సౌలు మరణము

10 1. ఫిలిస్తీయులు యిస్రాయేలీయుల మీదికి యుద్ధమునకు వచ్చిరి. యిస్రాయేలీయులు రణము నుండి పారిపోవుచుండగా ఫిలిస్తీయులు వారిని వెన్నాడి గిల్బోవా కొండమీద వధించిరి.

2. శత్రువులు సౌలును, అతని కుమారులను చుట్టుమ్టుిరి. యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అను సౌలు కుమారులను సంహరించిరి.

3. సౌలు చుట్టూ పోరు ముమ్మరమయ్యెను. కొందరు విలుకాండ్రు అతనిని బాణములతో క్టొి గాయపరచిరి.

4. అతడు తన అంగరక్షకునితో ”నీ బాకుతో నన్ను పొడిచిచంపుము, లేదేని సున్నతిసంస్కారము లేని ఈ ఫిలిస్తీయులు నా మీదబడి కసిదీర్చుకొందురు” అనెను. కాని అంగరక్ష కుడు అతనిని చంపుటకు భయపడెను. సౌలు తన బాకును తీసి దానిమీదపడి ప్రాణములు విడచెను.

5. అటుల సౌలు చనిపోవుటచూచి అతని అంగ రక్షకుడు తానును తన కత్తిమీద తానేపడి అసువులు వీడెను. 6. ఆ రీతిగా సౌలు అతని ముగ్గురు కుమారు లును గతించిరి. అతని కుటుంబము నాశనమయ్యెను.

7. క్రింది లోయలో వసించు యిస్రాయేలీ యులు తమ సైన్యము పారిపోయెననియు, సౌలు, అతని కుమారులు పోరున కూలిరనియు విని తమ నగరములను విడిచి పారిపోయిరి. అంతట ఫిలిస్తీయులు ఆ పట్టణము లను ఆక్రమించుకొని వానిలో వసింపమొదలిడిరి.

8. మరునాడు ఫిలిస్తీయులు శవములను దోచుకొనుటకురాగా గిల్బోవా కొండమీద సౌలు, అతని కుమారుల శవములు కనిపించెను.

9. వారు సౌలు తల తెగనరికిరి. అతని ఆయుధములను ఊడదీసిరి. వానిని ఫిలిస్తీయ దేశము నలుమూలలకు పంపి తమ దేవతలకును ప్రజలకును విజయ వార్తలను చాించిరి.

10. వారు సౌలు ఆయుధ ములను తమ దేవళమున భద్రపరచిరి. అతని తలను దాగోను మందిరమున వ్రేలాడగ్టిరి.

11. గిలాదునందలి యాబేషు పౌరులు ఫిలిస్తీ యులు సౌలుకు అపకారము చేసిరని వినిరి.

12. వారి వీరులందరును పయనమైవచ్చి సౌలు శవ మును, అతని తనయుల శవములను, యాబేషుకు కొనివచ్చిరి. ఒక సింధూరపువృక్షము క్రింద వారి అస్థులను పాతిప్టిె ఏడుదినములు ఉపవాసముండిరి.

13. ప్రభువును లక్ష్యము చేయలేదు కనుక సౌలు చచ్చెను. అతడు ప్రభుని ఆజ్ఞను త్రోసిపుచ్చెను. చనిపోయినవారి భూతములను ఆవాహము చేయు వారిని సంప్రదించెను.

14. ప్రభువును సంప్రదింప డయ్యెను కనుక ప్రభువు సౌలును సంహరించి అతని రాజ్యమును యిషాయి కుమారుడైన దావీదు వశము చేసెను.