మందిర నిర్మాత సొలోమోను

మందిరనిర్మాణమునకు సన్నాహములు

5 1. తూరు రాజైన హీరాము దావీదునకు ఆప్త మిత్రుడు. హీరాము, దావీదు స్థానములో సొలోమోను రాజయ్యెనని విని అతని దగ్గరకు రాయబారులను  పంపెను.

2-3. సొలోమోను హీరామునకు సందేశ ము పంపి ”ప్రభువునకు మా తండ్రి దావీదు మందిరము నిర్మింపలేకపోయెను. చుట్టుపట్లనున్న శత్రువులతో పోరాడి ప్రభుకృపవలన వారిని గెలుచుట తోనే ఆయన కాలమంతయు చెల్లిపోయెను.

4. కాని ఇపుడు ప్రభువు మా దేశపు సరిహద్దులందెల్ల శాంతి నెలకొల్పెను. నాకు శత్రువులు లేరు. ఇక ఏ కీడులు కలుగవు.

5. ‘నీ తరువాత నేను నీ కుమారుని సింహా సనము ఎక్కింతును, అతడే నాకు దేవాలయము కట్టును’ అని ప్రభువు మా తండ్రికి మాట ఇచ్చెను. కావున నేను ఇపుడు మా దేవుడైన ప్రభువునకు మందిరము నిర్మింప నిశ్చయించుకొింని.

6. నీవు నాకొరకై లెబానోనున ఎదుగు దేవదారులను నరికింప వలయును. నా సేవకులు నీ సేవకులతో కలసి పని చేయుదురు. నీ పనివారికి నీవు నియమించిన వేతన ములు నేను చెల్లింతును. నీ పనివారైన సీదోనీయుల వలె చెట్లుకొట్టగల నేర్పరులు మా వారిలోలేరు” అని చెప్పించెను.

7. సొలోమోను వర్తమానము విని హీరాము మిక్కిలి సంతసించి ”మహాజాతిగా విస్తరిల్లిన దావీదు ప్రజలను పరిపాలించుటకై అతనికి వివేకవంతుడైన కుమారుని ప్రసాదించిన ప్రభువునకు స్తుతి కలుగును గాక!” అని అనెను.

8. అతడు ”నీ సందేశము అందినది. నీవు కోరినట్లుగనే దేవదారులను సరళ వృక్షములను క్టొింతును.

9. మా పనివారు కలపను లెబానోనునుండి సముద్రతీరమునకు చేర్చెదరు. దూల ములను తెప్పలుక్టి నీవు కోరుకొన్న తావునకు పంపు దురు. అచట మా పనివారు తెప్పలను విప్పగా మీ పనివారు కొయ్యను కొనిపోవచ్చును. నీవు మాత్రము మా పనివారికి భోజన సదుపాయములు ఒనర్పుము” అని సొలోమోనునకు బదులు మాటపంపెను.

10. ఈరీతిగా హీరాము సొలోమోనునకు కావ లసినంత దేవదారు, సరళవృక్షముల కలపను సరఫరా చేసెను. 11. సొలోమోను హీరాము పనివారికి ఏటేట లక్ష కుంచముల గోధుములను, లక్ష పదివేల సీసాల అచ్చమైన ఓలివునూనెను పంపించెను.

12. ప్రభువు తాను వాగ్ధానము చేసినట్లే సొలోమోనునకు వివేకము నొసగెను. సొలోమోనునకు హీరామునకు పొత్తు కుదిరెను. వారిరువురును ఒడంబడిక కూడ చేసికొనిరి.

13-14. సొలోమోను యిస్రాయేలీయుల నుండి ముప్పదివేలమంది వ్టెిచాకిరి చేయువారిని ప్రోగుచేసి అదోనీరామును వారికి అధిపతిగా చేసెను. అతడు వారిని ఒక్కొక్క గుంపున పదివేలమంది చొప్పున మూడుగుంపులుగా విభజించెను. ఒక్కొక్కగుంపు లెబానోనున ఒకనెల, ఇంివద్ద రెండునెలలు గడపెను.

15. సొలోమోను పనివాండ్రు ఎనుబది వేలమంది కొండలలో రాళ్ళుచెక్కిరి. డెబ్బదివేలమంది ఆ రాళ్ళను మోసికొనివచ్చిరి.

16. ఆ రాతిపని వారిమీద మూడు వేల మూడువందలమంది పర్యవేక్షకులువుండిరి. 

17. సొలోమోను ఆజ్ఞపై రాతిపనివారు దేవాలయ పునాదులకు అత్యంత ఖరీదైన, పెద్దరాళ్ళను మలిచి సిద్ధముచేసిరి.

18. సొలోమోను పనివాండ్రు, హీరాము పనివాండ్రు, గిబాలీయుల పనివాండ్రు దేవాలయ నిర్మాణమునకు కావలసిన రాళ్ళను, కొయ్యనుచెక్కి సిద్ధముచేసిరి.