యూదా రాజ్యమున ఉజ్జీయా పరిపాలన (క్రీ.పూ. 781-740)

15 1. యిస్రాయేలున యరోబాము పరిపాలనా కాలము ఇరువదియేడవ యేట, అమస్యా కుమారుడైన అజర్యా యూదా రాజ్యమునకు రాజు అయ్యెను.

2. అప్పికి అతనికి పదునారేండ్లు. అతడు యెరూషలేము నుండి ఏబది రెండేండ్లు పరిపాలించెను. యెరూషలేము నివాసి యెకోల్యా అతని తల్లి.

3. అతడు తన తండ్రి అమస్యావలెనే ధర్మబద్ధముగా జీవించి యావేకు ఇష్టుడయ్యెను.

4. కానీ అజర్యా ఉన్నతస్థలములను మాత్రము తొలగింపలేదు. ప్రజలు అచట బలులర్పించి సాంబ్రాణిపొగ వేయుచునేయుండిరి.

5. ప్రభువు అజర్యాకు కుష్ఠువ్యాధితో పీడ కల్పించెను. జీవితాంతము వరకు ఆ రోగము అతనిని వదలలేదు. అందుచేత అతడొక ప్రత్యేకభవనమున వసించెను. అతని కుమారుడు యోతాము రాజ్యభారము వహించి దేశమును పరిపా లించెను.

6. అజర్యా చేసిన ఇతరకార్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

7. అంతట అజర్యా తన పితరులతో నిద్రించి దావీదు నగరమున రాజ సమాధులలో పాతిపెట్టబడెను. అటుతరువాత అతని కుమారుడు యోతాము రాజయ్యెను.

యిస్రాయేలున జెకర్యాపరిపాలన (క్రీ.పూ.743)

8. యూదాసీమ యందు అజర్యా పరిపాలనా కాలము ముప్పదిఎనిమిదవయేట, యరోబాము కుమారుడు జెకర్యా యిస్రాయేలునకు రాజై సమరియా నగరమునుండి ఆరునెలలు పరిపాలించెను.

9. ఆ రాజుకూడ తన పూర్వులవలె యావే మెచ్చని దుష్కార్య ములు చేసెను. పూర్వము యిస్రాయేలును పాపము నకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబామువలె అతడును కానిపనులు చేసెను.

10. యాబేషు కుమారు డగు షల్లూము జెకర్యామీద కుట్రపన్ని ఈబ్లెయాము వద్ద అతనిని వధించి తాను రాజయ్యెను.

11. జెకర్యా చేసిన ఇతరకార్యములు యిస్రాయేలు రాజులచరిత మున లిఖింపబడియేయున్నవి.

12. ”నీ కుమారులు నాలుగవతరమువరకు సింహాసనముమీద కూర్చుందురు” అని ప్రభువు యెహూకు మాటయిచ్చెను గనుక ఆ మాట చొప్పుననే అంతయు జరిగినది.

యిస్రాయేలున షల్లూము పరిపాలన (క్రీ.పూ. 743)

13. యూదా రాజ్యమున ఉజ్జీయా పరిపాలనా కాలము ముప్పది తొమ్మిదవయేట, యాబేషు కుమా రుడు షల్లూము యిస్రాయేలునకు రాజై సమరియా నుండి ఒక్కనెల మాత్రమే పరిపాలించెను.

14. గాదీ కుమారుడు మెనహేము తీర్సానుండి సమరియాకు వెళ్ళి షల్లూమును హత్యచేసి తాను రాజయ్యెను. 15. షల్లూము చేసిన ఇతర కార్యములు, అతడు పన్నిన కుట్ర, యిస్రాయేలురాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

16. ఈ సమయముననే మెనహేము తపువా పట్టణమును, దానిలోని పౌరులను దాని పరిసర ప్రాంతములను మొదలంట నాశనము చేసెను. ఎందు కనగా ఆ నగరము అతనికి లొంగలేదు. అతడు పట్టణ మునందలి చూలాండ్ర కడుపులుగూడ చీల్చివేసెను.

యిస్రాయేలున మెనహేము పరిపాలన (క్రీ.పూ. 743-738)

17. యూదారాజు అజర్యా పరిపాలనాకాలము ముప్పదితొమ్మిదవయేట గాదీ కుమారుడు మెనహేము యిస్రాయేలునకు రాజై సమరియానుండి పదియేండ్లు పరిపాలించెను.

18. పూర్వము నెబాతు కుమారుడు యరోబాము జీవితాంతమువరకు యిస్రాయేలీయు లచే పాపము చేయించెనుగదా! మెనహేము కూడ అతనిమార్గమునే అనుసరించెను.

