హోలోఫెర్నెసు దండయాత్ర

నెబుకద్నెసరు అర్ఫక్షదు రాజులకు యుద్ధము

1 1. నెబుకద్నెసరు రాజు నీనెవె పట్టణమును రాజ ధానిగా చేసికొని అస్సిరియా రాజ్యమును పరిపాలించు చున్న సమయములో అర్ఫక్షదు రాజు ఎక్బానా నగరమును రాజధాని గావించుకొని మాదియా దేశమును ఏలుచుండెను.

2. ఇతడు ఎక్బానా చుట్టును చెక్కిన రాళ్ళతో ప్రాకారమును క్టించెను. ఒక్కొక్క రాయి నాలుగున్నర అడుగుల మందము, తొమ్మిదిఅడుగుల పొడవు కలిగియుండెను. ప్రాకా రము ఎత్తు 105 అడుగులు. వెడల్పు 75 అడుగులు.

3.అతడు ప్రాకారద్వారములవద్ద బురుజులు నిర్మించెను. ఒక్కొక్క బురుజు ఎత్తు 150 అడుగులు. ఒక్కొక్కదాని పునాది వెడల్పు 90 అడుగులు.

4. ఒక్కొక్క ద్వారము ఎత్తు 105 అడుగులు, వెడల్పు 60 అడుగులు. ఆ ద్వారములగుండ అతని సైన్యమంత ఒక్కసారిగా దాి పోగలదు. అతని కాల్బలము కూడ బారులుతీరి సాగి పోగలదు.

5. నెబుకద్నెసరు రాజు తన పరిపాలనా కాలము పండ్రెండవయేటఅర్ఫక్షదుతోయుద్ధము ప్రారంభించెను. రాగీసు నగరము ప్రక్కనున్న పెద్దమైదానమున పోరు జరిగెను.

6. ఆ యుద్ధమున చాలజాతులు అర్ఫక్షదును బలపరచిరి. కొండభూములలో వసించువారు, తిగ్రిసు, యూఫ్రీసు, హిడాస్పిసు నదీతీరములందు వసించు వారు, ఏలాము రాజగు అర్యోకు పరిపాలనక్రింద మైదానములలో వసించువారు అర్ఫక్షదుతో చేరిరి. ఆ రీతిగా ఆ యుద్ధమున చాలజాతులు కల్దీయుల రాజుతో చేతులు కలిపిరి.

7-8. అస్సిరియా రాజు నెబుకద్నెసరు పర్షియా దేశమునకు, పశ్చిమమున నున్న సిలీషియాకును, దమస్కుకును, లెబానోనుకును, ముంది లెబానోను దేశములకును, సముద్రతీర దేశములకును, కర్మెలు పట్టణమునకును, గిలాదు, ఉత్తరపు గలిలీదేశము లకును,ఎస్డ్రలోను మైదానమునకును దూతలను పంపెను.

9-10. మరియు అతడు సమరియా దేశమునకును, దాని పరిసరనగరములకును, యోర్దాను నదికి పశ్చిమ మున నున్న సుదూర నగరములగు యెరూషలేము, బెతని, కేలోసు, కాదేషులకును, ఐగుప్తు నదీ సరిహద్దు లకును, ఐగుప్తు నగరములగు గోషెను ప్రాంతాలైన తహపనేసు, రామెసేసు, తనీసు, మెంఫీసులకును, ఇతియోపియా సరిహద్దుల వరకును వ్యాపించియున్న ఐగుప్తు మండలములకును దూతలనుపంపెను.

11. కాని ఈ ప్రజలెల్లరు నెబుకద్నెసరు ఆజ్ఞను త్రోసిపుచ్చి అతని పక్షమున పోరాడుటకు నిరాకరించిరి. వారు ఆ రాజు ఒంటరివాడయ్యెనని తలంచి అతనిని లక్ష్య ముచేయరైరి. అతడు పంపిన దూతలు తమ పనిని సాధింపజాలక అవమానములకు గురియై తిరిగి వచ్చిరి.

12. కనుక నెబుకద్నెసరు ఈ రాజ్యముల మీద ఆగ్ర హము చెందెను. అతడు ఈ దేశములమీద పగ తీర్చు కొందునని తన రాజ్యము పేరుమీద, తన సింహాస నము పేరుమీద శపథము చేసెను. సిలీషియా, దమస్కు, సిరియా, మోవాబు, అమ్మోను, యూదా, ఐగుప్తు, రెండు సముద్రముల తీరము వరకు వ్యాపించియున్న దేశము లన్నిని కత్తితో హతము చేయుదునని ప్రతిజ్ఞ చేసెను.

13. నెబుకద్నెసరు తన పరిపాలనా కాలము పదునేడవయేట సైన్యముతో పోయి అర్ఫక్షదును ఎది రించెను. అతడు శత్రువు రథబలమును, అశ్వబల మును, సైన్యమునంతిని చెల్లాచెదరుచేసెను.

14. అతని నగరములను ఆక్రమించుకొనెను. ఎక్బానా నగరమును కూడ  ముట్టడించి  దాని బురుజులను వశము చేసికొనెను. నగరములోని అంగళ్ళను కొల్ల గొట్టెను. వైభవోపేతముగానున్న ఆ పట్టణమును పాడు చేసెను.

15. అటుతరువాత అర్ఫక్షదునుకూడ రాగీసు కొండలలో పట్టుకొని ఈటెలతో పొడిచి చంపెను.

16. తదనంతరము కొల్లసొమ్ము ప్రోగుజేసికొని స్వీయసైన్య ముతోను, తనతో చేరిన ఇతర సైన్యములతోను నీనె వెకు తిరిగివచ్చెను. అచట నాలుగునెలలపాటు రాజును, సైనికులును సంతసముతో, విశ్రాంతితో విందులు చేసికొనిరి.