రెహబాము చేసిన కార్యములు

11 1. రెహబాము యెరూషలేమునకు తిరిగి రాగానే యూదా, బెన్యామీను తెగలనుండి మెరికల విం యుద్ధవీరులను లక్ష ఎనుబది వేలమందిని ప్రోగుజేసికొనెను. అతడు ఉత్తరదేశమందలి యిస్రా యేలీయులను జయించి తన రాజ్యమును తిరిగి స్వాధీనము చేసికోగోరెను.

2-4. కాని ప్రభువు దివ్యవాణి షెమయా ప్రవక్తకు ప్రత్యక్షమై ”నీవు రెహబాముతోను, యూదా మరియు బెన్యామీనీయుల తోను ఇట్లు నుడువుము. మీరు మీ సోదరుల మీదికి యుద్ధమునకు పోవలదు. ఎల్లరును ఎవరి ఇండ్లకు వారు తిరిగిపొండు. ఈ కార్యము నా వలన జరిగినది” అని చెప్పెను. కనుక వారు ప్రభువు ఆజ్ఞకు బద్ధులై యుద్ధప్రయత్నములు విరమించుకొని వెడలిపోయిరి.

5-10. రెహబాము యెరూషలేమున వసించెను. అతడు యూదా బెన్యామీను మండలములలోని ఈ క్రింది నగరములకు ప్రాకారములు నిర్మించెను: బేత్లెహేము, ఏతాము, తెకోవా,  బేత్సూరు,  సోకో, అదుల్లాము, గాతు, మారేషా, సీఫు, అదోరయీము, లాకీషు, అసేకా, సోరా, అయ్యాలోను, హెబ్రోను.

11-12. అతడు ఈ నగరములన్నింకి సురక్షిత ములైన ప్రాకారములు నిర్మించి, ఒక్కొక్కదానికి ఒక్కొక్క అధిపతిని నియమించెను. ఒక్కొక్క దానిలో ఆహార పదార్థములు, ఓలివునూనె, ద్రాక్షసారాయము, డాళ్ళు, ఈటెలు నిల్వయుంచెను. ఆ రీతిగా అతడు యూదా బెన్యామీను నగరములను తనపక్షమున నిలుపుకొనెను.

రెహబాము యాజకులను,

లేవీయులను ఆదరించుట

13. యిస్రాయేలు దేశమునందలి యాజకులును, లేవీయులును దక్షిణమునకు వచ్చి రెహబాము ప్రాపు జొచ్చిరి. 14. ఎందుకనగ, యరోబామును మరియు అతని కుమారులును ప్రభువునకు యాజకసేవ జరుగ నీయక లేవీయులను త్రోసివేయగా, వారు తమకు హక్కుభుక్తమైన గడ్డిమైదానములను, పొలములను వదలుకొని యూదాదేశమునకును, యెరూషలేమున కును వచ్చిచేరిరి.

15. అతడు బలిపీఠములకును, దయ్యములకును తాను చేయించిన దూడలకును తన సొంత యాజకులను ఏర్పరచుకొనెను.

16. అయినను పూర్ణహృదయముతో యిస్రాయేలు దేవుని వెదుకగోరిన భక్తులుమాత్రము అన్ని యిస్రాయేలు తెగలనుండియు లేవీయుల వెంట యెరూషలేమునకు వచ్చి అచట స్థిరపడి తమ పితరుల దేవుడైన ప్రభువునకు బలులు అర్పించిరి.

17. వీరివలన యూదారాజ్యము బల పడెను. రెహబాము తన తండ్రి, తాతలైన సొలోమోను దావీదు రాజుల మార్గమున నడిచిన మూడేండ్లపాటు వారెల్లరును అతనిని సమర్థించిరి.

రెహబాము ప్రభువును విడనాడుట

18. రెహబాము మహలతును పెండ్లియాడెను. ఆమె తండ్రి దావీదు కుమారుడైన యెరీమోతు. తల్లి యీషాయి మనుమరాలును, యెలియాబు   కుమార్తె యునైన అబీహాయిలు.

19. మహలతు వలన అతనికి యెవూషు, షెమర్యా, సహాము అను ముగ్గురు కుమారులు కలిగిరి.

20. అటుతరువాత అతడు అబ్షాలోము కుమార్తె మాకాను వివాహమాడి నలుగురు కుమారులను కనెను. వారు అబీయా, అత్తయి, సిజా, షెలోమీతు.

21. రెహబామునకు పదునెనిమిది మంది భార్యలు, అరువదిమంది ఉప పత్నులు, ఇరువది ఎనిమిది మంది కుమారులు, అరువది మంది కుమార్తెలునుండిరి. భార్యలందరిలో మాకా అనిన అతనికి ఎక్కువ ప్రీతి.

22. ఆ రాజు అబీయాను తన సహోదరులమీద అధిపతిగా నియ మించెను. తన తరువాత అతడు రాజు కావలెనని సంకల్పించుకొనెను.

23. రెహబాము మెలకువతో కుమారులందరిని యూదా బెన్యామీను మండలము లోని సురక్షిత పట్టణములకు అధిపతులనుగా నియ మించెను. ఆ కుమారుల పోషణమునకుగాను ధనమును సమృద్ధిగా వెచ్చించెను. వారికి చాలమంది యువతు లను పెండ్లిచేసెను.