19. అతని కాల మున అస్సిరియా ప్రభువు తిగ్లత్‌పిలేసెరు యిస్రాయేలు మీదికి దండెత్తివచ్చెను. మెనహేము అతనికి ముప్పది ఎనిమిది బారువులవెండి సమర్పించుకొని యిస్రాయేలు మీద తన అధికారమును సుస్థిరము చేసికొనెను.

20. అతడు ఆ సొమ్ముకొరకై తన దేశమునందలి ధన వంతులందరు ఒక్కొక్కరు ఏబది వెండినాణెములు చెల్లించునట్లు నిర్బంధముచేసెను. తిగ్లత్‌పిలేసెరు ఆ సొమ్ముపుచ్చుకొని తన దేశమునకు వెడలిపోయెను.

21. మెనహేముచేసిన ఇతరకార్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

22. మెనహేము తనపితరులతో నిద్రించగా, అతని కుమా రుడు పెకహ్యా రాజయ్యెను.

యిస్రాయేలున పెకహ్యా పరిపాలన (క్రీ.పూ. 738-737)

23. యూదారాజు అజర్యా పరిపాలనాకాలము ఏబదియవ ఏట మెనహేము కుమారుడు పెకహ్యా యిస్రాయేలునకు రాజై సమరియానుండి రెండుయేండ్లు పరిపాలించెను.

24. యిస్రాయేలును పాపమునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబామువలె ఇతడును యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.

25. పెకహ్య సేనానాయకుడును, రెమల్యా కుమారుడునగు పెక, ఏబదిమంది గిలాదీయులతో కలిసి రాజుపై కుట్రపన్ని అతనిని సమరియాయందలి రాజసౌధపు అంతర్భాగమున హత్యచేసెను.

26. పెకహ్యా చేసిన ఇతర కార్యములు యిస్రాయేలురాజుల చరితమున లిఖింప బడియే ఉన్నవి.

యిస్రాయేలున పెక పరిపాలన (క్రీ.పూ. 737-732)

27. యూదారాజైన అజర్యా పరిపాలనాకాలము ఏబది రెండవయేట రెమల్యా కుమారుడగు పెక యిస్రాయేలునకు రాజై సమరియానుండి ఇరువదేండ్లు పరిపాలించెను.

28. ఇతడుకూడ యిస్రాయేలును పాపమునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబామువలె యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.

29. పెక పరిపాలనకాలముననే అస్సిరియా ప్రభువు తిగ్లత్‌పిలేసెరు దండెత్తివచ్చి ఇయోను, ఆబెల్బెత్మాకా, యనోవా, కేదేషు, హాసోరు నగరములను గిలాదు, గలిలీ, నఫ్తాలిసీమలను జయించి అచటనున్న యిస్రా యేలీయులను అస్సిరియాకు బందీలుగా కొనిపోయెను.

30. యూదా రాజ్యమున ఉజ్జీయా కుమారుడు యోతాము పరిపాలనాకాలము ఇరువదియవయేట ఏలా కుమారుడైన హోషేయ పెకమీద కుట్రపన్ని అతనిని హత్యచేసి తాను రాజయ్యెను.

31. పెక చేసిన ఇతరకార్యములు యిస్రా యేలురాజుల చరితమున లిఖింపబడియేఉన్నవి.

యూదా రాజ్యములో యోతాము పరిపాలన (క్రీ.పూ. 740-736)

32. యిస్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెక పరిపాలనాకాలము రెండవయేట ఉజ్జీయా కుమారుడు యోతాము తన ఇరువది ఐదవ యేట యూదాకు రాజయ్యెను.

33. అతడు యెరూషలేము నుండి పదునారేండ్లు పరిపాలించెను. అతని తల్లి సాదోకు కుమార్తెయగు యెరూషా.

34. అతడు తన తండ్రి ఉజ్జీయావలె ధర్మబద్ధముగా జీవించి యావే దృష్టికి నీతిగా ప్రవర్తించెను.

35. అయినను అతడు ఉన్నత స్థలములను పడగ్టొింపలేదు. ప్రజలు అచట బలులుఅర్పించి సాంబ్రాణిపొగ వేయుచునేయుండిరి. దేవాలయపు ఎత్తైనద్వారమును నిర్మించినది ఈ యోతామే.

36. యోతాము చేసిన ఇతరకార్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

37. అతడు రాజుగానున్న కాలమున ప్రభువు సిరియా రాజగు రెసీనును, యిస్రాయేలురాజగు పెకను యూదా మీదికి దండెత్త పంపనారంభించెను. 38. యోతాము తన పితరులతో నిద్రించి దావీదు నగరమున తన పితరుల సమాధులలో పాతిపెట్టబడెను. అతని అనంత రము అతని కుమారుడు ఆహాసు రాజయ్యెను.