పాపపరిహార బలులను అర్పింపవలసిన సందర్భములు

1. ఎవరినైనను న్యాయస్థానమున సాక్ష్యము చెప్పుమని పిలిచినప్పుడు, అతడు దోషము ఎరిగి యుండియు సాక్ష ్యము చెప్పనియెడల పాపముకట్టు కొనును.

2. ఎవడైనను పొరపాటున అశుచికరమైన వస్తువును, అపవిత్ర మృగకళేబరమును, అపవిత్ర పశువు లేక ప్రాకెడు జంతువు కళేబరమును ముట్టు కొనినయెడల, తన పొరపాటును గుర్తించకపోయినను వెంటనే అశుద్ధుడై పాపము కట్టుకొనును.

3.ఎవడైనను పొరపాటున నరులకు సంబంధించిన అశుచికరమైన వస్తువును ముట్టుకొనినయెడల తన పొరపాటును గుర్తించిన వెంటనే అపరాధి అగును.

4. ఎవడైనను మేలుకైనను, కీడుకైనను, తెలిసి తెలియక మనుజులు మ్లాడు విధమున, లాభ నష్టములు యోచింపక, వ్యర్ధముగా ఒట్టుపెట్టుకున్నచో అది మొదట తెలియకపోయినను, దానిని గ్రహించిన వెంటనే అతడు అపరాధి అగును.

5. పై పాపములలో దేనినైన కట్టుకొనినవాడు తన దోషమును అంగీకరింపవలయును.

6. అతడు తన పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఆడుమేకనో లేక గొఱ్ఱెనో పాపపరిహారబలిగా సమర్పింపవలయును. యాజకుడు అతనికి ప్రాయశ్చిత్తము జరిగింపగా అతడు పాపమునుండి విముక్తుడగును.

సామాన్యజనుల పాపములు

7. పాపము కట్టుకొనిన నరుడు మేకనుగాని, గొఱ్ఱెనుగాని సమర్పింపలేనిచో రెండు తెల్లగువ్వలనో లేక రెండు యువపావురములనో కొనిరావలయును.

8. వానిలో ఒకదానిని పాపపరిహారబలిగా, మరి యొకదానిని దహనబలిగా ప్రభువుసన్నిధికి తేవల యును. యాజకుడు అతనికొరకై పాపపరిహారబలిని మొదట సమర్పించును. అతడు ఆ బలిలో అర్పించు పక్షిని మెడనులిమి చంపవలయును. దాని తలను మాత్రము వేరుచేయరాదు.

9. దాని నెత్తురులో కొంత భాగము బలిపీఠము ప్రక్కన చిలుకరింపవలయును. మిగిలిన రక్తమును బలిపీఠము అడుగుభాగమున పిండవలయును. ఇది పాపపరిహారబలి అగును.

10. యాజకుడు రెండవ పక్షిని నియమము ప్రకారము దహనబలిగా అర్పించును. ఈ రీతిగా యాజకుడు పాపము చేసిన నరునికి ప్రాయశ్చిత్తము చేయగా వాని పాపము పరిహారమగును.

11. కాని రెండు తెల్లగువ్వలను లేక రెండు పావురములను గూడ అర్పింపలేనివాడు కుంచెడు మెత్తని గోధుమపిండిలో పదియవవంతును పాపపరి హారబలిగా కొనిరావలయును. అది పాపపరిహార బలియగును కాని ధాన్యబలి కానేరదు. కనుక దానిమీద ఓలివుతైలముగాని, సాంబ్రాణిగాని ఉండరాదు.

12. అతడు ఆ పిండిని యాజకునివద్దకు కొనిరావలయును. యాజకుడు ఆ పిండిలో పిడికెడు తీసికొని దహనబలితో పాటు దానిని కూడ బలిపీఠము మీద కాల్చివేయును. అది పాపపరిహారబలి అగును.

13. ఈ రీతిగా యాజకుడు పాపముచేసిన నరునికి ప్రాయశ్చిత్తము చేయగా అతని పాపములు పరిహారమగును. మిగిలిన పిండి, ధాన్యబలులందువలె, యాజకునికే చెందును.”

దోషపరిహార బలి

14. ప్రభువు మోషేతో ఇట్లు ఆజ్ఞాపించెను: 15. ”ఎవడైనను పొరపాటున పరిశుద్ధమైన వాి విషయములలో పాపముచేసినచో ఎి్ట అవలక్షణము లేని పొట్టేలును దోషపరిహారబలిగా కొనిరావలయును. దేవాలయపు నాణెముల విలువను ప్రమాణముగా తీసికొని ఆ పొట్టేలునకు విలువకట్టవలయును.

16. అతడు తాను చెల్లింపవలసిన సొమ్మును మరియు అదనముగా ఐదవవంతు సొమ్మును చేర్చి యాజకునకు ముట్టచెప్పవలయును. యాజకుడు పొట్టేలును దోష పరిహారబలిగా సమర్పింపగా, అతని దోషము తీరును.

17. ఎవడైనను పొరపాటున ప్రభువుఆజ్ఞ మీరి పాపము కట్టుకొనినయెడల అతనికి తెలియకుండానే అతడు  దోషియగును.  అతడు తన నేరమును భరించును.

18. అతడు నీవు ఏర్పరిచిన వెలచొప్పున మందనుండి దోషపరిహారబలి కొరకు అవలక్షణ ములు లేని పొట్టేలును యాజకునివద్దకు కొనిరావల యును. అతడు పొరపాటున చేసిన దోషమునకు యాజకుడు ప్రాయశ్చిత్తముచేయగా అతని దోషము పరిహారమగును.

19. అతడు ప్రభువునకు విరోధ ముగా చేసిన దోషమునకుగాను ఇది పరిహారబలి అగును.”

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము