సొలోమోను పతనము

సొలోమోను భార్యలు

11 1. సొలోమోను అన్యదేశ స్త్రీలను వలచెను. అతడు ఐగుప్తు రాజు ఫరో కుమార్తెను మాత్రమే గాక హిత్తీయ, మోవాబు, అమ్మోను, ఎదోము, సీదోను స్త్రీలనుగూడ వివాహమాడెను.

2. ప్రభువు అన్యజాతుల పిల్లలను యిస్రాయేలీయులుగాని, యిస్రాయేలీయుల పిల్లలను అన్యజాతుల వారుగాని పరిణయమాడరాద నియు, అి్ట వివాహములు జరిగినచో యిస్రాయేలీ యులు అన్యజాతులు పూజించు దైవములను ఆరా ధింతురనియు చెప్పెను. అయినను సొలోమోను అన్య జాతి స్త్రీలను పరిణయమాడి వారియెడల గాఢాను రాగము చూపెను.

3. అతడు ఏడువందలమంది రాజ పుత్రికలను వివాహమాడెను. పైగా అతనికి మూడు వందలమంది ఉపపత్నులుకూడ గలరు. వీరందరు అతనికి ప్రభువు మీద భక్తి సన్నగిల్లి పోవునట్లు చేసిరి.

4. సొలోమోను వృద్ధుడు అగునప్పికి భార్యలు అతడు అన్యజాతుల వారి దైవములను ఆరాధించునట్లు చేసిరి. అతడు తన తండ్రి దావీదువలె పూర్ణహృదయముతో యావేయెడల ఉండలేకపోయెను.

5. ఆ రాజు సీదోనీ యులు కొలుచు అష్టారోతు దేవతను, అమ్మోనీయులు కొలుచు పాడుదైవము మిల్కోమును పూజించెను.

6. అతడు ప్రభువునకు ద్రోహముచేసెను. తన తండ్రి దావీదువలె ప్రభువును పూర్ణహృదయముతో ఆరా ధింపడయ్యెను.

7. మోవాబీయులు కొలుచు హేయ మైన దైవము కెమోషును ఆరాధించుటకై యెరూష లేమునకు తూర్పువైపుననున్న కొండపై ఒక ఉన్నత స్థలమును నిర్మించెను. ఆ రీతిగనే అమ్మోనీయులు కొలుచు హేయమైన మోలెకునకును నిర్మించెను.

8. అతడు తాను పెండ్లియాడిన అన్యజాతి స్త్రీలు బలులు అర్పించుకొనుటకు సాంబ్రాణిపొగ వేయుటకు అతడు ఈ విధముగా చేసెను.

9. రెండుసార్లు ప్రత్యక్షమైన యావేను, యిస్రా యేలు ప్రభువును సొలోమోను విడనాడెను. కనుక యావే అతనిపై కోపించెను.

10. అన్యదైవముల నారాధింప నిషేధించినను యావేమాట వినలేదు.

11. యావే అతనితో ”నీవు నా నిబంధనమును మీరి నాఆజ్ఞలను జవదాితివి గనుక నేను ఈ రాజ్యమును నీ అధీనమునుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చి వేసెదను.

12. అయినను నీ తండ్రి దావీదు పైగల అభిమానముచే నీ కాలమున కాదుగాని నీ కుమారుని పరిపాలనకాలమున ఈ కార్యమును జరిగింతును.

13. కాని ఈ రాజ్యమంతిని నీ కుమారుని అధీనము నుండి తొలగింపను. నా సేవకుడగు దావీదునుచూచి, నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమునుచూచి ఒక్క తెగను మాత్రము నీ కుమారునివశమున ఉంచె దను” అని చెప్పెను.

అన్యజాతి శత్రువులు సొలోమోనును బాధించుట

14. ప్రభువు ఎదోము రాజవంశమునకుచెందిన హదదును పురికొల్పగా అతడు సొలోమోనునకు శత్రువయ్యెను.

15-16. అంతకుపూర్వమే దావీదు ఎదోమును జయించెను. అతని సైన్యాధిపతియగు యోవాబు మృతవీరులను పూడ్చిపెట్టుటకై అచికి వెళ్ళెను. యోవాబు అతని అనుచరులు ఎదోమున ఆరుమాసములు ఉండిరి. ఆ కాలమున వారు ఎదోము నందలి మగవారినందరిని చంపివేసిరి.

