మోషే నిర్యాణము

34 1. అంతట మోషే మోవాబు మైదానమునుండి వెడలిపోయి యెరికో నగరమునకు ఎదురుగానున్న నెబో కొండయందలి పిస్గా శిఖరము నెక్కెను. అచి నుండి ప్రభువు అతనికి ఆ దేశము నంతిని చూపించెను. గిలాదు మండలమును దాను నగరము వరకు చూపించెను.

2. నఫ్తాలి మండలమును సంపూర్ణముగా చూపించెను. ఎఫ్రాయీము మనష్షే మండలమును చూపించెను. యూదా మండలమును మధ్యధరాసముద్రము వరకు చూపించెను.

3. దక్షిణ భాగమును, సోవరు యెరికో నగరముల మధ్య గల మైదానమును, ఖర్జూరవనముల పట్టణమును చూపించెను.

4. ప్రభువు మోషేతో ”నేను అబ్రహాము, ఈసాకు, యాకోబులకు బాసచేసి వారి సంతానము నకు ఇచ్చెదనన్న సీమ ఇదియే. నేను నీకు ఆ నేలను చూపించితిని. కాని నీవు అచటకు వెళ్ళజాలవు” అని అనెను.

5. ప్రభువు నిర్ణయించినట్లే దైవభక్తుడైన మోషే మోవాబు మండలముననే గతించెను.

6. ప్రభువు అతనిని బేత్పెయోరు పట్టణము నెదుట మోవాబు లోయలో పాతిపెట్టెను. కాని నేివరకు అతని సమాధి యెవరి కంటనుపడలేదు.

7. చనిపోవునాికి మోషే వయస్సు నూటయిరువదిఏండ్లు. అయినను అతని దృష్టి మందగింపలేదు, అతని శక్తిసన్నగిల్లలేదు.

8. మోవాబు మైదానమున యిస్రాయేలీయులు మోషే కొరకు ముప్పదినాళ్ళు శోకించిరి. ఆ పిమ్మట శోక దినములు ముగిసినవి.

9. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువపై ఉంచెను, గనుక అతడు పూర్ణవిజ్ఞానమును బడసెను. యిస్రాయేలీయులు యెహోషువకు విధేయులై ప్రభువు మోషే ముఖమున ప్రసాదించిన ఆజ్ఞలను పాించిరి.

10. నాినుండి మోషేవిం ప్రవక్త యిస్రాయేలీ యులలో మరల పుట్టలేదు. ప్రభువు అతనితో ముఖా ముఖి సంభాషించెను.

11. ప్రభువు ఫరోను అతని అధికారులను అతని దేశమును నాశనము చేయుటకై మోషేద్వారా ఎంతి అద్భుతకార్యములు, ఎి్ట సూచక క్రియలు చేయించెను!

12. యిస్రాయేలీయుల సమక్ష మున మోషే ఎంతి భయంకరమైన మహాకార్యములు నిర్వహించెను!

Previous                                                                                                                                                                                                Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము