నలుగురు రాజులు దండెత్తుట

1. ఆ కాలమున అమ్రాఫేలు షీనారునకు రాజు. అరియోకు ఎల్లాసరునకు రాజు. కెదోర్లాయోమేరు ఏలామునకు రాజు. తిదాలు గోయీమునకు రాజు.

2. వారు నలుగురు ఏకమై సొదొమ రాజయిన బేరాతో, గొమొఱ్ఱా రాజయిన బీర్షాతో, అద్మా రాజయిన సీనాబుతో, సెబోయీము రాజయిన షేమేబేరుతో, బేలా రాజయిన సోయరుతో యుద్ధము చేసిరి.

3. ఇప్పుడు మృతసముద్రముగా ఉన్న సిద్దీములోయలో ఈ రాజులందరు తమతమ సైన్య ములను కలిపివేసిరి.

4. వారు పండ్రెండు ఏండ్లు కెదోర్లాయోమేరు రాజునకు సామంతులుగా ఉండిరి. పదుమూడవయేట తిరుగుబాటు చేసిరి.

5. పదు నాలుగవయేట కెదోర్లాయోమేరు అతని పక్షమున ఉన్న రాజులు దండెత్తి అష్టారోతుకర్నాయీము వద్ద రేఫాయీలను, హామువద్ద సూసీయులను, సావేకిర్యతా యీము వద్ద ఏమీయులను ఓడించిరి.

6.సేయీరునుండి, ఎడారిదాపునగల ఎల్ఫారాను వరకు వ్యాపించియున్న పర్వతప్రదేశములో హూరీయులను ఓడించిరి.

7. వారు వెనుదిరిగి వచ్చుచు నేడు కాదేషు అని పిలువబడు ఎన్మిష్పాత్తు దేశమున ప్రవేశించిరి. అమాలెకీయుల దేశమును, హాససోన్‌తామారులో ఉన్న అమోరీయుల దేశమును వల్లకాడుచేసిరి.

8. అప్పుడు సొదొమరాజు, గొమొఱ్ఱారాజు, అద్మా రాజు, సేబోయీమురాజు, బేలారాజగు సోయరులు ఏకమై సైన్యములను సేకరించుకొనివచ్చి సిద్దీము లోయలో ఏలామురాజగు 9. కెదోర్లాయోమేరును, గోయీము రాజయిన తిదాలును, షీనారు రాజైన అమ్రాఫేలును, ఎల్లాసరు రాజయిన అరియోకును ఎదుర్కొనిరి. ఈ విధముగా అయిదుగురు రాజులు నలుగురు రాజులను ఎదిరించిరి.

10. సిద్దీములోయ, మ్టికీలుగుంటలతో నిండి యుండెను. సొదొమరాజు, గొమొఱ్ఱారాజు యుద్ధ రంగమునుండి పారిపోవుచు ఆ గుంటలలో పడి పోయిరి. మిగిలినవారుకూడ కొండలు ప్టిపోయిరి.

11. శత్రువులు సొదొమ గొమొఱ్ఱా నగరములలోని యావదాస్తిని, వారి ఆహారపదార్థములను వశము చేసికొని వెళ్ళిపోయిరి.

12. వారు అబ్రాము సోదరుని కుమారుడు, సోదొమ నివాసియగు లోతును గూడ బంధించి తీసికొనిపోయిరి. అతని పశుసంపద నంతిని తోలుకొనిపోయిరి.

13. కాని తప్పించు కొనిన వాడొకడు వచ్చి హెబ్రీయుడైన1 అబ్రాముతో జరిగినదంతయు చెప్పెను. అప్పుడు అబ్రాము, అమోరీయుడగు మమ్రేకు చెందిన సింధూరవనము నందు నివసించుచుండెను. ఎష్కోలు, అనేరు అనువారి సోదరుడు మమ్రే. వీరు అబ్రాము పక్షమువారు.

14. సోదరుని కుమారుని చెరప్టిరని విన్న వెంటనే అబ్రాము తన ఇంట ప్టుిపెరిగిన యోధులను మూడు వందల పదునెనిమిది మందిని వెంటపెట్టుకొనివెళ్ళి ఆ రాజులను దాను వరకు తరిమెను.

15. అబ్రాము, అతని అనుచరులు రాత్రివేళ శత్రువులను చుట్టుమ్టుి ఎదుర్కొనిరి. వారిని దమస్కునకు ఉత్తరముగా నున్న హూబా వరకు తరిమి క్టొిరి.

16. ఆ రాజులు తోలుకొనిపోయిన మందలను, బంధువయిన లోతును, అతని స్త్రీలను, అతని యావదాస్తిని, చెరప్టిన ఇతరులను విడిపించి అబ్రాము తిరిగి తీసికొని వచ్చెను.

మెల్కీసెదెకు వృత్తాంతము

17. కెదోర్లాయోమేరును, అతని పక్షమున నున్న రాజులను ఓడించి తిరిగివచ్చుచున్న అబ్రామును కలిసి కొనుటకు సొదొమరాజు షావే లోయకు బయలు దేరెను. షావే లోయను ఇప్పుడు రాజు లోయ అందురు. 18. షాలేము రాజయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షసారాయమును కొనివచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు దేవునకు యాజకుడు.

19. అతడు అబ్రామునకు ఇట్లు దీవెనలు పలికెను: ”సర్వోన్నతుడై, భూమ్యాకాశములను సృష్టించిన దేవుడు

అబ్రామును ఆశీర్వదించునుగాక! 

20. శత్రువులను నీ వశముచేసిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక!” అపుడు అబ్రాము అతనికి తన సమస్తములో పదియవ వంతును అప్పగించెను.

21. అంతట  సొదొమ రాజు ”మనుష్యులను నాకు అప్పగింపుము. వస్తువాహనములను నీవు తీసి కొనుము” అని అబ్రామును అడిగెను.

22. దానికి అబ్రాము ”సర్వోన్నతుడై భూమ్యాకాశములను సృష్టించిన ప్రభుడగు దేవుని యెదుట నా చేయియెత్తి  ప్రమాణ ములు చేసియున్నాను.

23. నీకుచెందిన నూలు పోగునుగాని, చెప్పుల దారమునుగాని, ఇంకదేనినైనను నేను ముట్టను. ఏనాడును నీవు ‘నేను అబ్రామును ధనవంతుని చేసితిని’ అని అనకుందువుగాక!

24. ఈ పడుచువారు తిన్నది మాత్రము నావంతు, నాతో వచ్చిన అనేరు, ఎష్కోలు, మమ్రే అనువారు వారి పాలును వారు తీసికొననిమ్ము” అనెను.

Previous                                                                                                                                                                                                 Next                                                                              

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము