అతల్యా పరిపాలన కాలము నుండి ఎలీషా మరణము వరకు

అతల్యా రాణి (841-835)

11 1. అహస్యా తల్లియగు అతల్యా తన కుమారుని హత్యచేసిరని విని రాజవంశజులనందరిని చంపించెను.

2. అహస్యా కుమారుడగు యోవాషు మాత్రము తప్పించుకొనెను. అతనినిగూడ మిగిలిన రాజకుమారులందరితో పాటు చంపియుండెడివారే గాని, యెహోరాము కూతురును అహస్యా చెల్లెలునగు యెహోషెబ బాలుని అతని దాదిని కొనిపోయి  పడుకగదిలో దాచియుంచెను. అతల్యా కంటబడలేదు గనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను.

3. అతల్యా పరిపాలనకాలమున ఆరేండ్లవరకు అతడు దాదితో కూడ దేవాలయముననే దాచియుంచబడెను.

4. ఏడవయేట యాజకుడగు యెహోయాదా సైన్యాధిపతులను ప్రాసాదరక్షకులను దేవాలయము నకు పిలిపించి తన పథకమును అంగీకరించునట్లు వారితో ఒప్పందము గావించి, ఆ ప్రకారము వారిచే ప్రమాణము చేయించెను. అటుపిమ్మట అహస్యా కుమారుడగు యోవాషును వారికి చూపించెను.             

5. అతడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: ”మీరు చేయవలసినదేనమగా, విశ్రాంతిదినమున లోనికి ప్రవేశించు మీరు మూడుభాగములై, ఒకభాగము రాజమందిరమునకు కావలికాయుడు.

6. మరొక భాగము సూరు ద్వారము వద్దను, చివరిభాగము కేడములు ధరించియున్నవారి వెనుక ద్వారము వద్దను ఉండవలెను. ఇట్లు జాగరూకులై మందిరము అన్ని వైపుల కావలియుండవలయును.

7. మరియు విశ్రాంతిదినమున కావలినుండి వెడలిపోవు రెండు భాగములు రాజుచెంత ప్రభువు మందిరమునకు కావలికాయుడు.

8. ఈ రెండు భాగముల వారు ఆయుధములు ధరించి రాజును సంరక్షింపవలయును. మీరు రాజుచుట్టు కాచుకొనియుండి, అతడు ఎటు పోయిన మీరును అటుపోవలయును. మీ దరిదాపు లకు వచ్చు వారినందరిని చంపివేయుడు” అని చెప్పెను.

9. సైన్యాధిపతులు యెహోయాదా చెప్పినట్లే చేసిరి. వారు విశ్రాంతిదినమున కావలి ప్రారంభించు సైనికులను, కావలి ముగించుకొను సైనికులను యెహోయాదా వద్దకు కొనివచ్చిరి.

10. అతడు దేవాలయమున ఉంచిన దావీదు రాజు బల్లెములను, కవచములను వారికి అప్పగించెను.

11. వారు సాయుధులై రాజును రక్షించుటకు దేవాలయము ఉత్తర, దక్షిణములందు కాపుండిరి.

12. అంతట యెహోయాదా రాజకుమారుని కొలువుకాండ్ర ఎదుికి కొనివచ్చెను. అతని తలమీద కిరీటముప్టిె ధర్మ శాస్త్రమును చేతికిచ్చెను. అందరి ఎదుట యోవాషును రాజుగా అభిషేకించి ప్రకించెను. ప్రజలందరు చప్పట్లుక్టొి రాజునకు దీర్ఘాయువని నినదించిరి.

13. ఆ నినాదములు విని అతల్యా పరుగు పరుగున దేవాలయమునకు వచ్చి అచట జనులు ప్రోగైయుండుట గమనించెను.

14. ఆమె పైకిచూడగా ఆనాి ఆచారముచొప్పున రాజు స్తంభము ప్రక్కన నిలుచుండియుండెను. రాజోద్యోగులు, బాకాలనూదు వారు అతని చుట్టు గుమిగూడి ఉండిరి. సామాన్య జనులందరు సంతోషముతో శృంగధ్వనులు చేయు చుండిరి. అతల్యా బట్టలు చించుకొని ”రాజద్రోహము, రాజద్రోహము” అని అరచెను.

15. యెహోయాదా ఆమెను దేవాలయ ఆవరణమున చంపదలుచు కోలేదు. కనుక అతడు ”ఈమెను కావలిబంటుల నడుమనుండి వెలుపలికి కొనిపొండు. ఈమెను రక్షించుటకు వచ్చినవారిని ప్టిచంపుడు” అని సైన్యాధిపతులను ఆజ్ఞాపించెను.

16. వారు ఆమెను పట్టుకొని రాజప్రాసాదములోనికి గుఱ్ఱములు ప్రవే శించు మార్గమున దారిఇచ్చి, అచట ఆమెను వధించిరి.

17. అపుడు యెహోయాదా-ప్రజలు యావేవారని ఆయనపేర రాజుతోను, ప్రజలతోను నిబంధనము చేయించెను. మరియు అతడు రాజుపేర ప్రజలతో నిబంధనము చేయించెను.

18. తరువాత ప్రజలు బాలు దేవళమునకు వెళ్ళి దానిని కూలద్రోసిరి. దాని లోని బలిపీఠములను, విగ్రహములను పగులగ్టొిరి. బాలు పరిచారకుడైన మత్తానును బలిపీఠముల ముందే వధించిరి. యెహోయాదా దేవాలయముచెంత సైన్యమును కాపుంచెను.

19. అటు తరువాత అతడు, రాజోద్యోగులు, సేనాపతులు, ప్రాసాద రక్షకులు, సామాన్యప్రజలు రాజును ప్రదక్షిణముతో ప్రాసాదము నకు కొనిపోయిరి. రాజు కావలిభటుల ద్వారము వెంటపోయి ప్రాసాదము ప్రవేశించి సింహాసనముపై ఆసీనుడయ్యెను.

20. రాజు ప్టాభిషేకమును చూచి జనులందరు హర్షించిరి. నగరము ప్రశాంతముగా నుండెను. అంతకుముందే అతల్యాను ప్రాసాదము చెంత వధించిరిగదా! 21. యోవాషు ఏడేండ్ల ప్రాయ మున యూదా రాజ్యమునకు రాజయ్యెను