5 1. సొలోమోను దేవాలయపు పనులన్నిని పరిపూర్తి చేయించెను. అటుపిమ్మట ప్రభువునకు తన తండ్రి దావీదు అంకితముచేసిన వెండిబంగారములను, ఇతర వస్తువులను కొనివచ్చి దేవాలయ కోశాగారమునకు సమర్పించెను.

మందసమును దేవాలయమునకు కొనివచ్చుట

2. అంతట సొలోమోను రాజు యిస్రాయేలు పెద్దలను, తెగనాయకులను యెరూషలేమున సమా వేశపరచెను. ప్రభువు మందసమును సియోను నందు గల దావీదు నగరమునుండి దేవాలయమునకు తర లింపవలెనని చెప్పెను.

3. కనుక యిస్రాయేలీయు లెల్లరు ఏడవనెలలో వచ్చు ఉత్సవము సందర్భమున అక్కడ సమావేశమైరి.

4-5. అవ్విధమున నాయకు లెల్లరు ప్రోగైనపిదప లేవీయులు మందసమును ఎత్తు కొనిరి. సొలోమోను, యిస్రాయేలు ప్రజలెల్లరు మందసము ముందట సమావేశమై లెక్కలేనన్ని పొట్టేళ్ళను, కోడెలను  బలిగా  సమర్పించిరి.

6. యాజకు లును, లేవీయులును కలిసి ప్రభువు గుడారమును, దాని సామాగ్రితోపాటు దేవాలయమునకు కొని వచ్చిరి.

7. అటుతరువాత యాజకులు మందసమును దేవాలయములోనికి కొనివచ్చి గర్భగృహమున కెరూబు దూతల ప్రతిమల నడుమ ఉంచిరి.

8. వాని రెక్కలు మందసమును, దానిని మోయు దండెలను కప్పి వేసెను.

9. గర్భగృహము ఎదుట పవిత్రస్థలములో నిలుచుండి చూచినచో ఈ దండెల కొనలు కన్పించె డివి. కాని బయటనుండి చూచువారికి అవి కన్పించె డివికావు. ఆ దండెలు నేికిని అచటనేయున్నవి.

10. మోషే హోరెబు కొండచెంత ఆ మందసములో ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేవు. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చిన తరువాత ప్రభువు ఈ కొండచెంతనే వారితో నిబంధనము చేసికొనెను.

దేవాలయమున ప్రభువు తేజస్సు

11-14. యాజకులెల్లరును, వారు ఏ వర్గము నకు చెందినవారైనను, తమను తాము శుద్ధిచేసికొనిరి. గాయకులైన లేవీయులు, అనగా ఆసాపు, హేమాను, యెదూతూను మరియు వారి వంశీయులవారు, నార బట్టలు తాల్చి, బలిపీఠమునకు దగ్గరగా, తూర్పు వైపున నిలుచుండి స్వరమండలము, తంబుర, చి తాళములు వాయించుచుండిరి. నూటఇరువదిమంది యాజకులు వారికెదురుగా నిలుచుండి బూరలనూదు చుండిరి. బూరలనూదువారు, స్వరమండలము మొద లగు వాద్యములను వాయించువారు, గాయకు లందరు ఏకమై

”ప్రభువును స్తుతింపుడు, అతడు మంచివాడు,

అతని ప్రేమ శాశ్వతమైనది”

అని ఎలుగెత్తి గానముచేసిరి. యాజకులు పవిత్ర స్థలమునుండి వెలుపలికి వచ్చుచుండగా ప్రభువు తేజస్సుతో ప్రకాశించు మేఘము దేవుని మందిర మును నింపెను. ఆ వెలుగు వలన యాజకులు ఆ మేఘమున్నచోట నిలిచి పరిచర్య చేయజాలరైరి.