకరు కలిసి కొనిరి. మొదట ఇద్దరును తామచికి వచ్చుటకు ఏదో ఒక దొంగకారణమును చెప్పిరి. అటుపిమ్మట ఇద్దరును తమకు సూసన్నమీద కోరిక కలదని ఒప్పుకొనిరి. వారు సూసన్న ఒంటరిగా దొరకువరకు వేచియుందుమని నిశ్చయించుకొనిరి.

15-17. కావున తగిన సమ యము కొరకు కాచుకొనియుండిరి.

న్యాయమూర్తులు సూసన్నను చెరపగోరుట

ఒకదినమున సూసన్న అలవాటు ప్రకారము ఇద్దరు చెలికత్తెలతో తోటలోనికి పోయెను. అపుడచట ఆ ఇద్దరు న్యాయాధిపతులుతప్ప మరిఎవరును లేరు. వారు దాగుకొనియుండి సూసన్నను పొంచిచూచు చుండిరి. ఆ దినము చాలవేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను. కనుక తన పనికత్తెలతో ”మీరు నాకు కొంచెము చమురును, పరిమళతైలమును తెచ్చి పెట్టుడు. నేను స్నానము చేయుచుండగా తోట తలు పులు మూసిఉంచుడు” అని చెప్పెను.

18. వారు తోట తలుపులను మూసివేసి సూసన్న కోరిన సామగ్రిని తెచ్చుటకై ప్రక్కదారిగుండ వెలుపలికి వెళ్ళిరి. ఆ ఇద్దరు పెద్దలు తోటలో దాగియున్నారని వారికి తెలియదు.

19. ఆ పనికత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగియున్న తావునుండి వెలుపలికి వచ్చి సూసన్నయొద్దకు పరుగెత్తిరి.

20. ఆమెతో, ”ద్వార ములు మూసిఉన్నవి. మనలనెవరును గమనింపరు. మేము నీపై మరులుకొని కామాగ్నితో మాడిపోవు చున్నాము. కావున నీవు మా కోర్కె తీర్చుము.

21. నీవిందులకు అంగీకరింపవేని మేము న్యాయస్థాన మున నీపై నేరము తెచ్చెదము. ఎవడో యువకుడు నీతోనుండెననియు, కావుననే నీవు పనికత్తెలను పంపి వేసితివనియు కూటసాక్ష్యము పలుకుదుము” అనిరి.

22. సూసన్న నిట్టూర్పు విడచుచు ”నేను ఇరకాట మున చిక్కితిని. నేను మీకు లొంగెదనేని, వ్యభిచార దోషమునకుగాను నాకు మరణదండనము విధింతురు. మీకు లొంగనేని, మీ చేతికి చిక్కుదును.

23. కాని ప్రభువునకు ద్రోహముగా పాపము చేయుటకంటె నిర్దోషిగా మీ చేతికి చిక్కుటయే మేలు” అని అనెను. 24. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. ఇద్దరు న్యాయాధిపతులు కూడ ఆమెపై నేరము మోపుచు బిగ్గరగా కేకలు ప్టిెరి.

25. వారిలో ఒకడు పరుగెత్తు కొనిపోయి తోట తలుపులుతెరచెను.

26. ఇంిలోని సేవకులు ఆ కేకలువిని సూసన్నకేమైన ప్రమాదము కలిగినదేమోయని తలంచి ప్రక్కదారిగుండ తోట లోనికి పరుగెత్తిరి.

27. న్యాయాధిపతులు తమ కథన మును వినిపింపగా నౌకరులు నిశ్చేష్ఠులై సిగ్గుపడిరి. వారామెనుగూర్చి అి్ట సుద్దులెన్నడును విని ఎరుగరు.

న్యాయాధిపతులు సూసన్నమీద కూటసాక్ష్యము పలుకుట

28. ఆ మరునాడు ప్రజలు యోవాకీము ఇంి వద్ద గుమిగూడిరి. ఇద్దరు న్యాయాధిపతులు సూసన్నను చంపింపవలెనను చెడుపన్నాగముతో అచికి వచ్చిరి.

29.ప్రజలందరును, వినుచుండగా వారు ”యోవాకీము భార్యయు, హిల్కియా కుమార్తెయునైన సూసన్నను పిలిపింపుడు” అని పలికిరి. 

30. జనులు సూసన్నను పిలిపింపగా ఆమె తన తల్లితండ్రులతోను బిడ్డలతోను, బంధువులతోను వచ్చెను.

31.సూసన్న మిగుల అందగత్తె, సుకుమారి.

32. ఆమె ముసుగు వేసికొనియుండెను. ఆ దుర్మార్గులిద్దరు ఆమె సౌందర్యమును తనివిదీర చూచుటకు ఆ ముసుగును తొలగింప ఆజ్ఞాపించిరి.

33. ఆమె బంధువులును, ఆమెను చూచిన వారంద రును కంటతడి పెట్టుకొనిరి.

34. అంతట ఆ ఇరువురు న్యాయాధిపతులును ప్రజలముందట నిలిచి సూసన్న తలపై తమ హస్త ముల నుంచిరి.

35. ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశమువైపు పారజూచెను. 

36. ఆ ఇరువురు ఆమెనుగూర్చి ఇట్లు కూటసాక్ష్యము పలికిరి. ”మేము తోటలో పచార్లుచేయుచుండగా ఈమె తన ఇద్దరు చెలికత్తెలతో అచికి వచ్చెను. ఈమె తోట తలుపులను మూపించి ఆ పనికత్తెలను బయికి పంపెను. 37. అంతట తోటలో దాగియున్న యువకుడొకడు ఈమె చెంతకురాగా వారు ఇరువురును కలిసి శయనించిరి. 38. మేమప్పుడు తోటలో ఒక మూలనుింమి. ఆ ఘోర కార్యమును చూచి మేము వారిచెంతకు పరు గెత్తితిమి. 39. మేము వారిద్దరు కలిసియుండుటను చూచినను, ఆ యువకుని పట్టుకోజాలమైతిమి. అతడు మాకంటె బలవంతుడు కనుక తోటతలుపులు తెరచు కొని ఉడాయించెను.

40 మేమీ స్త్రీని పట్టుకొని ఆ యువకుడెవడో చెప్పుమని అడిగితిమి. కాని ఈమె చెప్పలేదు. ఇది మా సాక్ష్యము.” 41. ఆ ఇరువురు పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులైయుండిరి. కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సూసన్నకు మరణదండన విధించిరి.

దానియేలు సూసన్నను రక్షించుట

42.  అంతట సూసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు ”నిత్యుడవైన దేవా! నీకు రహస్యములెల్ల తెలి యును. నీవు ప్రతికార్యమును అది జరుగకముందే  తెలిసికొందువు.

43. నాకిపుడు మరణశిక్ష పడినది. కాని నేను నిర్దోషిననియు, ఈ నరులు దుష్టబుద్ధితో కల్లలాడి నామీద నేరముమోపిరనియు నీకు తెలి యును. మరి నేను చనిపోవలసినదేనా?” అని పలికెను.

44. ప్రభువు ఆమె మొరాలించెను.

45. జను లామెను వధించుటకు కొనిపోవుచుండగా దేవుడు దానియేలు అను యువకుని ప్రేరేపించి అతనిచే మ్లాడించెను.

46. అతడు ”ఈమె మరణము నాకు సమ్మతముగాదు” అని బిగ్గరగా అరచెను.

47. అపుడు జనులెల్లరు అతనివైపు తిరిగి, ‘మీమాటల భావము ఏమి?’ అని అడిగిరి.

48. దానియేలు ప్రజలయెదుట నిలుచుండి ”యిస్రాయేలీయులారా! మీరెంతమూర్ఖులు! సరిగా విచారణ జరుపకయే యిస్రాయేలు మహిళకు మరణ దండన విధింతురా? మీరు సత్యమును తెలిసికొను ప్రయత్నము గూడ చేయరైతిరి.

49. కనుక ఈ నేర మును తిరిగి పరిశీలింపుడు, ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము” అని అనెను.

50. కనుక జనులందరు గబగబ మొదట విచారణ జరిగినచోికి తిరిగివచ్చిరి. అధికారులు దానియేలుతో ”దేవుడు నీకు పెద్దల వివేచనము నొస గెను. నీవు మా సరసన కూర్చుండి నీ భావమును మాకు వివరించి చెప్పుము” అని అనిరి.

51. దానియేలు ”మీరు ఆ ఇరువురు న్యాయా ధిపతులను వేరుచేయుడు. నేను వారిలో ఒకొక్కరిని ప్రత్యేకముగా ప్రశ్నింతును” అని చెప్పెను.

52. వారిని వేరుపరచిన తరువాత దానియేలు మొది న్యాయా ధిపతిని పిలిచి ”ఓయి! నీకు చెడ్డతనముననే ఏళ్ళు చెల్లినవి. నీవు పూర్వముచేసిన పాపములన్నియు ఇప్పుడు నీ నెత్తిమీదికి వచ్చినవి.

53. నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుింవి. నిర్దోషికి మరణదండనము విధింప రాదని ప్రభువాజ్ఞాపించినను, నీవు నిరపరాధులను శిక్షించి, అపరాధులను వదలిప్టిెతివి.

54. నీవీ స్త్రీని స్పష్టముగా చూచితినని చెప్పుచున్నావు గదా! అట్లయిన ఆ ఇరువురిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము” అని అడిగెను. అతడు ”మస్తకి వృక్షము క్రింద” అని చెప్పెను.

55. దానియేలు ”సరే, నీ అబద్ధమే నీ ప్రాణ ములు తీయును. దేవుడు నిన్ను రెండు ముక్కలుగా నరికివేయుమని తన దూతకు ఆజ్ఞ ఇచ్చెను” అని పలికెను.

56. అంతట మొదిన్యాయాధిపతిని వెలుపలికి కొనిపోయి రెండవన్యాయాధిపతిని దానియేలు ఎదుికి కొనివచ్చిరి. దానియేలు అతనిని చూచి ”నీవు యూదజాతికి కాక కనానీయులజాతికి చెందినవాడవు. ఈమె సౌందర్యము నిన్ను చెరచెను. కామము నిన్ను పెడత్రోవ ప్టించెను.

57. నీవు యిస్రాయేలు వనిత లను చెరచుచుింవి. వారు భయపడి నీకు లొంగి పోయిరి. కాని ఈ యూదావనిత నీ దౌష్ట్యము నకు లొంగదయ్యెను.

58. నీవు వీరిని ఏ చెట్టుక్రింద చూచి తివో చెప్పుము” అని పలికెను. అతడు ‘సింధూరము క్రింద’ అని జవాబు చెప్పెను.

59. దానియేలు ”సరే, ఇి్ట బొంకుపలికి నీ కుత్తికమీదికి తెచ్చుకొింవి. దేవదూత తన కత్తితో నిన్ను రెండుముక్కలుగా తరుగుటకు సిద్ధముగాను న్నాడు. అప్పుడు మీ ఇద్దరి పీడవదలును” అని అనెను.

60. అంతట జనులందరు కోలాహలము చేసి తన్ను నమ్మినవారిని రక్షించు దేవుని కొనియాడిరి.

61. దానియేలు ఆ ఇద్దరు న్యాయాధిపతులు కూట సాక్ష్యము పలికిరని రుజువు చేసెను కనుక ప్రజలు వారిమీద విరుచుకుపడిరి.

62. కూట సాక్ష్యము పలికినవారు నిందితునిక్టిె శిక్షపడునో అి్ట శిక్షనే అనుభవింపవలెనని మోషే ధర్మశాస్త్రము శాసించు చున్నది. కనుక వారు ఆ ఇద్దరికిని మరణదండన విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధియైన వనిత ప్రాణములు దక్కెను.

63. సూసన్న నిర్దోషియని రుజు వయ్యెను. కనుక ఆమె తల్లిదండ్రులు, భర్త దేవుని స్తుతించిరి.

64. నాినుండి దానియేలు కీర్తి పెరిగి పోయెను.

Previous                                                                                                                                                                                                   Next