యొప్పా యామ్నియాలలో

జరిగిన సంఘటనములు

12 1. ఈ ఒడంబడికలన్నియు ముగిసిన తరు వాత  లీసియాసు రాజునొద్దకు వెళ్ళిపోయెను. యూదులు తమ దేశమునకు వెడలిపోయి సేద్యము చేసికొననారంభించిరి.

2. కాని స్థానికాధికారులైన తిమొతి, గెన్నెయసు కుమారుడు అపోల్లోనియసు, హిరోనిమసు, డెమొఫోను, సైప్రసు కూలిబంటులకు నాయకుడైన నికానోరు అనువారు మాత్రము యూదు లను ప్రశాంతముగా జీవింపనీయరైరి.

3. యొప్పా పౌరులు ఆ నగరమున వసించు యూదులకు ఈ క్రింది అపకారము చేసిరి. ఆ ప్రజలు యూదులకు స్నేహితులైనట్లుగా నించుచు వారిని కుటుంబసమేతముగా తమతోపాటు తమ పడవల మీద కొంతదూరము సముద్రయానము చేయుడని అడిగిరి.

4. నగర పౌరులెల్లరును కలిసి ఈ కార్యము తలప్టిెరి కనుక శాంతిప్రియులైన యూదుల్టెి ద్రోహమును శంకింపరైరి. వారు స్నేహబుద్ధితో ఆ ఆహ్వానమును అంగీకరించిరి. కాని సముద్రములోనికి వెళ్ళిన తరువాత యొప్పా పౌరులు యూదులను నీిలో ముంచివేసిరి. అటుల మునిగిపోయిన వారు రెండువందలమంది.

5. యూదా తన దేశీయులు ఇి్ట క్రూర కార్యము నకు బలియైరని విని తన అనుచరులను ప్రోగుజేసి కొనెను.

6. వారెల్లరును కలిసి న్యాయము జరిగించు న్యాయాధిపతియైన దేవునికి ప్రార్థనచేసిన పిదప హంతకుల మీదికి దాడిచేసిరి. రాత్రి యొప్పా రేవునకు నిప్పింంచి అచి ఓడలను తగులబ్టెిరి. దాగుకొను టకు అచికి వచ్చిన వారినెల్ల వధించిరి.

7. అప్పుడు నగరద్వారములు మూయబడియున్నవి. కనుక యూదా అప్పికి అచినుండి వెడలిపోయెను. కాని అతడు మరల తిరిగివచ్చి యొప్పా పౌరులందరిని మట్టుపెట్ట సంకల్పించుకొనెను.

8. అంతలోనే యామ్నియా పౌరులు కూడ యూదులను వధింపనున్నారని వార్తలు వచ్చెను.

9. కనుక యూదా యామ్నియాను కూడ ముట్ట డించెను. దాని రేవునకు నిప్పింంచి అచి ఓడలను తగులబెట్టెను. ఆ మంటలచికి ముప్పది క్రోసుల దూరముననున్న యెరూషలేమువరకును కనిపించెను.

గిలాదు మీదికి దాడి

10. యూదా అతని అనుచరులు యామ్నియాను వదలి తిమొతి మీదికి పోవు ఉద్దేశ్యముతో ఒక మైలు కెక్కువ దూరము నడచిరో లేదో అరబ్బులు వచ్చి వారిమీదపడిరి. శత్రువులు ఐదువేల మంది  కాలిబంటు లతోను, ఐదువందలమంది రౌతులతోను వచ్చిరి.

11. పోరు ముమ్మరముగా జరిగెను. కడన దైవబలము వలన యూదా నెగ్గెను. ఓడిపోయిన ఆ ఎడారి జాతివారు యూదులకు స్నేహితులుగానుండగోరిరి. వారు యూదు లకు సహాయముచేయుటకును, తమ మందలను వారికిచ్చుటకును అంగీకరించిరి.

12. యూదా ఆ అరబ్బులవలన చాల లాభములు కలుగునని యెంచి వారితో సంధిచేసికొనెను. అటుపిమ్మట వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి.

13. యూదా ప్రాకారములతో సురక్షితమైయున్న కాస్పిను పట్టణమునుగూడ ముట్టడించెను. ఆ నగర వాసులు పలుజాతులకు చెందినవారు.

14. వారు తమ ప్రాకారములను, తాము సేకరించి యుంచు కొనిన భోజనపదార్థములను చూచుకొని ధీమాతో యూదాను అతని అనుచరులను గేలిచేసిరి. పైగా వారిని, వారి దేవునికూడ నిందించి దుర్భాషలాడిరి.

15. కాని యూదులు లోకనాయకుడైన ప్రభువునకు వినతిచేసిరి. గోడలను పడగొట్టు మంచెలు, పట్టణము లను ముట్టడించుటకు వాడు ఆయుధములు లేకయే పూర్వము యెహోషువ కాలమున ప్రభువు యెరికో గోడలను కూల్చివేసెనుగదా! అట్లు వినతిచేసి యూదులు వీరావేశముతో పోయి కాస్పిను ప్రాకారములమీద పడిరి.

16. దైవచిత్తము ప్రకారము ఆ నగరమును స్వాధీనము చేసికొని అందలి పౌరులు అనేకులను చంపిరి. ఆ పట్టణము ప్రక్కనున్న కొలను క్రోసులో నాలుగవవంతు వెడల్పుకలది. ఆ కొలనంతయు చచ్చిన వారి నెత్తుితో నిండెను.

కర్నాయీము యుద్ధము

17. యూదా అతని అనుచరులు కాస్పినునుండి తొంబది ఐదు క్రోసులు నడచి తూబియను పట్టణము సమీపముననున్న యూదుల నగరమగు కారాక్సును చేరిరి.

18. కాని అచట వారికి తిమొతి కనిపింపలేదు. అతడంతకు పూర్వమే ఆ మండలమునుండి వెడలి పోయెను. కాని అతడొక తావున బలమైన సైనిక బృందమును కాపుప్టిె వెళ్ళెను. అంతకు మించి తిమొతి అచట సాధించినదేమియులేదు.

19. యూదా సైన్యాధిపతులు డొసీతియసు, సోసిపాతెరులు అనువారు పోయి తిమొతి కాపుప్టిెన దండుమీద పడిరి. అచట నున్న  పదివేలమంది సైనికులు మడిసిరి.

20. యూదా తన సైన్యమును కొన్ని పాలములుగా విభజించి డొసీతియసును, సోసిపాతెరును రెండు పాలములకు అధిపతులనుగా చేసెను. తాను తిమొతిని ఎదుర్కొను టకు శీఘ్రముగా  వెడలిపోయెను. తిమొతికి లక్ష ఇరువదివేలమంది కాలిబంటులును, రెండువేల  ఐదువందలమంది రౌతులును కలరు.

21. యూదా తన మీదికి దండెత్తి వచ్చుచున్నాడని విని తిమొతి ముందుగనే స్త్రీలను, పిల్లలను,  సామానులతో కర్నాయీము నగరమునకు పంపివేసెను. ఆ నగర మునకు పోవుమార్గములు ఇరుకైనవి. కనుక దానిని ముట్టడించుట, అసలు చేరుకొనుటగూడ కష్టమైన కార్యము.

22. కాని శత్రువులు యూదా అధీనమున నున్న మొది పాలమును చూడగనే కలవరపడిరి. సర్వసాక్షియైన దేవుడు విరోధులకొక దర్శనము చూపగా వారు భయభ్రాంతులై చిందరవందరగా పరుగెత్తిరి. ఆ కలవరపాటులో శత్రువులు చాలమంది స్వపక్షము వారి కత్తులవలననే గాయపడిరి.

23. యూదా, అతని అనుచరులు ఆ నీచులను బలము కొలది వెన్నాడి వారిలో ముప్పది వేలమందిని  మట్టు ప్టిెరి. 24. తిమొతి, డొసీతియసు సోసిపాతెరు దండుల చేతికిచిక్కెను. కాని అతడు మోసగాడు. అతడు తనను పట్టుకొన్న  వారితో ”మీ బంధువులు చాలమంది బందీలై నా అధీనముననున్నారు. ఇప్పుడు మీరు నన్ను చంపు దురేని వారు ప్రాణములు కోల్పోవుట తథ్యము. కనుక మీరు నా ప్రాణములు కాపాడవలెను” అని చెప్పెను. 25. తిమొతి యూదా సైనికుల బంధువు లను సురక్షితముగా వారిండ్లకు పంపివేయుదునని మాటయీయగా ఎట్టకేలకు వారతనిని ప్రాణములతో పోనిచ్చిరి.

26. తరువాత యూదా కర్నాయీము నగరమును దాని లోని ఆటెర్గాిసు అను దేవళమును ముట్టడించి, ఇరువది ఐదువేలమందిని చంపెను.

ఎఫ్రోను, సితోపోలిసుల మీదుగా తిరిగివచ్చుట

27. అటుతరువాత యూదా ఎఫ్రోను దుర్గము మీదికి పోయెను. అపుడు లీసియాసు అన్ని జాతుల ప్రజల సమూహంతో  అచట వసించుచుండెను. శత్రు పక్షము నుండి శూరులైన యువకులు దుర్గప్రాకార ముల ముందు నిలిచి వీరావేశముతో పోరాడిరి. వారు దుర్గములోపల యుద్ధయంత్రములు, ఆయుధములు  చేకూర్చుకొనియుండిరి. 

28.  యూదులు శత్రువుల పీచమణచు మహాప్రభువునకు ప్రార్థనచేసి ఆ నగర మును స్వాధీనము చేసికొని ఇరువదిఐదు వేలమందిని సంహరించిరి.

29. అచినుండి వారు యెరూషలేము నకు డెబ్బదిఐదు క్రోసులు దూరముననున్న సితోపోలిసు నకు వెళ్ళిరి.

30. కాని అచట వసించు యూదులు ఆ నగరవాసులు తమ్ము దయతో చూచుచున్నారనియు, విశేషముగా కష్టకాలమున తమ్ము ఆదుకొనుచున్నా రనియు విన్నవించిరి.

31. కనుక యూదా, అతని అనుచరులు ఆ నగరవాసులకు ధన్యవాదములు అర్పించిరి. భవిష్యత్తులోకూడ యూదులయెడల ఆద రము చూపుడని వారిని వేడుకొనిరి. వారు వారముల పండుగకు కొంచెము ముందుగ యెరూషలేము చేరుకొనిరి.

గోర్గియాసు మీదికి దాడి

32. పెంతెకోస్తు పండుగ ముగియగానే యూదా అతని అనుచరులు ఇదూమియాకు అధిపతిగానున్న గోర్గియాసు మీదికి త్వరితగతిని దాడిచేసిరి.

33. అతడు మూడువేలమంది పదాతులతోను నాలుగు వందలమంది రౌతులతో వచ్చి  వారినెదుర్కొనెను.

34.  యుద్ధమున కొందరు యూదులు ప్రాణములు కోల్పోయిరి.

35. టూబియను నగరవాసియు పరా క్రమముగల అశ్వికుడైన డొసీతియసు అనువాడు గోర్గియాసు అంగీని పట్టుకొని అతనిని బటబట ఈడ్వ జొచ్చెను. ఆ దుర్మార్గుని సజీవునిగా బంధింపవలెనని అతని తలంపు. కాని అంతలోనే త్రాసియా రౌతు ఒకడు డొసీతియసు మీదపడి అతని భుజమును నరికెను. గోర్గియాసు మరీసాకు పారిపోయెను.

36. ఎస్డ్రియాసు నాయకత్వమున పోరాడువారు అప్పికే చాల సేపి నుండి యుద్ధము చేయుచుండిరి కనుక బాగుగా అలసి యుండిరి. కనుక యూదా, ప్రభువు యుద్ధమున తమ పక్షమున పోరాడవలయుననియు అతడు తమ సైన్య మునకు నాయకుడు కావలెనని ప్రార్థించెను.

37. అంతటతడు మాతృభాషలో ఒక పాటను యుద్ధనాద ముగా పాడెను. అతని అనుచరులు అకస్మాత్తుగ గోర్గియాసు  దండు మీదపడి దానిని తరిమిక్టొిరి.

మృత వీరుల కొరకు బలి

38. అటుపిమ్మట   యూదా తన సైన్యముతో అదుల్లాము నగరమునకు పోయెను. అది విశ్రాంతి దినమునకు ముంది రోజు. కనుక వారు ఆచారము ప్రకారము శుద్ధిచేసికొని విశ్రాంతిదినమును పాించిరి.

39. ఆ మరుసిరోజు చనిపోయిన వారి శవములను ప్రోగుజేసి పితరుల సమాధులలో పాతిపెట్టవలసి వచ్చెను. 40. కాని పోరున చచ్చిన యూదులందరును యామ్నియా ప్రజలు ఆరాధించు దేవతల బొమ్మలను తమ దేహముల మీద బట్టల మాటున కట్టుకొని యుండిరి. ధర్మశాస్త్రము ప్రకారము ఈ బొమ్మలను తాల్చుట తప్పు. వారు యుద్ధమున ఎందుకు ప్రాణములు కోల్పోయిరో ఎల్లరికిని అప్పుడు అర్థమయ్యెను.

41. కనుక అందరును కలిసి మరుగున పడినవానిని విదితము చేయువాడును, న్యాయము తప్పని న్యాయ మూర్తియునైన ప్రభువు కార్యములను కొనియాడిరి.

42. వారు ఈ పాపమును పూర్తిగా క్షమింపవలెనని ప్రార్థన చేసిరి. అపుడు శూరుడైన యూదా ”మీరు ఈ  పాపఫలితమును కన్నులార చూచితిరి కనుక ఇక మీదట పాపమునుండి వైదొలగుడు” అని ఎల్లరిని హెచ్చరించెను.

43. అటు తరువాత అతడు తన సైనికులనుండి రెండువేల వెండినాణెములను ప్రోగు జేసి ఆ సొమ్మును పాపపరిహారబలిని అర్పించుటకు యెరూషలేమునకు పంపెను. అతడు మృతులు మరల ఉత్థానమగుదురని విశ్వసించెను. కనుక ఈ పుణ్య కార్యము  చేయించెను.

44. చనిపోయినవారు మరల ఉత్థానమగుదురని అతడు విశ్వసించి ఉండడేని, వారి కొరకు ప్రార్థనచేయుట నిరుపయోగమును, మౌఢ్యమును అయ్యెడిది గదా!

45. కాని భక్తితో మరణించిన వారు యోగ్యమైన బహుమతిని పొందుదురని యూదా నమ్మియుండెనేని, అతడు చేసిన కార్యము భక్తి మంత మైనదియు, పవిత్రమైనదియు అగును. కనుకనే అతడు చనిపోయిన వారికి పాపవిముక్తి కలుగునని యెంచి వారికొరకు పాపపరిహారబలి అర్పింపజేసెను.