17. కాని హదదు, అతని తండ్రికి కొలువుచేయు ఎదోము సేవకులు మాత్రము తప్పించుకొని ఐగుప్తునకు పారి పోయిరి. అప్పికి హదదు పసివాడు.

18. అతడు అతని అనుచరులు మిద్యానునుండి బయలుదేరి పారాను ఎడారి చేరిరి. అక్కడ మరికొందరు వారితో చేరగా అందరుకూడి ఐగుప్తుచేరుకొనిరి. హదదు ఫరోను కలసికొనగా ఆ రాజు అతనికి ఇల్లువాకిలి, పొలముపుట్ర ఇప్పించి భోజనవసతి కల్పించెను.

19. హదదు రాజునకు ఇష్టుడయ్యెను. ఫరో తన రాణి తహ్పెనేసు చెల్లెలినే అతనికిచ్చి పెండ్లిచేసెను.

20. హదదుకు ఆమెవలన గెనుబతు అను కుమారుడు కలిగెను. రాణి ఆ శిశువును ఫరో ప్రాసాదముననే పెంచెను. బాలకుడు రాజకుమారులతో పెరిగెను.

21. దావీదు, అతని సైన్యాధిపతియైన యోవాబు మరణించిరని వినిన హదదు, ఫరో వద్దకువెళ్ళి ”నన్ను నా దేశమునకు వెళ్ళిపోనిమ్ము” అని అడిగెను.

22. రాజతనితో ఇచట నావలన నీకేమైన కొరతకలిగినదా? ఇపుడు నీవు మీ దేశమునకు తిరిగిపోనేల?” అని అనెను. అతడు రాజుతో ”ఇక్కడ నాకు ఏ లోటును లేదు. అయినను నన్ను వెళ్ళిపోనిమ్ము” అనెను.  తరువాత హదదు ఎదోమునకు రాజయ్యెను. అతడు యిస్రాయేలీయులను మిగుల ఈసడించుకొనెను గనుక వారికి కీడు తెచ్చిపెట్టెను.

23. ప్రభువు ఎల్యాదా కుమారుడు రెసోనును గూడ సొలోమోనునకు శత్రువును చేసెను. ఈ రెసోను తన యజమానుడు, సోబా రాజునగు హదదెసరునుండి పారిపోయి, 24. కొందరు తిరుగుబాటుదారులకు నాయకుడయ్యెను. దావీదు హదదెసెరును జయించి అతని మిత్రులైన అరామీయులను మట్టుప్టిెన తరువాత ఈ సంఘటనము జరిగెను. రెసోను అతని అనుచరులు దమస్కునకు పోయిరి. రెసోను సిరియా దేశమునకు రాజయ్యెను.

25.సొలోమోను జీవించి ఉన్నంతకాలము అతడు యిస్రాయేలీయులకు ప్రబల శత్రువుగా నుండెను.

యరోబాము తిరుగుబాటు

26.యరోబాము ఎఫ్రాయీము మండలములోని సెరెదా పట్టణవాసియైన నెబాతు కుమారుడు. అతని తల్లి పేరు సెరువా. ఆమె విధవ. అతడు సొలోమోను సేవకుడై కూడ అతనిమీద తిరుగబడెను.

27. ఆ తిరుగుబాటు వైనమిది:

సొలోమోను యెరూషలేమునకు తూర్పువైపున నున్న పల్లమును పూడ్పించి అనగా మిల్లోను నిర్మించి పట్టణప్రాకారమును పొడిగించుచుండెను.

28. అప్పికి యరోబాము సమర్థుడైన యువకుడు. అతడు సంతృప్తికరముగా పనిచేయుటచూచి సొలోమోను అతనిని మనష్షే ఎఫ్రాయీము మండలములలోని భారమైన పనులు చేయగల వ్టెిచాకిరి వారికందరకు నాయకుని చేసెను.

