లేవి-ప్రధానయాజకుల వంశవృక్షము

6 1. లేవి కుమారులు గెర్షోము, కోహాతు, మెరారి.

2. కోహాతు తనయులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.

3. అమ్రాము సంతానము అహరోను, మోషే, మిర్యాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియెజెరు, ఈతామారు.

4-14. ఎలియెజెరు వంశజులు క్రమముగా వీరు: ఫీనెహాసు, అబీషూవ, బుక్కి, ఉస్సి, సెరహ్యా, మెరాయోతు, అమర్యా, అహీతూబు, సాదోకు, అహిమాసు, అజర్యా, యోహానాను, అసర్యా (సొలోమోను రాజు యెరూషలేమునిర్మించిన దేవాలయమున యాజకత్వము చేసినవాడితడే). అమర్యా, అహీతూబు, సాదోకు, షల్లూము, హిల్కియా, అజర్యా, సెరాయా, యెహోసాదాకు.

15. ప్రభువు నెబుకద్నెసరు ద్వారా యూదా యెరూషలేము ప్రజలను ప్రవాసమునకు పంపెనుగదా! వారిలో యెహోసాదాకు ఒకడు.

16. లేవి కుమారులు గెర్షోము, కోహాతు, మెరారి.

17. గెర్షోము తనయులు లిబ్నీ, షిమీ.

18. కోహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.

19. మెరారి కుమారులు మహ్లి, మూషి.

20-22. గెర్షోమీయులు క్రమముగా వీరు:లిబ్నీ, యహతు, సిమ్మా, యోవా, ఇద్దో, సెర, యెయాతిరయి.       

23-24. కోహాతు వంశజులు క్రమముగా వీరు: అమ్మీనాదాబు, కోరా, అస్సీరు, ఎల్కానా, ఎబ్యాసాఫు, అస్సీరు, తాహతు, ఊరియేలు, ఉస్సీయా, షావూలు.

25-27. ఎల్కానా కుమారులు అమాసయి, అహీమోతు. అహీమోతు వంశజులు క్రమముగా వీరు: ఎల్కానా, జోఫయి, నహతు, ఎలీయాబు, యెరోహాము, ఎల్కానా.

28. సమూవేలు కుమారులు యోవేలు, అబీయా.

29-30. మెరారి వంశీయులు క్రమముగా వీరు: మహ్లి, లిబ్నీ,  షిమీ, ఉస్సా, షిమ్యా, హగ్గీయా, అసాయా.

దేవాలయ గాయకులు

31. నిబంధనమందసమునకు స్థలము ఏర్పాటు అయిన తరువాత దేవుని ఆలయమునందు సంగీత సేవకొరకు దావీదు గాయకులను నియమించెను.

32. సొలోమోను యెరూషలేములో యావే మంది రము క్టినంత వరకు వీరు సమావేశపు గుడారము ముంగిట వంతులవారిగా పాటలుపాడిరి.

33-38. ఈ గాయకుల వంశవృక్షములివి:

కోహాతు వంశజులు వీరు: సమూవేలు కుమారు డగు యోవేలు కుమారుడు హేమాను మొది గాయక బృందమునకు నాయకుడు. ఇతని పూర్వులు క్రమముగా వీరు: యోవేలు, సమూవేలు,  ఎల్కానా, యెరోహాము, ఎలీయేలు, తోవా, సూఫు, ఎల్కానా, మహతు, అమాసయి, ఎల్కానా, యోవేలు, అజర్యా, జెఫన్యా, తాహతు, అస్సీరు, ఎబ్యాసాపు, కోరా, ఇస్హారు, కోహాతు, లేవి, యిస్రాయేలు.

39-43. హేమాను సోదరుడైన ఆసాపు  ఇతని కుడిప్రక్కన నిలుచువాడు. ఇతని పూర్వులు క్రమముగా బెరఖ్యా, షిమ్యా, మికాయేలు, బాసేయా, మల్కీయా, యెత్నీ, సెర, అదాయా, ఎతాను, సిమ్మా, షిమీ, యాహతు, గెర్షోము, లేవి.

44-47. మెరారి తెగకుచెందిన ఎతాను ఎడమ ప్రక్కన నిలుచువాడు. ఇతని పూర్వులు క్రమముగా కీషి, అబ్ది, మల్లూకు, హషబ్యా, అమస్యా, హిల్కీయా, అమ్సి, బానీ, షమేరు, మహ్లి, మూషీ, మెరారి, లేవి.

48. పైవారి సోదరులైన ఇతర లేవీయులు ప్రభు గుడారమున ఇతరసేవలు చేయుటకు నియమింప బడిరి.

49. అహరోను, అతని వంశజులు ధూప పీఠము మీద సాంబ్రాణిపొగ వేసిరి. బలిపీఠము మీద దహనబలులర్పించిరి. మహాపవిత్రస్థలమున జరుగు పరిచర్యనంతిని, యిస్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తార్ధబలులను వారే నిర్వహించిరి. ప్రభు దాసుడైన మోషే ఆజ్ఞాపించినట్లే వారు ఈ  కార్యము లెల్లచేసిరి.

50-53. అహరోను వంశజులు క్రమ ముగా వీరు: ఎలియెజెరు, ఫీనెహాసు, అబీషూవ, బుక్కి, ఉస్సీ, సెరహ్యా, మెరాయోతు, అమర్యా, అహీతూబు, సాదోకు, అహీమాసు.

యాజకుల నివాసస్థలములు

54. కోహాతు వంశమునకు చెందిన అహరోను సంతతివారైన యాజకులకు లభించిన భాగమిది. లేవీయులకు ఉద్దేశింపబడిన భూమిలో వారికి మొది భాగమును పంచియిచ్చిరి.

55. యూదా రాజ్యము లోని హెబ్రోను, దాని చుట్టుపట్టులగల పచ్చిక మైదానములు వారికి లభించెను.

56. కాని ఈ నగర మునకు చెందిన పల్లెలను, పొలములను యెఫున్నె కుమారుడగు కాలెబునకు ఇచ్చిరి.

57-59. అహరోను సంతతివారికి వచ్చిన నగరములేవనగా: ఆశ్రయ నగరమైన హెబ్రోను, యాత్తీరు, లిబ్నా, ఎస్తెమోవా, హిలేను, దెబీరు, ఆషాను, బేత్‌షేమేషు అను నగరములు, వాని గడ్డిబీడులుకూడ వారికి చెందెను. 60. బెన్యామీను మండలమున వారికి గేబా, అలెమెతు, అనాతోతు అను నగరములు వాని గడ్డి బీడులతో లభించెను. ఈ రీతిగా వారి వంశములకు లభించిన నగరములు మొత్తము పదుమూడు.

61. కోహాతీయుల వంశములో మిగిలినవారికి అర్ధతెగ నుండి అనగా మనష్షే అర్ధతెగలవారి స్థానములలో నుండి పదిపట్టణములను కుటుంబముల వారిగా చీట్లువేసి పంచియిచ్చిరి.

లేవీయుల నివాసస్థలములు

62. యిస్సాఖారు, ఆషేరు, నఫ్తాలి అను తెగ లను, బాషానునందలి మనష్షే స్థానములలోనుండి పదుమూడు నగరములను తీసికొని గెర్షోము వంశీ యులకు కుటుంబములవారిగా పంచియిచ్చిరి.

63. అదే రీతిగా రూబేను, గాదు, సెబూలూను తెగలవారి స్థానములలోనుండి పండ్రెండు నగరములను మెరారి వంశీయులకు కుటుంబములవారిగా చీట్లువేసి పంచి యిచ్చిరి.

64. ఈ రీతిగా యిస్రాయేలీయులు, లేవీయు లకు ఆయా నగరములను, వాని చుట్టుపట్లగల గడ్డిమైదానములను ఇచ్చిరి.

65. పైన పేర్కొన బడిన యూదా, షిమ్యోను, బెన్యామీను మండలములలోని నగరములను చీట్లువేసి పంచియిచ్చిరి.

66-70. కోహాతు వంశములో కొన్ని కుటుంబ ములకు ఎఫ్రాయీము మండలమున కొన్ని  పొలిమేర నగరములును, వానికి చెందిన గడ్డిబీడులును లభించెను. అవి ఇవి: నరహంతలు ఆశ్రయము పొందగలిగినదై ఎఫ్రాయీము కొండలలోనున్న షెకెము, గేసేరు, యోక్మెయాము, బేత్‌హోరోను, అయ్యాలోను, గాత్‌రిమ్మోను. ఇంకను మనష్షే అర్ధతెగ నుండి ఆనేరు, బిలియాము.

71-76. గెర్షోము వంశమునకు చెందిన కుటుంబములకు ఈ క్రింది నగరములు, వాని చుట్టుపట్లగల గడ్డిబీడులు లభించెను. మనష్షే అర్ధతెగ నుండి బాషానునందలి గోలాను, అష్టారోతు. యిస్సాఖారు మండలము నుండి కాదేషు, దాబెరతు, రామోతు, ఆనెము. ఆషేరు మండలము నుండి మాషాలు, అబ్దోను, హుక్కోకు, రెహోబు. నఫ్తాలి మండలము నుండి కాదేషు, గలిలీయలోని హమ్మోను, కిర్యతాయీము.

77-81. మెరారి వంశములో మిగిలిన కుటుంబ ములకు ఈ క్రింది నగరములును మరియు వాని చుట్టుపట్లగల గడ్డిబీడులును లభించెను.సెబూలూను మండలమునుండి రిమ్మోను, తాబోరు మరియు వాని చుట్టుపట్లగల  గడ్డిబీడులును,  యెరికోకు ఆవల యోర్దానునకు తూర్పుననుండు రూబేను తెగస్థానము నుండి క్రింది నగరములు ఇవి: పీఠభూమిలోని బేసేరు మరియు యహసు, కెదెమోతు, మేఫాతు అను పట్టణ ములు మరియు వాని చుట్టుపట్లగల గడ్డిబీడులు. గాదు మండలమునుండి గిలాదునందలి రామోతు, మహనాయీము, హెష్బోను, యాసెరు, వానిచుట్టుపట్ల గల గడ్డిబీళ్ళు ఇవ్వబడెను.