ఎలీషా అద్భుతకార్యములు

విధవరాలి ఇంట నూనె

4 1. ప్రవక్తల సమాజమునకు చెందిన ఒక శిష్య ప్రవక్త ఇంి విధవరాలు ఎలీషా వద్దకు వచ్చి ”అయ్యా! నా పెనిమి చనిపోయినాడు. అతడెంత దైవభక్తుడో నీవెరుగుదువు! ఇప్పుడు ఋణదాత ఒకడు వచ్చి నా ఇద్దరు కుమారులను బానిసలుగా కొనిపోనున్నాడు” అని పలికెను.

2. ఎలీషా ఆమెతో ”అమ్మా! నీకు నేనేమి ఉపకారము చేయవలయునో చెప్పుము. ఇప్పుడు మీ ఇంట ఏమియున్నది?” అని అడిగెను. ఆమె ”ఒక దుత్తెడు నూనె మాత్రమున్నది” అనెను.

3. ప్రవక్త ఆమెతో ”మొదట నీవు వెళ్ళి మీ ఇరుగు పొరుగువారి ఇండ్లనుండి నీకు దొరికినన్ని ఖాళీ దుత్తలు ప్రోగుజేసికొనిరమ్ము.

4. ఆ మీదట నీవు నీ కుమారులు మీ ఇంిలోపలికివెళ్ళి తలుపులు బిగించు కొని ఆ ఖాళీ దుత్తలన్నిని నూనెతోనింపుడు. ఒక్కొక్క దుత్త నిండగనే దానిని ప్రక్కన పెట్టుడు” అని చెప్పెను.

5. ఆమె ఆ రీతిగనే కుమారులతో ఇంి లోపలికివెళ్ళి తలుపుబిగించుకొనెను. కొడుకులు దుత్తలనందించు చుండగా తాను వాిని నూనెతోనింపెను.

6. అన్ని నిండిన పిదప ఆమె ఇంకను దుత్తయేదైన ఉన్నదా అని కుమారుని అడుగగా అతడు ఏదియులేదని చెప్పెను. వెంటనే ఇంటనున్న దుత్తనుండి నూనె పొర్లుట ఆగిపోయెను.

7. ఆ వితంతువు ప్రవక్త వద్దకు వెళ్ళి జరిగినసంగతి చెప్పగా అతడు ”ఆ నూనెను అమ్మి మీ బాకీ తీర్చుకొనుడు. ఋణముతీరగా మిగిలినసొమ్ముతో నీవును, నీ  కుమారులును బ్రతుక వచ్చును” అని చెప్పెను.

షూనేము వనిత, ఆమె కుమారుడు

8. ఒకనాడు ఎలీషా షూనేము నగరమునకు వెళ్ళగా అచటవసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనమునకు రమ్మని బలవంతపెట్టెను. అప్పినుండి ఎలీషా ఆ దెసగా పయనించినపుడెల్ల ఆమె ఇంటనే భోజనము చేసెడివాడు.

9. ఆమె తన పెనిమితో ”ఈ అతిథి ఇన్నిసారులు మన ఇంికివచ్చి పోవు చున్నాడు. ఇతడు దైవభక్తుడు.

10. మన ఇంిమీద ఒక గది క్టించి దానిలో మంచము, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అతడు మన ఇంికి వచ్చినపు డెల్ల ఆ గదిలో విశ్రమించును” అని చెప్పెను.

11. ఒకసారి ఎలీషా షూనేమునకు వచ్చి తనకొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసికొనెను.

12. అతడు తన సేవకుడగు గేహసీని పిలిచి  ఈ షూనేమీయు రాలిని పిలువమనగా, ఆమె వచ్చి ప్రవక్త దాపున నిలు చుండెను.

13. అతడు గేహసీతో ”ఆమెతో ఇట్లనుము. నీవు మాయందు భక్తిశ్రద్ధలు చూపితివికదా! నేను నీకేమి చేయవలయును? రాజునొద్దగాని, సైన్యాధిపతి యొద్ద గాని నీవు విన్పించుకోగోరిన మనవులేమైన ఉన్నచో మేముపోయి వారితో మ్లాడివచ్చెదము” అని అడు గమని గేహసీకి ఆజ్ఞఇవ్వగా, వాడు ఆ ప్రకారముగా ఆమెను అడిగెను. కాని ఆమె ”నేను నాసొంత జనుల మధ్యనున్నాను, నా అక్కరలన్నియు వారే తీర్తురు” అనెను.

14. ప్రవక్త ”మరి మనము ఈమెకు ఏమి సహాయము చేయుదుము?” అని గేహసీ నడిగెను. అతడు ”ఈమెకు సంతానములేదు. పెనిమి కూడ ముసలివాడయ్యెను” అని చెప్పెను.

15. ప్రవక్త ఆమెను నా ఎదుికి పిలువుమని చెప్పెను.

16. ఆమెవచ్చి తలుపుచెంత నిలువబడగా ప్రవక్త ”రానున్న యేడు ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డడుండును” అని పలికెను. ఆమె ”అయ్యా! నీవు దైవభక్తుడవు. నాతో అబద్ధములాడవలదు” అనెను.

17. అటు పిమ్మట ఆమె గర్భవతియై సరిగా ఎలీషా చెప్పిన సమయమునకే కుమారుని కనెను.

18. శిశువు పెరిగి పెద్దవాడయ్యెను. ఒకనాడు అతడు పొలమున కోతగాండ్రతో పంట కోయించు తండ్రివద్దకు వెళ్ళెను.

19. అక్కడ బాలుడు తలవని తలంపుగా ”నాయనా! నాకు తలనొప్పిగా ఉన్నది” అని అరచెను. తండ్రి ఒక సేవకుని పిలిచి బిడ్డను తల్లి వద్దకు కొనిపొమ్మనెను.

20. సేవకుడు బాలుని తల్లివద్దకు కొనిపోయెను. ఆమె బిడ్డను మధ్యాహ్నము వరకు ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. అటు తరువాత అతడు చనిపోయెను.

21. తల్లి బాలుని ఎలీషా గదిలోనికి మోసికొనిపోయి దైవభక్తుని పడుకమీద పరుండబ్టెి గది తలుపులు మూసివేసెను.

22. అంతట ఆమె పెనిమిని పిలిచి ”నాకొక గాడిదయు, సేవకుడును కావలయును. నేను శీఘ్రమే దైవభక్తుని యొద్దకు వెళ్ళివచ్చెదను” అని చెప్పెను.

23. భర్త ఆమెతో ”నీవు నేడు ప్రవక్తయొద్దకుపోనేల? ఈ దినము విశ్రాంతిదినమును కాదు, అమావాస్యయును కాదు గదా!” అనెను. ఆమె ”కాకున్నను పరవాలేదు” అని  పలికెను.

24. అంతట ఆ ఇల్లాలు గాడిదపై జీను వేయించెను. సేవకునితో ”గాడిదను త్వరగా నడి పింపుము. నేను చెప్పనిదే ఆపవలదు” అని చెప్పెను.

25. ఆ రీతిగా ఆమె పయనమై వచ్చి కర్మెలుకొండపై నున్న ఎలీషా తావును చేరుకొనెను.

26. ప్రవక్త ఆమెను అల్లంతదూరము నుండియే గుర్తుప్టి సేవకుడగు గేహసీతో ”అదిగో! ఆ షూనేమీయురాలు వచ్చుచున్నది. నీవు పరుగెత్తుకొనిపోయి ఆమె, పెని మి, పిల్లవాడు క్షేమముగా ఉన్నారో లేదో తెలిసి కొనిరమ్ము” అనెను. గేహసీ ఎదురువచ్చి తనను కలిసికొనగా ఆమె అందరును కుశలముగనే ఉన్నామని చెప్పెను.

27. కాని ఆ గృహిణి ప్రవక్తచెంతకు వచ్చి అతని పాదములు పట్టుకొనెను. గేహసీ ఆమెను ప్రక్కకు తొలగింపబోయెనుగాని ఎలీషా అతనితో ”నీవు ఈ ఇల్లాలిజోలికి వెళ్ళవలదు. ఈమె హృదయము సంతా పముతో నిండియున్నది. కారణమేమో యావే నాకు తెలియజేయడయ్యెను” అని అనెను.

28. ఆ గృహిణి అతనితో ”అయ్యా! ఆనాడు నేను బిడ్డను కోరుకొింనా? నన్ను వంచింపవద్దని మనవిచేయలేదా?” అని అనెను.

29. ఎలీషా గేహసీతో ”నీవు నడికట్టు కట్టుకొని నా చేతికఱ్ఱను తీసికొని వెంటనేపయనమైపొమ్ము. దారిలో ఎవ్వరిని పలుకరింపవలదు. నిన్ను పలుకరించిన వారికి సమాధానముకూడ చెప్పవలదు. తిన్నగా ఆ ఇంికివెళ్ళి బాలునిపై నా కఱ్ఱచాపుము” అని చెప్పెను.

30. కాని ఆ ఇల్లాలు ”యావే జీవముతోడు! నీ జీవముతోడు! నేను నిన్ను వదలిపెట్టను” అని పలికెను. కనుక ఎలీషా ఆమె వెంటవెళ్ళెను.