29. ఒకనాడు యరోబాము యెరూషలేమునుండి పయనమై వచ్చుచుండగా షిలో నివాసియైన అహీయా ప్రవక్త పొలములోని త్రోవలో అతనిని కలసికొనెను. అప్పుడు వారిద్దరుతప్ప మరి యెవ్వరును అచటలేరు. అహీయా ప్రవక్త క్రొత్త వస్త్రమును వేసుకొనియుండెను.

30. అతడు ఆ క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండుముక్కలుగా చించివేసి యరోబాముతో 31. ”వీనిలో పదిముక్కలు నీవు తీసి కొనుము. యిస్రాయేలుదేవుడైన ప్రభువు ఇట్లను చున్నాడు: ‘ఈ రాజ్యమును సొలోమోనునుండి తొల గించి దానిలో పదితెగలను నీపరము చేసెదను.

32. నా సేవకుడు దావీదునుచూచి, యిస్రాయేలు నేల మీదినుండి నాసొంత నగరముగా ఎన్నుకొనిన యెరూషలేమునుచూచి, ఒక్కతెగను మాత్రము సొలోమోను వశమున నుంచెదను.

33. సొలోమోను నన్ను విడనాడి సీదోనీయుల దేవత అష్టారోతును, మోవాబీయుల దైవమగు కెమోషును, అమ్మోనీయుల దైవమగు మిల్కోమును పూజించెను. అతడు నన్ను ధిక్కరించి నా మార్గమును విడనాడెను. తన తండ్రి దావీదువలె నా ఆజ్ఞలను పాింపడయ్యెను.

34. కాని రాజ్యమంతిని సొలోమోను వశమునుండి తొలగింపను. పైగా నేనెన్నుకొనిన దావీదునుచూచి, అతడు నా ఆజ్ఞలు పాించిన దానినిచూచి సొలోమోను జీవించినంతకాలము అతనిని రాచరికమునుండి తొలగింపను. 35. కాని సొలోమోను కుమారుని వశమునుండి రాజ్యమును తొలగించితీరుదును. నీకు దానిలో పదితెగలను ఇత్తును.

36. సొలోమోను కుమారునికి ఒక్క తెగనిత్తును. ఇట్లు చేసినచో, నా నామమును అచట ఉంచుటకు నేను ఎన్నుకొనిన యెరూషలేమున నా సేవకుడైన దావీదు వంశీయుడు ఒకడు నిత్యము పరిపాలన చేయుచుండును. 37. నిన్ను నేను యిస్రాయేలునకు రాజును చేసెదను. నీకు ఇష్టము వచ్చినంత రాజ్యమును నీవు పరిపాలింప వచ్చును.

38. నీవు పూర్ణహృదయముతో నాకు విధేయు డవై నా మార్గమును అనుసరించుచు నా సేవకుడైన దావీదువలె నా ఆజ్ఞలను పాించెదవేని నేను నీకు తోడుగాయుందును. నిన్ను యిస్రాయేలునకు రాజును చేసెదను. దావీదు వంశీయులవలె నీ వంశీయులును శాశ్వతముగా పరిపాలనము చేయుదురు.

39. ఈ రీతిగా దావీదు వంశీయులకు బుద్ధిచెప్పెదను. కాని నేను వారిని శాశ్వతముగా శిక్షింపను’ ” అని పలికెను.

40. సొలోమోను యరోబామును చంపజూచెను గాని అతడు ఐగుప్తునకు పారిపోయి సొలోమోను మర ణించువరకు షీషకు రాజుచాటున తలదాచుకొనెను.

సొలోమోను పరిపాలనాంతము

41. సొలోమోను జీవితములోని ఇతర అంశ ములు – అతడు చేసినపనులు, అతడు చూపిన విజ్ఞానము ”సొలోమోను చరిత్రము”నందు లిఖింప బడియేయున్నవి.

42. అతడు యెరూషలేము నుండి నలుబది యేండ్లు యిస్రాయేలీయులందరిని పరి పాలించెను.

43. సొలోమోను తన పితరులతో నిద్రించి, తన తండ్రియైన దావీదు నగరమున సమాధి చేయబడెను. అతని తరువాత అతని కుమారుడు రెహబాము అతనికిమారుగా రాజయ్యెను.