భవన నిర్మాణము

8 1. దేవాలయమును, ప్రాసాదమును క్టి ముగించుటకు సొలోమోనునకు ఇరువది యేండ్లు పట్టెను.

2. అటు తరువాత అతడు హూరాము తనకిచ్చిన నగరములను పునర్నిర్మాణము చేయించి వానిలో యిస్రాయేలీయులను వసింపజేసెను.

3. అతడు హమాతు, సోబా మండలములను జయించెను.

4. ఎడారిలోని తడ్మోరు పట్టణమును సురక్షితము చేసెను. వస్తుసంభారములను నిల్వయుంచిన  హమాతు మండలపుపట్టణములను అన్నిని పునర్నిర్మించెను.

5. ఆ రాజు ఈ క్రింది నగరములనుగూడ పునర్ని ర్మాణము చేయించెను: కవాటములతో,  ప్రాకారము లతో సురక్షితములైయున్న ఎగువబేత్‌హారోను,  దిగువ బేత్‌హారోను, 6. బాలతునగరము, వస్తుసంభారము లను ఉంచిన నగరములు, రథములను,  గుఱ్ఱములను ఉంచిననగరములు. పైగా యెరూషలేమునందును, లెబానోనునందును తన ఏలుబడిలో నున్న ఇతర మండలములలోను తాను నిర్మింపగోరిన భవనముల నెల్ల నిర్మించెను.

7-8. యిస్రాయేలీయులు కనాను మండలమును ఆక్రమించుకొనినపుడు అచి జాతు లనన్నిని సంహరింపలేదు. అటుల సంహరింపక మిగిల్చిన జాతులవారి సంతానమైన ప్రజలను సొలోమోను వ్టెిచాకిరికి వినియోగించుకొనెను. హిత్తీయులు, అమోరీయులు, పెరిస్సీయులు, హివ్వీ యులు, యెబూసీయులు ఆ రీతిగా మిగిలియున్న ఆ జాతులవారి సంతానమే. ఈ ప్రజలు నేికిని వ్టెి చాకిరి చేయుచునే ఉన్నారు.

9. అతడు యిస్రాయేలీ యులచేత మాత్రము వ్టెిచాకిరి చేయింపలేదు. వారు సైనికులుగను, అధికారులుగను, రథనాయకులుగను, అశ్వదళాధిపతులుగను పనిచేసిరి.

10. వీరిలో రెండువందల ఏబదిమంది ముఖ్యులు. సొలోమోను రాజు వీరిని ప్రజలమీద అధికారులుగా నియమించెను.

11. సొలోమోను తన భార్యయైన ఐగుప్తురాజు కుమార్తెను దావీదునగరము నుండి తోడ్కొనివచ్చెను. తాను స్వయముగా నిర్మించిన భవనముననే ఆమెకు విడిదికల్పించెను. యిస్రాయేలు రాజైన దావీదు పట్టణమున ఆమె వసింపరాదనియు, దైవమందసము నుంచినందున ఆ తావు పవిత్రమైనదనియు అతడు తలంచెను.

12. సొలోమోను దేవాలయము నెదుట తాను నిర్మించిన బలిపీఠముపై ప్రభువునకు దహనబలులు అర్పించెను. 13. ప్రతిదిన దహనబలులు, విశ్రాంతి దినములందు, అమావాస్యలందు అర్పించుబలులు, పొంగనిరొట్టెల పండుగ, వారములపండుగ, గుడార ముల పండుగ అను మూడు సాంవత్సరిక ఉత్సవ ములు మొదలైనవానిని గూర్చి మోషే ధర్మశాస్త్రము నందు ఆదేశించిన నియమములనెల్ల అతడు పాించెను.

14. సొలోమోను తన తండ్రి దావీదు చేసిన నియమముల ప్రకారము యాజకుల అనుదిన ఆరాధనకార్యక్రమములను క్రమబద్ధము చేసెను. గానముచేయుచు ఆరాధనయందు యాజకులకు తోడ్పడు లేవీయుల పరిచర్యనుగూడ నియమబద్ధము చేసెను. దావీదు శాసనములననుసరించి దేవాలయ సంరక్షకులు ప్రతిరోజు ఆయా దేవాలయద్వారముల వద్ద చేయవలసిన ఊడిగమునుగూడ నియమబద్ధము చేసెను.

15. యాజకులు, లేవీయులు, రాజు తమని గూర్చి చేసిన నియమములనెల్ల పాించిరి. వస్తు సంభారములను గూర్చియు, ఇతరాంశములను గూర్చియు అతడుచేసిన శాసనములనెల్ల అనుసరించిరి.

16. సొలోమోను తలప్టిెన పనులన్నియు ముగి సెను. దేవాలయమునకు పునాదులెత్తుట నుండి దానిని క్టి ముగించుట వరకునుగల సకలకార్యములు విజయవంతముగా పూర్తిఅయ్యెను.

సొలోమోను వైభవము

17. అంతట సొలోమోను ఎదోము మండల ములోని ఏసోన్గెబేరు, ఏలొతు రేవులను చూడబో యెను. హురాము అతనికి ఓడలనంపెను. వానిని హురాము అధికారులు నైపుణ్యముగల అతని నావి కులు నడిపించిరి.

18. వారును, సొలోమోను నావికులును కలసి ఓఫీరు మండలమునకు వెళ్ళి అచినుండి పదునారు బారువుల బంగారము కొని తెచ్చిరి.