31. గేహసీ వారికి ముందుగా పోయి బాలునిపై కఱ్ఱచాపెను గాని మృతదేహమునుండి శబ్దములేదు, సమాధానమును లేదు. కనుక అతడు ఎలీషాను కలిసికొన ఎదురువెళ్ళి బాలుడు మేల్కొనలేదని విన్నవించెను. 32. ఎలీషా ఆ ఇంికి రాగానే పడకపైనున్న మృతదేహము కనిపించెను.

33. అతడు గదిలోనికి వెళ్ళి లోపలినుండి తలుపులు బిగించి ప్రభువును ప్రార్థించెను.

34. అంతట ప్రవక్త మంచము మీదికెక్కి బాలునిపై బోరగిల పరుండెను. అతని నోరు, కన్నులు, చేతులు బాలుని నోిని, కన్నులను, చేతులను తాకుచుండెను. అతడు ఆ రీతిగా కాలుసేతులు చాచుకొని చిన్నవానిపై పరుండగా బాలుని శరీరమున ఉష్ణము పుట్టెను.

35. ఎలీషా మంచముదిగి గది నలువైపుల కొంచెముసేపు పచార్లు చేసెను. మరల మంచము ఎక్కి కాలుసేతులు చాచు కొని చిన్నవానిపై బోరగిలపరుండెను. ఈమారు బిడ్డడు ఏడుసార్లు తుమ్మి కన్నులు విప్పిచూచెను.

36. అంతట అతడు గేహసీతో ఆ షునామీయురాలును పిలువుమని చెప్పెను. ఆమె రాగా ఎలీషా ”ఇదిగో నీ బిడ్డడు! తీసికొనిపొమ్ము” అనెను.

37. ఆమె అతని పాదముల చెంత సాగిలపడెను. బిడ్డను తీసికొని పైగదినుండి వెలుపలికి వచ్చెను.

విషమెక్కిన పులుసు

38. ఒకమారు యిస్రాయేలు దేశమంతిని కరువు పీడించుచుండెను. అప్పుడు ఎలీషా గిల్గాలు నకు తిరిగివచ్చి ప్రవక్తల సమాజమునకు బోధించు చుండెను. అతడు సేవకునిపిలిచి పొయ్యిమీద పెద్ద కాగు ప్టిె ప్రవక్తలకు పులుసు వండుమని చెప్పెను.

39. ఆ ప్రవక్తలలో ఒకడు కూర ఆకులేమైన దొరుకు నేమో అని పొలమునకు పోయెను. అక్కడ ఒక పిచ్చితీగ కాయలు కాసియుండెను. అతడు ఒడినిండ కాయలు కోసికొని వచ్చి వానిని ముక్కలుగా తరిగి పులుసులో కలిపెను. అవి ఏమి కాయలో ఆ ప్రవక్తకు తెలియదు.

40. అటుతరువాత పులుసును వడ్డించిరి. కాని ప్రవక్త శిష్యులు దానిని నోటబెట్టుకొనగనే ఎలీషాను చూచి ”అయ్యా! ఈ పులుసునకు విషమెక్కినది” అని అరచిరి.  ఇక వారు దానిని ముట్టుకోరైరి.

41. ఎలీషా ”కొంచెము పిండిని నాయొద్దకు కొనిరండి” అని చెప్పెను. అతడు ఆ పిండిని పులుసు కాగులో పడవేసి ”ఈ మారు వడ్డింపుడు” అనెను. ఆ పులుసు వారికి ఎి్ట హానియు చేయదయ్యెను.

రొట్టెలు పెరుగుట

42. మరియొకమారు బాల్షాలిషా నుండి ఒకడు ఇరువది రొట్టెలను, ధాన్యపు వెన్నులను తీసికొనివచ్చి ఎలీషాకు కానుక పెట్టెను. ఆ రొట్టెలు ఆ సంవత్సరము క్రొత్తగా త్రొక్కించిన యవధాన్యముతో చేయబడినవి. ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను, వెన్నులను ప్రవక్త లకు పంచిపెట్టుమని చెప్పెను.

43. కాని సేవకుడు ”వంద మందికి ఇవియేపాి?” అని అడిగెను. ఎలీషా ”వానిని వీరికి పంచిపెట్టుము. ప్రభువు వాక్కు ఇది: వీరు ఈ రొట్టెలను తిన్నపిమ్మట ఇంకను కొన్ని మిగు లును” అని పలికెను.

44. అతడు రొట్టెలను పంచిపెట్టెను. ప్రభువు చెప్పినట్లే, వారు భుజించిన పిమ్మట ఇంకను కొన్నిరొట్టెలు మిగిలెను.