యిస్రాయేలున యెహోవాహాసు పరిపాలన (క్రీ.పూ. 814-798)

13 1. యూదారాజ్యమున అహస్యా కుమారుడు యోవాషు ఏలుబడి ఇరువది మూడవయేట, యిస్రాయేలున యెహూ కుమారుడగు యెహోవాహాసు రాజై సమరియా నగరమునుండి పదునేడేండ్లు పరిపాలించెను.

2. పూర్వము యరోబాము రాజువలె యెహోవాహాసు కూడ దుష్కార్యములు చేసి ప్రజలను పాపమునకు ప్రేరేపించెను. అతడు జీవితాంతము వరకు పాపకార్యములు చేయుట మానడయ్యెను.

3. కనుక ప్రభువు యిస్రాయేలు మీద కోపించెను. సిరియా రాజు హసాయేలును, అతని కుమారుడు బెన్హెదదును పదేపదే యిస్రాయేలును ఓడించునట్లు చేసెను.

4. యెహోవాహాసు ప్రభువునకు మనవి చేసికొనెను. ప్రభువు సిరియారాజు యిస్రాయేలును దారుణముగా పీడించుట చూచి మనసు కరగి యెహోవాహాసు మొర ఆలించెను.

5. ప్రభువు యిస్రా యేలునకు ఒక విమోచకుని ప్రసాదింపగా అతడు సిరియనుల గర్వమణచెను. యిస్రాయేలీయులు మును పివలెనే శాంతిభద్రతలతో జీవించిరి.

6. అయినను వారు నాడు యరోబాము యిస్రాయేలీయులచే చేయించిన పాపకార్యములను ఎంతమాత్రమును మానరైరి. సమరియా యందు అషేరా దేవత విగ్రహ మునకు పూజలర్పించిరి.

7. యెహోవాహాసు సైన్యములో మిగిలినవారు ఏబదిమందిరౌతులు, పదిరథములు, పదివేలమంది కాల్బలము మాత్రమే. మిగిలిన సైన్యమునంతిని సిరియా రాజు కాలిక్రింది ధూళివలె అణగద్రొక్కెను.   

8. యెహోవాహాసు చేసిన ఇతరకార్యములు, అతని సాహసకృత్యములు యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

9. యెహోవాహాసు తన పితరులతో నిద్రించి, సమరియాలో పాతిపెట్ట బడెను. అటుతరువాత అతని కుమారుడు యెహోవాషు రాజయ్యెను.

యిస్రాయేలున యెహోవాషు పరిపాలన (క్రీ.పూ. 798-783)

10. యూదా రాజ్యమున యోవాషు ఏలుబడి ముప్పది యేడవయేట యెహోవాహాసు కుమారుడగు యెహోవాషు యిస్రాయేలు సీమకు రాజై సమరియా నుండి పదునారేండ్లు పరిపాలించెను.

11. ఇతడు కూడ యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. యిస్రాయే లును పాపమునకు పురికొల్పిన యరోబామువలె కానిపనులు చేసెను.

12. అతడు చేసిన ఇతర కార్యములు, యూదారాజగు అమస్యాతో నడచిన యుద్ధమున అతడు చూపిన పరాక్రమము యిస్రాయేలు రాజుల చరిత మున లిఖింపబడియే యున్నవి.

13. యెహోవాషు తన పితరులతో నిద్రించగా అతనిని సమరియాయందు పాతిప్టిెరి. అటుపిమ్మట అతని కుమారుడు యరోబాము రాజయ్యెను.

ఎలీషా మరణము

14. ఎలీషా ప్రవక్త మరణాపాయకరమైన వ్యాధికిగురియై మంచముప్టియుండగా యిస్రాయేలు రాజైన యెహోవాషు అతనిని చూడబోయెను. అతడు ”ఓ నా తండ్రీ! ఓ నా తండ్రీ! యిస్రాయేలునకు రథమును దాని సారధియు నీవే!” అని అంగలార్చెను.

15. ప్రవక్త విల్లు బాణములు తీసికొనిరమ్మని ఆజ్ఞాపింపగా రాజు వానిని కొనివచ్చెను.

16. ఎలీషా విల్లెక్కు పెట్టుమనగా రాజు ఎక్కుపెట్టెను. ప్రవక్త వింపైన ప్టిెన రాజు చేతులమీద తన చేతులు మోపెను.

17. అతడు తూర్పుదిక్కుననున్న కికీ తెరువుమనగా రాజు అట్లే తెరచెను. ప్రవక్త కికీగుండ బాణము విడువుమనగా రాజు విడిచెను. అప్పుడు ఎలీషా యెహోవాషుతో ”ఇది ప్రభువు సంరక్షణ బాణము. నీ ద్వారా ప్రభువు సిరియాను ఓడించును. నీవు ఆఫెకు చెంత సిరియనులతోపోరాడి వారిని గెలుతువు” అని నుడివెను.

18. అటుపిమ్మట ఎలీషా రాజుతో ”మిగిలిన బాణములతో నేలను కొట్టుము” అనెను. రాజు మూడు సారులు నేలను బాణములతో క్టొి అంతితో ఆగి పోయెను.

19. ఎలీషా రాజుమీద కోపపడి ”నీవు అయిదారుసార్లు నేలను కొట్టవలసినది. అప్పుడు సిరియాను పూర్తిగా అణగద్రొక్క గలిగెడివాడవుగదా! ఇప్పుడు నీవు ఆ దేశమును మూడుసార్లు మాత్రమే ఓడింపగలవు” అనెను.

20. తరువాత ఎలీషా చనిపోగా అతని శవ మును సమాధిలో పాతిప్టిెరి. ఆ రోజులలో మోవాబు దండులు ప్రతియేడు యిస్రాయేలుపై దాడిచేసెడివి.

21. ఒక పర్యాయము యిస్రాయేలీయులు ఒక శవ మును పాతిపెట్టబోవుచుండగా మోవాబుదండు వారి కంటబడెను. వారు శవమును ఎలీషాసమాధిలో పడ వేసి వేగముగ పారిపోయిరి. కాని ఆ ప్రేతము ఎలీషా అస్థికలకు తగులగనే జీవముతో లేచి నిలుచుండెను.

సిరియామీద విజయము

22. యెహోవాహాసు పరిపాలన కాలమందంతట హసాయేలు యిస్రాయేలీయులను పీడించి పిప్పిచేసెను.

23. కాని ప్రభువు కరుణామయుడు కనుక వారిని నాశనము కానీయలేదు. తాను అబ్రహాము, ఈసాకు, యాకోబులతో చేసుకొనిన నిబంధనను స్మరించుకొని యిస్రాయేలీయులకు తోడ్పడెనేగాని, వారిని చేయివిడువ లేదు.

24. హసాయేలు తరువాత అతని కుమారుడు బెన్హెదదు సిరియాకు రాజయ్యెను.

25. యెహోవాషు బెన్హెదదును మూడుసార్లు జయించెను. తన తండ్రి యెహోవాహాసు కాలమున బెన్హెదదు ఆక్రమించుకొనిన నగరములను మరల స్వాధీనము చేసికొనెను.