యెషయా గ్రంథము ప్రథమభాగము

1. సిరియా – యిస్రాయేలు యుద్ధమునకు

ముంది ప్రవచనములు

గ్రంథనామము

1 1. యూదా, యెరూషలేములను గూర్చి ఆమోసు కుమారుడైన యెషయా చూచిన దర్శనములివి: యూదానేలిన ఉజ్జీయా, యోతాము, ఆహాసు, హిజ్కియా రాజుల కాలములలో అతడు ఈ దృశ్యము లను గాంచెను.

ఆలోచనలేని ప్రజలు

2.           ప్రభువిట్లు పలికెను:

               ”భూమ్యాకాశములారా వినుడు!

               నేను పెంచి పెద్దజేసిన బిడ్డలే నామీద తిరుగబడిరి.

3.           ఎద్దుకు తన యజమానుడు ఎవరో తెలియును. గాడిదకు తన యజమానుడు

               తనకెక్కడ గడ్డివేయునో తెలియును.

               కానీ యిస్రాయేలునకు ఏమియు తెలియదు.

               నా ప్రజలేమియు అర్థము చేసికొనరు.”

యూదాకు శిక్ష

4.           పాపజాతి ప్రజలారా! మీకు అనర్థము వాిల్లును.

               మీరు దుష్టులు, దుష్కార్యములకు పాల్పడువారు,

               పూర్తిగా చెడిపోయినవారు,

               మీరు ప్రభువును విడనాడితిరి.

               యిస్రాయేలు పరిశుద్ధదేవుని నిర్లక్ష్యము చేసితిరి. అతని నుండి వైదొలగితిరి.

5.           నేను మిమ్ము మరల కొట్టవలెనా?

               మీరు నిరంతరము నాపై తిరుగుబాటు చేయనేల?

               యిస్రాయేలూ! నీ తల ఇప్పికే గాయములతో నిండియున్నది. నీ గుండె బలహీనమైయున్నది.

6.           అరికాలినుండి నడినెత్తివరకు నీ దేహమున

               ఆరోగ్యకరమైన భాగమే లేదు.

               నీ తలనుండి కాలువరకు దెబ్బలు,

               గాయములు, పుండ్లతో నిండియున్నవి.

               నీ పుండ్లకు చికిత్సచేయలేదు,

               కట్టుకట్టలేదు, తైలముపూయలేదు.

7.            నీ దేశము నాశనమైనది,

               నీ నగరములు కాలిపోయినవి.

               నీవు చూచుచుండగనే అన్యజాతి వారు

               నీ పొలములు ఆక్రమించుకొనిరి,

               అన్యులచే నాశనము చేయబడిన దానివలె,

               అది పాడైపోయెను.

8.           సియోను కుమార్తె శత్రువుల ముట్టడికి గురియైన ద్రాక్షతోటలోని గుడిసెవలెను, దోసతోటలోని పాకవలెను ఏకాకిగా వదిలివేయబడినది.

9.           సైన్యములకధిపతియైన ప్రభువు మనలో

               శేషజనమును కొద్దిమందిని

               మిగిల్చియుండనియెడల,

               మనము సొదొమవలె అయ్యెడివారము,

               గొమొఱ్ఱావలె ఉండెడివారము.

చిత్తశుద్ధిలేని మతాచరణములు

10.         సొదొమ పాలకులారా!

               ప్రభువు పలుకులు ఆలింపుడు.

               గొమొఱ్ఱా పౌరులారా!

               మన దేవుని ఉపదేశములు వినుడు.

11.           ప్రభువు ఇట్లనుచున్నాడు:              

               ”మీ బహుళ బలులవలన నాకు ఒరిగినదేమి?

               మీరు పొట్టేళ్ళను దహనబలిగా అర్పించుటవలన,

               పోతరించిన పశువుల క్రొవ్వును వ్రేల్చుటవలన

               నాకు విసుగెత్తుచున్నది.

               ఎడ్లు, గొఱ్ఱెలు, మేకల నెత్తురు

               నాకు ప్రీతికలిగింపదు.

12.          మీరు నా సన్నిధికి వచ్చినపుడు,

               వీనినన్నిని కొనిరమ్మన్నదెవరు?

               మిమ్ము నా ఆవరణములో కాలుపెట్టమన్నదెవరు?

13. అయోగ్యమైన మీ బలులు నాకిక అక్కరలేదు.

               మీరు వేయు సాంబ్రాణిపొగ

               నాకు అసహ్యముగానున్నది.

               మీ అమావాస్య పండుగలు, విశ్రాంతిదినములు,

               ఉత్సవ దినసమావేశములు నేను భరింపలేను.

               అవన్నియు మీ పాపములవలన కలుషితములైనవి.

14.          మీ అమావాస్య పండుగలు,

               మీ ఉత్సవములు  నేనసహ్యించుకొనుచున్నాను.

               వానినిక సహింపజాలను.

               అవి నాకు బాధాకరములు.

15.          మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినపుడు

               నేను మీ వైపుచూడను.

               మీరెన్ని మనవులుచేసినను నేను ఆలింపను.

               మీ చేతులు నెత్తురుతో నిండియున్నవి.

16.          మిమ్ము మీరు కడుగుకొని శుద్ధిచేసికొనుడు.

               మీరు  నా ఎదుట దుష్కార్యములు చేయకుడు,

               చెడును విడనాడుడు.

17.          మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు.

               పీడితులను ఆదుకొనుడు,

               అనాథ శిశువులకు న్యాయముచేయుడు.

               వితంతువుల కోపు తీసికొనుడు.

18.          ప్రభువు ఇట్లనుచున్నాడు :

               రండి, మన వివాదమును పరిష్కరించుకొందము.

               మీ పాపములు సింధూరమువలె ఎఱ్ఱగానున్నను,

               మంచువలె తెల్లనగును,

               కెంపువలె ఎఱ్ఱగానున్నను, ఉన్నివలె తెల్లనగును.

19.          మీరు నాకు విధేయులగుదురేని, భూమినుండి

               పండు మేలిపదార్థములు భుజింతురు.

20.        కాని నన్ను తిరస్కరించి, నా మీద తిరుగబడుదురేని,

               మీరు కత్తివాతబడుదురు.

               ప్రభుడనైన నా పలుకిది.”

యెరూషలేము మీద శోకగీతము

21.          అయ్యో! పూర్వము విశ్వసనీయముగా మెలిగిన

               నగరమిప్పుడు వేశ్య అయినదే!

               ఒకప్పుడు ఇచట నీతిన్యాయములు

               నెలకొనియుండెను.

               కాని ఇప్పుడిది నరహంతలకు ఆలవాలమయ్యెను.

22.        నీ వెండి చిట్టెముగా మారెను.

               నీ ద్రాక్షారసము నీళ్ళతో కలిసి పలుచనయ్యెను.

23.        నీ అధికారులు నా మీద తిరుగబడుచున్నారు.

               దొంగలతో చేతులు కలుపుచున్నారు.

               బహుమతులు ఆశించుచున్నారు,

               లంచాలు కోరుచున్నారు.

               వారు అనాథలకు న్యాయము జరిగించుటలేదు,

               వితంతువుల వ్యాజ్యెములను పరిష్కరించుటలేదు.

24.         కనుక సైన్యములకధిపతియైన ప్రభువు,

               బలసంపన్నుడైన యిస్రాయేలు దేవుడు

               ఇట్లనుచున్నాడు:

               ”నేను నా శత్రువులను జయింతును.

               నా విరోధులమీద పగతీర్చుకొందును.

25.        నా హస్తమును నీపై చాచెదను.

               కొలిమిలో నిన్ను శుద్ధిచేసి

               నీ చిట్టెమును తొలగింతును.

               నీలోని మాలిన్యమును నిర్మూలింతును.

26.        పూర్వము మీకుండిన న్యాయాధిపతులవింవారిని,

               తొలుత మీకుండిన సలహాదారులవిం వారిని

               మీకు మరల దయచేయుదును.

               అప్పుడు నీతిగల పట్టణమనియు,

               విశ్వాసపాత్రమైన నగరమనియు

               నీవు పిలువబడుదువు.

27.         సియోను న్యాయము చేతను, పశ్చాత్తాపపడు

               దాని నివాసులు నీతిచేతను రక్షింపబడుదురు.

28.        కాని అతిక్రమమును చేయువారును,

               పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు.

               ప్రభువును విడనాడువారు హతులగుదురు.

వృక్షారాధన ఖండన

29.        మీరు సింధూరములకు మోజుపడినందులకు 

               సిగ్గుపడుదురు.

               పవిత్ర వనముల పట్ల మక్కువ చూపినందులకు

               చింతించుదురు.

30.        మీరు ఆకులు వాడిపోయిన సింధూరమువలెను,

               నీరుదొరకని తోటవలెను ఎండిపోయెదరు.

31.          బలాఢ్యులు నారపీచువలె అగుదురు.

               వారి దుష్కార్యములు నిప్పురవ్వలగును

               ఆర్పువాడు ఎవ్వడును లేక

               వారును, వారి చెయిదములన్నియు కాలిపోవును”