దేవాలయ నిర్మాణము మరల ప్రారంభమగుట (క్రీ.పూ. 520-515)

5 1. ప్రవక్తలయిన హగ్గయియు, ఇద్దో కుమారుడైౖన జెకర్యాయు యూదా, యెరూషలేము మండలములలో నున్న యూదులకు యిస్రాయేలు దేవుడైన ప్రభువు ప్రవచనము వినిపింపనారంభించిరి.

2. షల్తీయేలు కుమారుడగు సెరుబ్బాబెలు, యోసాదాకు కుమారుడైన యేషూవ వారి సందేశములు విని దేవాలయ పునర్ని ర్మాణమును ప్రారంభించిరి. ప్రవక్తలిద్దరు వారికి బాసటగా నుండిరి.

3. వెంటనే పశ్చిమ యూఫ్రీసు మండలమునకు అధికారియైన తత్తనాయి, షెతర్బో స్నాయి మరియు వారి తోడి ఉద్యోగులు యెరూషలేము నకు వచ్చి ”మీరు ఈ దేవాలయమును కట్టుటకును, ఈ వడ్రంగము పనిచేయించుటకును ఎవరు అనుమతి నిచ్చిరి?” అని ప్రశ్నించిరి.

4. ఆ అధిపతులు దేవాలయ నిర్మాణమునకు పెత్తనదారులైన వారి పేర్లు కూడ అడిగి తెలిసికొనిరి.

5. కాని ప్రభువు యూదా నాయ కులకు బాసటయైయుండెను. కనుక అధికారులు మందిర నిర్మాణమును ఆపు చేయింపలేదు. వారు దర్యావేషునకు జాబు వ్రాసి ఆ ప్రభువు సమాధానము కొరకు వేచియుందమనుకొనిరి.

6. పశ్చిమ యూఫ్రీసు రాష్ట్రపాలకుడు తత్త నాయి, షెతర్బోస్నాయి, వారి తోడి అధికారులు రాజునకు పంపిన లేఖ యిది:

7. ”దర్యావేషు ప్రభువునకు శాంతిభద్రతలు సిద్ధించుగాక!

8. రాజు గారికి తెలియజేయుట ఏమ నగా మేము యూదామండలమునకు వెళ్ళి చూడగా అచి ప్రజలు గండశిలలతోను, గోడలలోనికి చొన్పిన దూలములతోను వారి మహాదేవునకు మందిరము కట్టుచున్నారు. వారు నైపుణ్యముతో పనిచేయుచు న్నారు. ఆ పని కూడ చకచక సాగిపోవుచున్నది. కనుక మేము ఈ సంగతిని ప్రభువుల వారికి తెలియజేయు చున్నాము.

9. దేవాలయమును కట్టుటకు, ప్రాకార ములను నిల్పుటకు, పనిచేయించుటకు మీకెవరు అనుమతిచ్చిరని మేము వారి నాయకులను ప్రశ్నించి తిమి.

10. దేవరవారికి తెలుపవలయునన్న తలంపుతో మేము వారి నాయకుల పేర్లు కూడ అడిగి తెలిసి కొింమి.

11. మా ప్రశ్నకు వారు చెప్పిన జవాబిది: ‘మేము భూమ్యాకాశములకు అధిపతియైన ప్రభువును సేవించు భక్తులము. ఈ దేవాలయమును పెక్కేండ్ల క్రితమే ఒక సుప్రసిద్ధుడైన రాజు నిర్మించిపోయెను. దానినే ఇప్పుడు మేము పునర్నిర్మాణము చేయుచు న్నాము.

12. మా పూర్వులు పరలోకమందలి దేవునికి కోపము రప్పించుటవలన అతడు కల్దీయ రాజవంశీ యుడు బబులోనియా రాజు నెబుకద్నెసరునకు వారు లొంగిపోవునట్లు చేసెను. ఆ రాజు వారి దేవళమును పడగ్టొి వారిని బబులోనియాకు చెరగొనిపోయెను.

13. అటు తరువాత కోరెషు ప్రభువు బబులోనియాకు చక్రవర్తియైనమొదియేట ఈ దేవాలయమును పునర్ని ర్మింపవలెనని ఆజ్ఞయిచ్చెను.

14. పూర్వము నెబుకద్నెసరు యెరూషలేము దేవాలయమునుండి కొనిపోయి          బబులోనియా దేవళమున కానుకగా సమర్పించిన వెండి, బంగారు పాత్రలను గూడ కోరెషురాజు తిరిగి ఇచ్చి వేసెను. యూదాకు మండలపాలకుడుగా నియమింప బడిన షేస్బస్సరునకు అతడు పాత్రముల నొప్పగించెను.

15. అతడు ఈ విధముగా ఆజ్ఞాపించెను: ఈ పాత్ర లను తీసికొనిపోయి యెరూషలేము దేవాలయము నందు ఉంచవలెను మరియు దేవాలయము మరల యథాస్థానముననే నిర్మించవలెను.

16. ఆ రీతిగా షేస్బస్సరు యెరూషలేమునకొచ్చి దేవాలయమునకు పునాదులెత్తెను. అప్పినుండి ఇప్పివరకును నిర్మా ణము కొనసాగుచునేయున్నది. కాని యింతవరకు పూర్తి కాలేదు’.

17. ప్రభువుల వారికి సమ్మతియగునేని బబులోనియాయందలి చారిత్రకాంశముల దస్తా వేజులను పరిశీలించి కోరెషురాజు ఈ దేవాలయ మును పునర్నిర్మించుటకు ఆజ్ఞ ఇచ్చెనో లేదో తెలిసి కొనుడు. అటుపిమ్మట దేవరవారి నిర్ణయమును మాకు తెలియజేయుడు.”

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము